-
'మైనారిటీల కోసం దుల్హన్'
హైదరాబాద్: మైనారిటీ యువతీ, యువకులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి దుల్హన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మైనారిటీ యువతీ యువకులకు వివాహ సమయంలో రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ముస్లిం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం రోషిని ప్యాకేజీ పథకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా తత్కాల్, సూక్ష్మరుణాలు, ఆదరణ, దుకాణ్ మకాన్ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మైనార్టీలంతా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. -
భారీ పెట్టుబడుల్ని సాధిస్తాం: పల్లె రఘునాథ్ రెడ్డి
హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్, ఈ గవర్నెన్స్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లూ ప్రింట్ విడుదల చేసింది. 2020 నాటికి ఐటీరంగంలో రూ.12వేల కోట్లు, ఎలక్ట్రానిక్ రంగంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు సాధించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. పెట్టుబడుల ఆధారంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనుకుంటున్నామని రఘునాథరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజనతో ఎలక్ట్రానిక్ రంగం పూర్తిగా దెబ్బతిందని, 6,500 కోట్ల టర్నోవర్కు గాను ఏపీకి కేవలం 375 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్లో 20 మేనిఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. మెగా ఎలక్ట్రానిక్ ఈవెంట్, ఎలక్ట్రానిక్ బజార్లను విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటుచేస్తామని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement