breaking news
padma reddy
-
టికెట్ నాకే.. ఎమ్మెల్యే నేనే
మెదక్ అర్బన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం నేనే ఎమ్మెల్యే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై నమ్మకం ఉంది. పార్టీ టికెట్ ఎలాగైనా ఇస్తారు. అమ్మవారి దయతో 2029 ఎన్నికల్లో నిజాంపేట బిడ్డగా.. ఎమ్మెల్యేగా మీ ముందుకొస్తానంటూ..’ నిజాంపేటలో ఆదివారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ కార్యక్రమంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో కాక రేపుతున్నాయి. మెతుకుసీమ రాజకీయాల్లో ఉద్యమ నేతగా పేరొందిన పద్మక్క.. ద్వితీయ శ్రేణి నాయకుడి ధిక్కార స్వరంతో కలవరపడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్న ఆశలు.. ఒక్కసారిగా భగ్గుమనడంతో బీ ఆర్ఎస్లో అలజడి మొదలైంది. అయితే ఈ వ్యా ఖ్యల పరిణామాలను ట్రబుల్ షూటర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పుడు నెయ్యం.. ఇప్పుడు కయ్యంగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి రోహిత్రావు రూపంలో పార్టీ షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకులోనైన కంఠారెడ్డి డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మోసం చేసిన కాంగ్రెస్పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో హస్తం పార్టీలో ఉన్న తనవర్గాన్ని బీఆర్ఎస్లోకి తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. కొంతమేర కృతకృత్యుడయ్యాడు. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయం కోసం కృషి చేశారు. కాలం గడుస్తున్నా కొద్ది బీఆర్ఎస్లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. విందులు, వినోదాలతో మరికొంత మందిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నియో జకవర్గానికి దూరంగా ఉన్న సమయాన్ని వినియోగించుకొని కొంతమేర పట్టు పెంచుకున్నాడు. ఆర్థిక సహాయాలు, ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో పరపతిని పెంచుకున్నాడు.ముందుగానే పసిగట్టిన పద్మారెడ్డిమెతుకుసీమ రాజకీయాల్లో ఎదురులేని ఏలికగా నిలిచిన బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, పార్టీలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టారు. ఎమ్మెల్యే పదవిపై ఆశలు పెంచుకుంటున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కదలికలపై కన్నేసి, కౌంటర్ చర్యలు ప్రారంభించారు. పైకి సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా, కంఠారెడ్డితో కలిసి ఉన్న సందర్భాల్లో పద్మారెడ్డి అసౌకర్యంగానే ఉన్నట్లు కనిపించేవారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతిరెడ్డి తన స్వస్థలమైన నిజాంపేటలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలను ప్రస్పుటం చేసేవిగా ఉండటంతో.. రెండు, మూడు రోజుల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పాపన్నపేటకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు.గులాబీ దళంలో పెరిగిన కంఠ స్వరంమెతుకుసీమ బీఆర్ఎస్లోవర్గపోరు కొనసాగుతోంది. తాజాగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. ఈ పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుతెలుస్తోంది. -
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలి
ఆర్మూర్ టౌన్, న్యూస్లైన్ : విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని ఏపీఈఈయూ 1104 రాష్ట్ర యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ పద్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని జిరాయత్ నగర్లో గల మిలన్ ఫంక్షన్ హాలులో ఏపీఈఈయూ ఆర్మూర్ డివిజన్ కమిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పద్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ లో నెలకొన్న సమస్యలపై 1104 అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత కోసం న్యా యపరంగా పోరాటం చేశామన్నారు. ఉద్యోగులు, కా ర్మికుల పదోన్నతులు, డీఏ, బెనిఫిట్స్ అర్హులైన ఉద్యోగులకు అందని పక్షంలో ఆరు నెలల్లో ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. రెండు, మూడు లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ సరిపోవడం లేదని, పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు పలువురు వక్తలు యూనియన్ సమస్యలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్తు ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ నివేదికను చదివి వినిపించారు. అనంతరం డివిజన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ప్రాంతీయ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, నాయకులు లింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, సురేష్ బాబు, నరేంద్ర నాయక్, బి సురేష్, బంజ రాజేంధర్, హరిశంకర్, రాజ్ కుమార్, మధు, నిజామొద్దీన్, గోపి, నర్సయ్య, నాగభూషణం, వాసం శ్రీనివాస్, షకీల్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


