breaking news
P. Vasu
-
చంద్రముఖి 2.. గుమ్మడికాయ కొట్టేశారు!
చంద్రముఖి–2 చిత్ర షూటింగ్ పూర్తి అయింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్ర పోషించిన చంద్రముఖి సినిమా 2005లో విడుదలైంది. అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన చంద్రముఖి చిత్రాన్ని పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనీకాంత్ అంగీకరించకపోవడంతో అదే కథతో తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా నాగవల్లి సినిమా తెరకెక్కించారు. అయితే 18 ఏళ్ల తరువాత చంద్రముఖి –2ను తమిళంలో రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించడం విశేషం. బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో వడివేలు, రాధిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చంద్రముఖి–2 చిత్రంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కారణం రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషించడం జ్యోతిక పాత్రలో కంగనారనౌత్ నటించడంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడమే! And... Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️ 🎬 #PVasu 🌟 @offl_Lawrence @KanganaTeam 🎶 @mmkeeravaani 🎥 @RDRajasekar 🛠️ #ThottaTharani ✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86 — Lyca Productions (@LycaProductions) June 20, 2023 చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు -
లారెన్స్... లక లక లక
పదిహేనేళ్ల క్రితం రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుని సూపర్హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే సీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శక–నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ తెలిపారు. అయితే పార్ట్1లో రజనీ లక లక లక అంటే పార్ట్2లో లారెన్స్ లక లక లక అంటారన్నమాట. ‘‘రజనీకాంత్గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్ పేర్కొన్నారు. మూడు కోట్లు విరాళం మూడు కోట్ల రూపాయలను కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్గా ఇస్తున్నట్లు వెల్లడించారు లారెన్స్. ఈ మూడు కోట్ల రూపాయల్లో యాభై లక్షలను పీఎమ్ కేర్స్ ఫండ్కు, యాభై లక్షలను తమిళనాడు ముఖ్య మంత్రి సహాయనిధికి, ఎఫ్ఈఎఫ్ఎస్ఐ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా)కు యాభై లక్షలను విరాళంగా ప్రకటించారు లారెన్స్. ఇంకా డ్యాన్సర్స్ యూనియన్కు 50లక్షలు, దివ్యాంగులకు పాతిక లక్షలు, తన స్వస్థలమైన రాయపురం దేశియానగర్లోని ప్రజలకు, దినసరి కార్మికులకు 75 లక్షలను విరాళంగా ఇవ్వబోతున్నారు. -
చూడు... రెండో వైపు చూడు!
అనుష్క.. నయనతార.. త్రిష.. తమన్నా.. అంజలి.. పూర్ణ.. ఏంటీ? వీళ్లందరూ కలసి ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు వీళ్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తమ సత్తా చాటారు. ఈ లిస్టులోకి తాజాగా కాజల్ అగర్వాల్ చేరారని చెన్నై టాక్. ‘చంద్రముఖి’ ఫేమ్ పి. వాసు తమిళ, తెలుగు భాషల్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందనుకున్నారట. కాజల్ను కలిసి కథ వినిపించారని కోలీవుడ్ సమాచారం. లేడీ ఓరియంటెడ్ మూవీ, అది కూడా వాసులాంటి సీనియర్ డైరెక్టర్.. మరి కాజల్ కాదంటారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని భోగట్టా. ఈ బ్యూటీ కథానాయిక అయి పదేళ్లకు పైనే అయింది. ఇన్నేళ్లూ ఒకవైపు చూశాం.. ఇప్పుడు కథానాయికగా రెండో వైపు చూడనున్నాం అన్నమాట. -
నయన్బాటలో...
తమిళసినిమా: నయనతార, త్రిషల బాటలో పయనించడానికి నటి కాజల్అగర్వాల్ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. 10ఏళ్లు 50కి పైగా చిత్రాలు = అగ్ర కథానాయకి. ఇదీ క్లుప్తంగా నటి కాజల్అగర్వాల్ కేరీర్. కోలీవుడ్లో బోమ్మలాట్టం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా ద్వారా నటిగా మలచబడిన ఉత్తరాది భామ కాజల్. చాలా చిత్రాల్లో గ్లామర్కే పరిమితం అయిన ఈ బ్యూటీలోని ప్రతిభను వెలికి తీసిన చిత్రం మగధీర అని చెప్పవచ్చు. అప్పటి వరకూ కోలీవుడ్లో ఫేమ్ లేని ఈ అమ్మడికి ఇక్కడా క్కాక పుట్టించిన చిత్రం అదే అదే అవుతుంది. ఆ తరువాత కోలీవుడ్లో విజయ్తో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుని టాప్ హీరోయిలన్ల లిస్ట్లో చేరింది. ప్రస్తుతం అజిత్కు జంటగా వివేగం చిత్రాన్ని పూర్తి చేసి, విజయ్తో మెర్సల్ చిత్రం చేస్తోంది. కాగా ఆదిలో ఇలా నటించిన నటి నయనతార, త్రిషలు ఆ తరువాత స్టార్డమ్ తెచ్చుకుని హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగారు. తాజాగా కాజల్అగర్వాల్కు అలాంటి అవకాశం తలుపు తట్టిందన్న టాక్ సోషల్మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్ నుంచి దాదాపు అందరు హీరోలతోనూ దక్షిణాది భాషలన్నిటిలోనూ చిత్రాలు చేసిన సీనియర్ దర్శకుడు పీ.వాసు తెరకెక్కించిన శివలింగ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆయన తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సారి హీరోయిన్ సెంట్రిక్ పాత్రతో కూడిన విభిన్న కథా చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో నటి కాజల్ అగర్వాల్ను కథానాయకిగా ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ఈ చిత్రం కాజల్అగర్వాల్ నట కేరీర్ను మరో మలుపు తిప్పే చిత్రం అవుతుందని వేరే చెప్పాలా? -
జ్ఞాపకాలు హౌస్ఫుల్
దేవుడు కట్ చెప్పాడు. విధాత కదా... చెబుతాడు. ప్రేక్షకులం కదా... మనం నొచ్చుకుంటాం. ఇంకో వంద సీన్లుంటే బాగుండు... అనుకుంటాం. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలిచ్చినా దాసరి లేకపోవడాన్ని భరించలేకపోతున్నాం. మానవ సంబంధాలను అల్లి... తెలుగు సినిమాకు కండువాగా వేసి వెళ్లిన దర్శకుడు... దార్శనికుడు దాసరి. దాసరి గారూ... మీరూ– మీ సినిమా మీరూ – మీ ప్రేమ మీరూ – మీ పరంపర ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ హార్ట్ఫుల్... హౌస్ ఫుల్. ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన... డైలాగులతో పైకి వచ్చిన దాసరి పాటను పట్టుకున్నాడట. సంగీత ప్రధానమైన సినిమా తీస్తున్నాడట. ‘ఆ.. ఆయన వల్ల కాదు’ అనుకున్నారు ప్రత్యర్థులు. ‘మేఘసందేశం’ రిలీజైంది. అవును... డైలాగులనే నమ్ముకున్న దాసరి అసలు డైలాగులకే ప్రాధాన్యం ఇవ్వకుండా గొప్ప భావుకత్వంతో సంగీత ప్రధానంగా సినిమా తీయగలడని నిరూపించుకున్నాడు. ఆ సమయంలోనే ఒక తమిళ దర్శకుడు ఈ సినిమా గురించి విని దాసరితో కలిసి ప్రత్యేకంగా ఆ సినిమాను చూశాడు. సినిమా పూర్తయ్యాక ‘ఇన్స్పైర్ అయ్యాను నారాయణరావ్’ అని మెచ్చుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఆయన తమిళంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను తీశాడు. దాని పేరు ‘సింధుభైరవి’. ఆ దర్శకుడు కె. బాలచందర్. … తమిళంలో వచ్చిన గొప్ప దర్శకుడు శంకర్. భారీ సినిమాలు జనరంజక సినిమాలు తీయడంలో పేరు సాధించాడు. ఆయన కమలహాసన్తో ఒక సినిమా తీశాడు. స్వాతంత్య్ర సమరయోధుడొకడు వర్తమాన సమాజంలో పేరుకునిపోయిన అవినీతిని చూసి దాని మీద పోరాటం మొదలుపెడతాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా డబ్బు సంపాదించింది. కాని – దాసరి నారాయణరావు అదే సినిమాను చాలా కాలం క్రితమే తీసేశారు. పేరు సర్దార్ పాపారాయడు. అలాంటి కథాంశమే శంకర్ చేతిలో పడి ‘భారతీయుడు’గా బయటికొచ్చింది. … పి.వాసు అంటే తమిళంలో పెద్ద దర్శకుడు. రజనీకాంత్ను హీరోగా పెట్టి, విజయశాంతిని హీరోయిన్గా పెట్టి ‘మన్నన్’ అనే సినిమా తీశాడు. తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ అని రీమేక్ చేస్తే ఇక్కడా పెద్ద హిట్. కాని ఈ సినిమాను కన్నతండ్రి దాసరినారాయణరావే. కృష్ణంరాజు కార్మికవర్గ నాయకుడిగా, జయప్రద ఫ్యాక్టరీ యజమానిగా ఆయన తీసిన ‘సీతారాములే’ మళ్లీ తారలను మార్చుకుని తెర మీదకు వచ్చింది. … మణిరత్నం గ్రేట్ డైరెక్టరే. ‘దళపతి’ సినిమా తీశాడు. ఈ కథ భారతంలో కర్ణుడి ఉదంతం. కాని దాసరి నారాయణరావు ఇంకా గ్రేట్. దాని కంటే చాలా ఏళ్ల ముందే అదే కథాంశాన్ని ‘కటకటాల రుద్రయ్య’గా తీశారు. హుందాగా బతికారు... అలానే వెళ్లిపోయారు-మోహన్బాబు గురువుగారు హఠాత్తుగా ఇలా కనుమరుగవుతారని ఊహించలేదు. ఆయనకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఆపరేషన్ చేయించుకుని, ఇంటికి వచ్చేస్తా అనుకునేవారు. మొదటిసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆయన ఇంటికి తిరిగొచ్చాక నేను ప్రతి రోజూ వెళ్లకపోయినా ఫోన్ చేసి, క్షేమసమాచారాలు తెలుసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ వెళుతుండేవాణ్ణి. అప్పుడు ‘ఇదిగో నిలబడ్డా చూడు.. నడుస్తున్నాను కూడా’ అని నాలుగు అడుగులు వేసి, చూపించేవారు. ఒకవేళ అలా చేయకపోతే, ‘ఏంటి గురువుగారూ.. నిలబడాలి, నడవాలి’ అని దబాయించేవాణ్ణి. అప్పుడు నడవడానికి ప్రయత్నించేవారు. ఆయన చాలా హుందాగా బతికారు. గురువుగారి అంతిమ క్రియలు కూడా అంతే హుందాగా జరిగాయి. అది నాకు తృప్తిగా ఉంది. ఆయన మరణవార్త విన్న వెంటనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్గారికి విషయం తెలియజేశారు. కేసీఆర్గారు గురువుగారి పట్ల చూపించిన మర్యాద అద్భుతం, అమోఘం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హాస్పిటల్ నుంచి ఇంటి వరకు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఇంటి దగ్గర విపరీతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ లాంఛనాలతో దాసరిగారి అంత్యక్రియలను నిర్వహించారు. ఒక వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయాలంటే కేబినేట్ మీటింగ్ పెట్టాలని ఇంకోటని... ఇంకోటని రకరకాలు చెప్పి, తప్పించుకుంటారు. కానీ, విషయం తెలిసిన కాసేపటికి అన్నీ ఏర్పాటు చేశారు. మా గురువుగారి పట్ల చూపించిన ఆదరాభిమానాలను నేను మరచిపోలేను. … దర్శకులు చాలా మంది ఉండొచ్చు. దాసరి నారాయణరావు మాత్రం ‘దర్శకులకే దర్శకుడు’ . … చిత్ర పరిశ్రమలో ఒక ఘనమైన పరంపర ఉంది. అది ప్రొడక్షన్ హౌస్ల పరంపర. ఇది వాహినివారి చిత్రం... ఇది విజయా వారి చిత్రం... ఇది ఏవీఎం వారి చిత్రం... సినిమా– ప్రొడక్షన్ హౌస్ వారిది. పోస్టర్ మీద ప్రొడక్షన్ హౌస్ ఎలివేట్ అవుతుండేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఎలివేట్ అయ్యేవారు. దర్శకుడు అనేవాడు ఆ ప్రొడక్షన్లో ఒక ఉద్యోగి హోదాలో ఉండేవాడు. ఈ పరంపరలో ఉంటూనే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న దర్శకుడు కె.వి.రెడ్డి. మరో నలుగురైదుగురు ఈ స్థాయికి దగ్గరగా ఉన్నా పోస్టర్ మీద పేరును పైకి చేర్చిన తెలుగు దర్శకుడు మాత్రం దాసరి నారాయణరావు. తమిళంలో ఆయన కంటే కొద్దిగా ముందు కె.బాలచందర్ ఇదే పనిని చేశాడు. పోస్టర్లో ఒక ‘ఫిల్మ్ ముక్క’లో ఆయన పేరు కనిపిస్తే ఇక్కడ తెలుగులో ఒక ‘మబ్బు తుంట’లో దాసరి నారాయణరావు పేరు కనిపించేది. ఓడలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నా కెప్టెన్ పై అంతస్తులో ఉండి ఓడను నడిపిస్తాడు. సినిమాలో దర్శకుడిది కూడా పై స్థానమే అని దాసరి చిత్ర పరిశ్రమకు చెప్పగలిగారు. నిర్మాత గౌరవం నిర్మాతకు ఇస్తూ దర్శకుడుగా తాను పొందాల్సిన గౌరవాన్ని పొందినవారు దాసరి నారాయణరావు. అంతేకాదు భిన్న శాఖలను ఒక్క మనిషే నిర్వహించవచ్చు అని ఆయన నిరూపించారు. సాధారణంగా ఒకప్పుడు దర్శకుడంటే కథ కోసం ఒక మనిషి దగ్గరకు, మాటల కోసం మరో మనిషి దగ్గరకు, పాటల కోసం వేరో మనిషి దగ్గరకు, స్క్రీన్ ప్లే కోసం ఇంకో మనిషి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దాసరి నారాయణరావు వచ్చి అవన్నీ తానే చేసుకోగలను అని చేసి చూపించారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి నారాయణరావు అని టైటిల్స్ చివర పడటం ప్రేక్షకులు అబ్బురంగా చూడటం మొదలుపెట్టారు. నా ఫ్యామిలీకి మంచి గైడ్-జయసుధ కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకున్నాను. అందుకే మే 29న నేను విదేశాలకు వెళ్లాను. 30న దాసరిగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసేసరికే ఆలస్యం అయింది. చివరి చూపు కోసం వచ్చేద్దామంటే నేనిక్కడికి వచ్చే లోపే ఆయన అంతిమ క్రియలు జరుగుతాయని తెలిసింది. చాలా బాధపడ్డాను. దాసరిగారు నా కుటుంబానికి పెద్దదిక్కు లాంటివారు. ఆయన నాకు ‘ఫాదర్ ఫిగర్’. నా లైఫ్కి గైడ్. నితిన్గారికి, నాకూ పెళ్లి చేసింది ఆయనే. దాసరిగారి దగ్గరే మా ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చేసేవారు. అప్పుడే మేము ప్రేమలో పడ్డాం. మాకు అండగా దాసరిగారు నిలబడ్డారు. అప్పటి నుంచి మాకే సమస్య వచ్చినా ఆయన దగ్గర చెప్పుకునేవాళ్లం. మా ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినప్పుడు దాసరిగారు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. కానీ, నితిన్గారు డిప్రెషన్ నుంచి బయట పడలేకపోయేవారు. నితిన్గారి మరణం నాకు పెద్ద షాక్ అయితే... దాసరిగారి మరణం ఇంకో షాక్. బహుశా నేనిక్కడ ఉండి ఉంటే... ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయి ఉండేదాన్ని. అందుకే ఆ దైవమే నన్ను తీర్థయాత్రలకు పంపించాడేమో అనిపిస్తోంది. దాసరిగారు దూరం కావడం ద్వారా ఇండస్ట్రీలో ఓ ‘పెద్ద వాయిస్’ మిస్ అయింది. ఇతరుల కోసం ఫైట్ చేసేవాళ్లు ఎవరున్నారు చెప్పండి? ఈ భూమ్మీద నిర్వహించాల్సిన పనులన్నింటినీ ఆయన సక్రమంగా చేశారు. బతికి ఉండగానే దాసరిగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ఇతరుల కోసం జీవించారు. అందరి మనసుల్లో జీవించే ఉంటారు. … ఒక గురువును గురువు అని చెప్పాలంటే ఆయన పరంపర ఎలా సాగుతుందనేది చూడాలి. చరిత్రలో కొందరు గొప్పవారు తమ పరంపరను కొనసాగించగలిగే శిష్యులను ఇవ్వలేదు. దర్శకులలో కూడా బాపు, కె.విశ్వనాథ్, వంశీ వంటివారు తాము నిత్య విద్యార్థులుగా ఉంటూ శిష్యపరంపరను కొనసాగించే ఆనవాయితీకి దూరంగా ఉన్నారు. కాని దాసరి నారాయణరావు అలా కాదు. ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టుగా శిష్యులను ఉత్పత్తి చేశారు. ఒక దర్శకుడు వంద సినిమాలు తీయడం అతి గొప్ప. దాసరి ఆ ఘనతను చిటికెలో సాధించారు. ఆ దర్శకుడి శిష్యుడు కూడా వంద సినిమాలు తీయడం విడ్డూరం. కాని కోడి రామకృష్ణ ఆ ఘనతను సాధించి గురువుకు దక్షిణ చెల్లించారు. వంద సినిమాలు తీసిన గురుశిష్యులు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే లేరు. కోడి రామకృష్ణ అనే ఏముంది రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎం.ఎస్.కోటారెడ్డి. ధవళ సత్యం, రాజా చంద్ర ఇలా ఎందరో దర్శకులు దాసరి దగ్గర తయారయ్యారు. దర్శకత్వం జోలికి రాకుండా కో డైరెక్టర్లుగా వెలిగినవారు మరెందరో. ఆయన శ్రామికుల హీరో -జయప్రద దాసరిగారి గురించి మాట్లాడాలంటే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. ఆయనకు ఆపరేషన్ జరిగే ముందు ఆస్పత్రికి వెళ్లి, కలిశాను. ‘‘మంచి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు సార్.. గెట్ వెల్ సూన్’’ అంటే, ‘‘అలాగే’’ అని నవ్వారు. కాసేపయ్యాక ‘‘నీకు ఫ్లైట్కి టైమ్ అవుతోంది కదా... వెళ్లు... ఏం ఫర్వాలేదులే జయా’’ అన్నారు. దాసరిగారితో నేను మాట్లాడిన చివరి మాటలవే. నేను ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు. దాసరిగారు చనిపోయినప్పుడు ఇక్కడ లేను. చివరి సారి చూద్దామనుకుంటే ఫ్లైట్ టికెట్స్ దొరక్క రాలేకపోయాను. అందుకే ఈ రోజు పెద్ద కర్మను మిస్ కాకూడదనుకున్నా. దాసరిగారు పైకి గంభీరంగా కనిపించే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు. ‘విశ్వనాథ నాయకుడు’ షూటింగ్ అప్పుడు నేను ఒకరోజు ఆలస్యంగా షూటింగ్కి వెళ్లాను. సాంగ్ షూట్ అన్నమాట. మేకప్ హెవీగా చేసుకోవాల్సి వచ్చింది. హెయిర్ సై్టల్కి చాలా టైమ్ పట్టేసింది. లొకేషన్కి వెళ్లాక, దాసరిగారు ఏం మాట్లాడలేదు. సాంగ్ షూట్ మొదలైంది. డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ వేయడం మొదలుపెట్టాను. మాస్టర్ ‘ఓకే’ అంటున్నారు కానీ, దాసరిగారు మాత్రం ‘కట్’ అనేవారు. అలా పదీ పదిహేను టేక్స్ అయ్యాయి. దాంతో ‘సార్.. మాస్టర్ చెప్పినట్లే చేస్తున్నాను కదా.. ఏదైనా ప్రాబ్లమా?’ అనడిగితే, గట్టిగా నవ్వేశారు. ‘‘నువ్వు లేట్గా వచ్చావు కదా జయా.. అందుకే’’ అన్నారు. నా మీద అలిగారని అప్పుడు అర్థమైంది. ఇద్దరం నవ్వుకున్నాం. లొకేషన్కి వెళ్లగానే, ‘ఏంట్రా జయా... ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించేవారు. ఇక ఆ పిలుపు వినపడదంటే బాధగా ఉంది. దాసరిగారు శ్రామికుల హీరో. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. … కొందరు నటులు కొందరు దర్శకులకు సూట్ అవుతారు. లేదా కొందరు దర్శకులు కొందరు నటులకు సూట్ అవుతారు. దాసరి కూడా కొందరు నటీనటులతోనే ఎక్కువగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు. కమెడియన్గా ఉన్న రాజబాబు అంటే దాసరికి ఇష్టం. ఆయనను దాసరి ‘తాత–మనవడు’, ‘తిరుపతి’, ‘యవరికి వారే యమునా తీరే’ సినిమాలలో హీరోగా చేశారు. మురళీమోహన్ సినీ జీవితంలో స్థిరపడటానికి కారణం దాసరి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ప్రభంజనంలో మురళీమోహన్ తనకుంటూ సినిమాలు మిగుల్చుకోగలిగారంటే దాసరి వాత్సల్యమే కారణం. దాసరి– మురళీమోహన్ కాంబినేషన్లో ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘ముద్దబంతిపువ్వు’, ‘ఓ మనిíషీ తిరిగి చూడు’, ‘ఇదెక్కడి న్యాయం’, ‘అద్దాల మేడ’ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మోహన్బాబుకు సినిమా జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాసరి–మోహన్బాబు కాంబినేషన్లో ‘స్వర్గం–నరకం’, ‘శివరంజని’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘ప్రేమాభిషేకం’, ‘దీపారాధన’ వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఆర్.నారాయణమూర్తి, శ్రీహరి, ఈశ్వరరావు... వీరంతా దాసరి నీరు పోసి పెంచిన మొక్కలు. కాని దాసరి అనగానే వెంటనే తలుకోవడానికి వచ్చే పేరు అక్కినేనే. ఒక సందర్భంలో కె.రాఘవేంద్రరావు– ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాలు ఎక్కువగా వచ్చేవి. పారలల్గా దాసరి–అక్కినేని కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చేవి. రాఘవేంద్రరావు ఎన్టీఆర్తో ‘అడవిరాముడు’ ఇస్తే దాసరి అక్కినేనితో ‘ప్రేమాభిషేకం’ ఇచ్చారు. రాఘవేంద్రరావు ‘జస్టిస్ చౌదరి’ ఇస్తే దాసరి ‘రాముడు కాదు కృష్ణుడు’ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాల్లో యాక్షన్, గ్లామర్ ఉంటే దాసరి సినిమాల్లో మెసేజ్, డ్రామా ఉండేది. తెలుగులో కమర్షియల్ సినిమా తరాజును దాసరి ఎప్పుడూ తన సినిమాలతో సరిచేస్తూ ఉండేవారు. తెలుగు సినిమాల్లో కథ అంటూ ఒకటి బతికి ఉండటానికి దాసరి చాలా ముఖ్యమైన ఒక కారణం. … దాసరి తన జీవిత కాలంలో ఒక రోత పుట్టించే హారర్ సినిమా తీయలేదు. తన జీవిత కాలంలో ఒక అశ్లీలమైన మాటను రాయలేదు. తన జీవితకాలంలో కుటుంబాలు చూడటానికి ఇబ్బంది పడే సినిమా తీయలేదు. తెలంగాణ భాషను కొందరు కొన్ని సినిమాల్లో వినోదానికీ విలనిజానికీ వాడుకుంటే దాసరి తెలంగాణ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు. తెలం గాణ గొప్పతనం చూపే ‘ఒసే రాములమ్మ’, ‘సమ్మక్క–సారక్క’ సినిమాలు తీశారు. వర్కింగ్ క్లాస్ అంటే దాసరికి ముందు నుంచి అభిమానమే. అందుకే ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘ఏడంతస్తుల మేడ’, ‘సూరిగాడు’, ‘ఎంకన్నబాబు’, ‘ఒరేయ్.. రిక్షా’, ‘మేస్త్రీ’ వంటి సినిమాలు తీశారు. ఇక ఆయన స్త్రీ పక్షపాతి. ఆడవాళ్ల కోసం తీసిన సినిమాలకు లెక్క లేదు. ‘బంట్రోతు భార్య’, ‘రాధమ్మ పెళ్లి’, ‘యవ్వనం కాటేసింది’, ‘కన్యాకుమారి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘స్వప్న’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘కాంచనసీత’, ‘అమ్మ రాజీనామ’, ‘అక్క పెత్తనం–చెల్లెలి కాపురం’, ‘కంటే కూతుర్నే కను’... ఇన్ని సినిమాలు తీశారు. ఆయన చిన్న సినిమాల పెద్ద దర్శకుడు. పెద్ద సినిమాల పెను దర్శకుడు. మీడియం బడ్జెట్ ఆయనకు కొట్టిన పిండి. ఓవర్ బడ్జెట్ ఆయన డిక్షనరీలో లేదు. … దాసరి నారాయణరావు మే 30న మరణించారు. కాని ఆయన అసలైన ఘన జీవితం ఆ రోజు నుంచే తిరిగి ప్రారంభమైంది. కొత్త తరాలు, భావితరాలు ఈ దర్శక శిఖరాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం, ఆయన వేసిన దారిని తిరిగి కనగొనడం, ఆ సాధించిన ఘన విజయాలను పునర్ మూల్యాంకనం చేయడం ఇప్పుడే సరిగ్గా మొదలవుతుంది. మహారథం ఆగినప్పుడే అది ఎంత దూరం ప్రయాణించిందో అంచనాకొస్తుంది. … దాసరి సినీ ఘనతను ఇప్పుడు సరిగ్గా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. ఆయన పేరున ఒక యూనివర్సిటీని తెరవాల్సిన సందర్భం వచ్చింది. దాసరి అనే పేరు వెలుతురులో ఎన్నో కొత్త తారలు, కలాలు, దర్శక దివ్వెలు వెండితెరను వెలిగించాల్సిన సన్నివేశం వచ్చింది. అది జరిగినప్పుడే ఆ దర్శకుడికి అది సినీ పరిశ్రమ అర్పించే ప్రేమాభిషేకం అవుతుంది. నిజమైన కృతజ్ఞతాభివందనం అవుతుంది. వందనం అభివందనం దాసరికి స్మరణాభి వందనం. ఆయన ఓ ఇన్స్టిట్యూషన్ దాసరిగారి డైరెక్షన్లో నేను పది సినిమాల వరకు చేశాను. ఆయనతో నేను చేసిన ఫస్ట్ మూవీ ‘బహుదూరపు బాటసారి’. మల్టీస్టారర్ మూవీ అన్నమాట. దాసరిగారి సినిమాల గొప్పతనం ఏంటంటే.. చిన్న పాత్ర అయినా ఆ పాత్ర చేసిన ఆర్టిస్ట్కి మంచి గుర్తింపు వస్తుంది. అలా నాకు ‘బహుదూరపు బాటసారి’ మంచి పేరు తెచ్చింది. మిగతా డైరెక్టర్స్కి, ఈయనకీ ఉన్న తేడా ఏంటంటే.. దాసరిగారు ఒక డైలాగ్ ఇచ్చి, ‘‘ఈ డైలాగ్ని ఎలా చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే, వాటి గురించి చెప్పేవారు. ఆయన డైరెక్షన్లో చేసిన వాటిలో నాకు ‘తిరుగుబాటు’ సినిమా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, అందులో నాది పూలన్ దేవి టైప్ క్యారెక్టర్. ‘ఈ క్యారెక్టర్ చేయగలనా’ అని నాలో నేనే అనుకున్నాను. పైగా లెంగ్తీ డైలాగ్స్ ఉండేవి. అవి చెప్పగలనా అని సందేహం. అది గమనించి, దాసరిగారు ‘‘ఏంటీ... చేయలేననుకుంటున్నావా? నువ్వు అమ్మాయిని అనే సంగతి మరచిపో. నిన్ను నువ్వు చిరంజీవి అనుకో. హీరోని అనుకుని చేసేయ్’’ అన్నారు. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఆ పాత్రను సునాయాసంగా చేసేశాను. నటీనటులకు ఆయన చెప్పే విధానం చాలా క్లియర్గా ఉంటుంది. దాసరిగారు ‘హార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ’. తెలుగు సినిమాకి ఇన్స్టిట్యూట్ లాంటివారు. ఆయన మరణం తీరని లోటు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గొప్ప నటులందరూ దర్శకులు తీర్చిదిద్దినవారే
ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న వారందరూ దర్శకుల చేత మలచబడ్డవారేనని ప్రముఖ దర్శకుడు పి.వాసు వ్యాఖానించారు. ఆయన వారసుడు శక్తివేల్ వాసు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 7 నాట్కళ్. మిలియన్ డాలర్ మూవీస్ పతాకంపై కార్తీక్, కార్తీకేయన్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నికీషాపటేల్,అంగనారాయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఆ చిత్రం ద్వారా నవ దర్శకుడు గౌతమ్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుందర్.సి వద్ద సహాయదర్శకుడిగా పనిచేశరన్నది గమనార్హం. అంతే కాదు ఒక షార్ట్ ఫిలిం తీసిన అనుభవం ఉంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం స్థానిక సాలిగ్రామంలో గల ప్రసాద్ల్యాబ్లో జరిగాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ ఈ 7 నాట్కళ్ చిత్ర కథను తాను విన్నానని చెప్పారు. కథ చాలా బాగుంది. జనరంజకమైన అంశాలన్నీ చోటు చేసుకున్నాయని దీన్ని దర్శకుడు, నిర్మాతలు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా రూపొందించాలని కోరారు. ఈ తరం సహాయ దర్శకులు షార్ట్ ఫిలింస్ తీసి తమ సత్తాను చాటుకుని దర్శకులతో తమ ప్రతిభ మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అంటున్నారన్నారు. తమ కాలంలో ఇలాంటి పరిస్థితిలేదన్నారు.తాను దర్శకుడు శ్రీధర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరిన ఆరు నెలల తరువాత కూడా నువ్వు ఎవరివి అని ప్రశ్నించారని అన్నారు. అప్పట్లో ఆయన తనను పేరు పెట్టి పిలవడం చాలా అరుదని తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న వారందరూ దర్శకుల చేత మలచబడిన వారేనని పేర్కొన్నారు. నటుడ శక్తివేల్కు అలా మంచి నటుడనే సయమం ఆసన్నమైందని అన్నారు. తానిప్పుడు శక్తివేల్ నటిస్తున్న కథలను వినడం లేదన్నారు. అయితే అతనితో చిత్రాలు చేస్తున్న నిర్మాతల గురించి తెలుసుకుంటానని అన్నారు.7 నాట్కళ్ మంచి చిత్రంగా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు గౌతమ్ కథను నెరేట్ చేసిన విధం తనను విపరీతంగా ఆకట్టుకుందని, అందువల్లే ఈ 7నాట్కళ్ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు కథానాయకుడు శక్తివేల్ వాసు పేర్కొన్నారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం ఎంఎస్.ప్రభు,సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. -
లారెన్స్కు జంటగా అనుష్క?
ఒక క్రేజీ కాంబినేషన్తో భారీ చిత్రానికి కోలీవుడ్లో అడుగులు పడుతున్నాయన్నది తాజా సమాచారం.డాన్సింగ్ కింగ్,సంచలన విజయాల దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్, అందాల ముద్దుగుమ్మ అనుష్క జంటగా ఒక భారీ చిత్ర నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.తమిళంలో మన్నన్, చంద్రముఖి వంటి పలు సూపర్హిట్ చిత్రాల సృష్టికర్త పి.వాసు ఈ మధ్య కన్నడం, తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. కన్నడంలో ఈయన రవిచంద్రన్ నవ్యానాయర్ జంటగా దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ తరువాత శివరాజ్కుమార్ వేదిక హీరోహీరోయిన్లుగా శివలింగ చిత్రానికి దర్శకత్వం వహించారు. అది అక్కడ ఘన విజయం సాధించింది. దీన్ని తమిళ రీమేక్లో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు దర్శకుడు పి.వాసు ప్రత్యేకంగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి చూపించడంతో ఈ ప్రచారం జరిగింది. తాజా శివలింగ తమిళ రీమేక్లో లారెన్స్ను హీరోగానూ ఆయనకు జంటగా నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శివలింగ చిత్రం కన్నడంలో పెద్ద విజయం సాధించింది కనుక దాని రీమేక్లో నటించడానికి లారెన్స్,అనుష్క అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని తెలుస్తోంది. దీనికి చంద్రముఖి-2 అని టైటిల్ను నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే లారెన్స్ ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటిస్తున్నారు.నటి అనుష్క బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక శివలింగ చిత్ర రీమేక్ విషయం గురించి అధికారిక వార్త వెల్లడికాలేదన్నది గమనార్హం. -
సెప్టెంబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు రమ్యకృష్ణ (నటి), పి. వాసు (దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధసంఖ్య. పుట్టిన తేదీ 15. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడి, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరు పుట్టిన తేదీ శుక్రసంఖ్య అయినందువల్ల జీవితం ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతుంది. వివాహ యత్నాలలో ఉన్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఐశ్వర్యా.. వెయ్యి కాకులు!
ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా తమిళ, తెలుగు భాషల్లో పి.వాసు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఐశ్వర్య కోసం వాసు ఒక అద్భుత కథను తయారు చేశారట. ఈ కథ విని, ఐష్ ఎగ్జయిట్ అయ్యారని వినికిడి. ఈ చిత్రానికి తమిళంలో ‘ఐశ్వర్యావుం ఆయిరమ్ కాక్కావుమ్’ అనే పేరును నిర్ణయించారట. అంటే.. ఐశ్వర్యా.. వెయ్యి కాకులు అని అర్థం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రానటువంటి అద్భుత కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రానికి యానిమేషన్ సన్నివేశాలను రూపొందించడానికి పలు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ సంస్థలతో పి. వాసు చర్చిస్తున్నట్లు తెలిసింది. షూటింగ్ను కాంబోడియాలో వేసిన భారీ సెట్లోను, కొండ ప్రాంతాల్లోను జరపనున్నారట. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ సరసన నటించే ఇద్దరు ప్రముఖ హీరోల ఎంపిక జరుగుతోందట. ఇందులో పలు సాహస పోరాట సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఐష్ ఫైట్స్లో శిక్షణ తీసుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ప్రియమణి హీరోయిన్గా ‘చారులత’ చిత్రాన్ని నిర్మించిన గ్లోబల్ ఒన్ స్టూడియోస్ అధినేత కె.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెన్నయ్ టాక్.