-
మన్ననూర్ ‘మచ్చ’లకు బ్రాండింగ్!
ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు కోనేరు స్వచ్ఛంద సంస్థ, వాస్స న్ సంస్థల సహకారం తో ఈ జాతిని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పెద్ద ఎత్తున పరిశోధ నలు జరుగుతున్నాయి. నాగర్కర్నూల్ నుంచి బక్షి శ్రీధర్రావు : ఒంగోలు గిత్తకు ఏమాత్రం తక్కువ కాకుండా పలు జన్యు ప్రత్యేకతలు కలిగి ఉండి నల్లమల అటవీ ప్రాంతానికే పరిమిత మైన అతి అరుదైన మన్ననూర్ మచ్చల పశువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, మన్ననూర్, బి.లక్ష్మా పూర్ ప్రాంతాల్లోని మచ్చల పశువులను సంరక్షించేందుకు ప్రత్యే కంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది బి.లక్ష్మాపూర్లో మొదటి పశువుల ప్రదర్శన నిర్వహించింది. ♦ మన్ననూరు మచ్చల పశువుల అభి వృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఆర్గనై జింగ్ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా పశువుల పెంపకందారులతో ఓ అసోసియేషన్ను ప్రారంభించారు. ♦ ఈ పశువులను సంరక్షిస్తున్న రైతాంగానికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారు. మచ్చల కోడెల వీర్యాన్ని సేకరించి వాటి సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ♦ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన్ననూర్ పొడలను రాష్ట్ర పశువుగా గుర్తించింది. తెలంగాణ జీవ వైవిధ్య విభాగం ప్రతినిధు లు ఈ పశువులోని ప్రత్యేకతలు మరే ఇతర పశువుల్లోనూ లేవని తేల్చి చెప్పారు. ♦ ఎంతటి కరువునైనా తట్టుకుంటాయని, వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకునే తెలివైన పశువులని నాగర్కర్నూల్ జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి అంజిలప్ప చెప్పారు. వ్యవసాయం, పాడికి ఉపయోగం.. సహజసిద్ధంగా అడవుల్లోని కొండల్లో నివ సించే మచ్చల పశువులు పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వీటిని మన్ననూర్, అమ్రా బాద్, బి.లక్ష్మాపూర్, అచ్చంపేట, లింగాల ప్రాంతాల్లోని రైతులు మచ్చిక చేసుకుని వ్యవసాయ, పాడి అవసరాలకు ఉపయోగిస్తు న్నారు. చెంచులు, గిరిజన రైతులు వీటిని తూర్పు పొడలు, మచ్చల పసురాలు అంటా రు. వీటి కాలి పిక్కలు, గిట్టలు దృఢంగా ఉండటం వల్ల ఎంత ధరైనా చెల్లించి రైతులు కొంటారు. మచ్చల ఆవులు రోజూ మూడు నుంచి ఐదు లీటర్ల పాలిస్తాయి. వీటికి తగిన పౌష్టికాహారం అందించి వృద్ధి చేస్తే మెరుగైన ఫలితాలిస్తాయని కోనేరు, వాస్సన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. నల్లమల గిరుల్లో సంచరించే పొడ జాతి పశువులు -
రైతు ఇంట రాజసం
అంతరిస్తున్న ఆ జాతి పశువులను ప్రత్యేకంగా పెంచుతున్న ఓ రైతు వాటి కోసం షెడ్డు ఏర్పాటు నిత్య పర్యవేక్షణలో పోషణ బలంగా, దృఢంగా .. కండపట్టి ఉండే శరీర సౌష్టవం. పొట్టిగా.. గట్టిగా ఉండే కొమ్ములు. ఎత్తై మూపురం.. వేలాడే గంగడోలు.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘ఒంగోలు గిత్త’ రైతు ఇంటి ముందుంటే అదో రాజసం. ఎంతటి బరుైవైనా అవలీలగా లాగే తత్వం. లోతుగా దుక్కి చేసేందుకు కిలోల కొద్దీ బరువు పెట్టినా ఇట్టే దున్న గల శక్తి. బండి కడితే గంటకు కనీసం 30 మైళ్ల వేగంతో పరుగు తీయ గల సామర్థ్యం. కయ్యానికి కాలు దువ్వితే వెనుకడుగేయని నైజం. ఇవి ఒంగోలు గిత్తలకుండే గొప్ప లక్షణాలు. ఒకప్పుడు ఊళ్లలో ప్రతి రైతు ఇంటా కనిపించే గొప్ప పశుజాతిలో భాగమైన ఒంగోలు జాతి ఇప్పుడు అదృశ్యమవుతోంది. ఊరుకు పది, పదిహేను కనిపిస్తే మహా ఎక్కువ అనే పరిస్థితి మారింది. ఈ అరుదైన పశుజాతే తన అదృష్టంగా భావించి.. వేలకు వేలు వాటి పోషణ కోసం ఖర్చు పెట్టి ఒంగోలు జాతి పశువులను కాపాడుతున్న ఓ సామాన్య రైతు కథే.. ఈ ప్రత్యేక కథనం... కడప అగ్రికల్చర్: ఆధునిక యంత్రాలు వ చ్చి... పశువులతో వ్యవసాయం చేసే పద్ధతులను మొరటుగా మార్చాయి. ఒకప్పుడు దుక్కి దున్నాలంటే ఎద్దులకు కాడి కట్టాల్సిందే. ఇప్పుడీ పశువుల స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. సులభంగా, వేగంగా పనయ్యే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పంటలను సాగు చేయడానికి ఒకటి, రెండు ఎద్దుల జతలు ఉంటే చాలనుకునే పరిస్థితి కొంత కాలం కిందట ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి అన్నింటికీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కరువు కాలం, పశుగ్రాసం కొరత వల్ల సేద్య పశువులను గ్రామ పొలిమేరలు దాటించారు. ఇప్పుడు ఏ కొద్ది మంది రైతులో ఎద్దును నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. అందునా ఒంగోలు గిత్తలతో సాగు చేసే రైతులు జిల్లాలో వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ ఒంగోలు పశు సంపదే తన అదృష్టమని భావించి వ్యవసాయం చేస్తున్న అతి కొద్ది మంది రైతుల్లో ఒకరు మైదుకూరు మండలం నెల్లూరు కొట్టాల గ్రామానికి చెందిన కిరణ్కుమార్రెడ్డి (ఫోన్: 9985365336). తెంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అరుదైన పశుజాతిగా మారిన ఒంగోలు పశువులకు చిరునామాగా మారారు కిరణ్కుమార్రెడ్డి. ప్రస్తుతం మూడు జతల గిత్తలు, 6 ఆవులు, 3 జతల ఎద్దులను పోషిస్తున్నారు. వీటికి సొంత పొలంలో పండించిన ఒడ్లను ఆడించగా వచ్చే తవుడు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పచ్చిమేతను అందిస్తున్నారు. ఒంగోలు జాతి పశవులను పెంచితే దేవతామూర్తులు ఇంట్లో నడిచినట్లు ఉంటుందని సిరిసంపదలతో రైతు తులతూగుతాడనే నమ్మకమని యువరైతు కిరణ్కుమార్రెడ్డి విశ్వసిస్తారు. ఈ ఒంగోలు గిత్త రూ. 3 నుంచి 4 లక్షల రూపాయలు పలుకుతున్నాయంటే అతిశయోక్తికాదు. ఈ గిత్తలను చూసేందుకు ఇక్కడికి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి అభ్యదయ రైతులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులుగా ఉండే రైతులు వస్తుంటే.. ఈ పశువులను పోషిస్తున్న మాకు మనసు పులకించిపోతోందని కిరణ్కుమార్రెడ్డి కుంటుంబం పేర్కొంటోంది. పూర్వవైభవం సంతరించుకోవాలన్నదే... నా తపన ఒంగోలు గిత్త... ఇది అరుదైన పశుజాతి. ఒకప్పుడు ప్రతి ఇంటా ఈ సంతతి ఉండేది. గ్రామాల్లో మందలు మందలు ఉండేవి. ఎప్పుడైతే వ్యవసాయంలోకి యాంత్రీకరణ ప్రవేశించిందో అప్పుడు పశువు సంపదకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కూడా ఒంగోలు పశువులు కనిపించని పరిస్థితి. కేవలం బండలాగుడు పోటీలకు ఉపయోగించే ఎద్దులు మాత్రమే ఈ సంతతికి చెందినవి కనిపిస్తాయి. ఈ గిత్తలు మా అదృష్ట దేవతలు. రోజుకు 3 జతల ఎద్దులు, 3 జతల దూడలు, 6 ఆవులకు కలిపి 1300 రూపాయలు ఖర్చు అవుతోంది. ప్రత్యేకంగా పశువులకు షెడ్డును ఏర్పాటు చేశాం. నాకున్న పొలంలో రోజూ సేద్యానికి ఉపయోగిస్తాను. సేద్యంలో ట్రాక్టరు కంటే ఎందునా తీసిపోవు. అందుకే ఖర్చులో వెనకడుగు వేయకుండా ఆ పశువులను పోషిస్తున్నాను. రాష్ట్రమంతా ఈ సంతతిని పెంపొందించేలా చేయడమే నా ధ్యేయం. పార్లమెంటులో ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ పశువుల రక్షణకు చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ను, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం అభినందనీయం. కనుమరుగవుతున్న ఒంగోలు జాతిని ఏపీలో నిలిపితే రైతులకు ఎంతో మేలు చేసిన వారవుతారని కోరుతున్నాను. - కిరణ్కుమార్రెడ్డి, యువరైతు, నెల్లూరు కొట్టాల. -
'ఒంగోలు గిత్తను బ్రెజిల్కు ఇవ్వొద్దు'
ఒంగోలు: ఒంగోలు గిత్త మన దేశ సంపద అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆ సంపదను బ్రెజిల్కు తరలిపోకుండా కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒంగోలు గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ లాంటి దేశాలకు ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని, వీటిని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ (48), ఆమె భర్త, జిల్లా టీడీపీ నాయకుడు కఠారి మోహన్ (51)ల హత్య హేయమైన చర్య అని, ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని జెడ్పీ మాజీ చైర్మన్ నుకసాని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement