breaking news
Oil refinery unit
-
పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్ సాయం కోరిన రష్యా
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్ వైపు చూస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశీయ పెట్రోల్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను రష్యా సంప్రదించినట్లు సమాచారం.ఇది అంతర్జాతీయ ఇంధన రంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు రష్యా ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే శక్తివంతమైన దేశంగా ఉంది. ముఖ్యంగా భారత్కు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసిన రష్యా.. ఇప్పుడు అదే భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోల్ కొనుగోలు చేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ పరిణామానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులు. రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం. రిఫైనరీల్లో మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయాల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరాను స్థిరంగా ఉంచడం రష్యాకు సవాల్గా మారింది. రష్యా ప్రభుత్వం దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన సరఫరాను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లభ్యతపై ఒత్తిడి పెరగడంతో దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేసే మార్గాలను మాస్కో పరిశీలిస్తోంది.ఈ క్రమంలో రష్యా సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలను సంప్రదించినట్లు సమాచారం. భారత్కు ప్రపంచ స్థాయి భారీ చమురు శుద్ధి సామర్థ్యం ఉంది. ముఖ్యంగా భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యాయి. ఆ సమయంలో భారత్ పెద్ద కొనుగోలుదారుగా మారింది. ఇప్పుడు అదే ఇంధన సంబంధాలు మరో రూపంలో కనిపిస్తున్నాయి.భారత్కు ఒక అవకాశం.. అయితే ఈ పెట్రోల్ సరఫరా వ్యవహారం కేవలం వ్యాపార అంశం మాత్రమే కాదు. దీనికి అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు పెరగడం ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతోంది. భారత్కు ఇది ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ప్రపంచ స్థాయి రిఫైనింగ్ సామర్థ్యం కారణంగా భారత ఇంధన కంపెనీలకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంది. అయితే దేశీయ అవసరాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచానికి చమురు సరఫరా చేసిన రష్యానే ఇప్పుడు పెట్రోల్ కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన సమీకరణాలను ఎలా మార్చుతోందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. -
కువైట్లో ప్రధాన చమురు కేంద్రంపై... ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ నౌకపైనా దాడులు! అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహంలింకన్ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్ సలేం డ్రోన్ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్గేట్ ఏఐ సెంటర్ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లో అమెజాన్, ఒరాకిల్ వంటి పలు టెక్ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రాపిడ్ సెంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. -
నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్కు (ఎన్వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది. నాగార్జున ఆయిల్ రిఫైనరీ పేరుతో రూ. 25,000 కోట్లతో కడలూరులో ఎన్వోసీఎల్ రిఫైనరీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులోని పూర్తి వాటాను సింగపూర్కు చెందిన నెట్ఆయిల్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎన్వోసీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్వోసీఎల్కి పెద్ద ఊరట లభించినట్లే.


