-
శతక నీతి – సుమతిమీ కింకరులం ..
‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు. కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి... ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం. ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం. ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి. తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మళ్లీ పట్టుకు మావోయిస్టుల ఎత్తు
నర్సీపట్నంరూరల్, న్యూస్లైన్: విశాఖ మన్యం లో మునుపటి ఆధిపత్యాన్ని మళ్లీ దక్కించుకోవాలని ఆరాటపడుతున్న మావోయిస్టులు ఆ దశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజనులకు మరింతగా సన్నిహితం కావడానికి వ్యూ హం రూపొందిస్తున్నారు. ఏవోబీలో ఒడిశా ప్రాంతం కన్నా విశాఖ ఏజెన్సీ మావోయిస్టులకు సురక్షితమైనదిగా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ యువత రిక్రూట్మెంట్ కూడా అధికంగా ఉండేది. గిరిజన గ్రామాల్లో ఖాళీగా ఉండే యువకులను ఆకట్టుకుని వారికి శిక్షణ ఇచ్చి ముందు మిలీషియా సభ్యులుగా, తర్వాత పూర్తి స్థాయి దళ సభ్యులుగా చేర్చుకు నే వారు. ఆవిధంగా తమ కార్యకలాపాలు సులువుగా సాగించుకునేవారు. అయితే ఇటీవ ల కాలంలో గిరిజన యువతకు దగ్గరయ్యేం దుకు పోలీసులు చేపడుతున్న కార్యకలాపాల తో మావోయిస్టులకు చుక్కెదురవుతోంది. దాంతో గ్రామాల్లో సామాజిక కార్యకలాపాల పై వారు దృష్టి పెడుతున్నారు. అపరాల సీజన్పై దృష్టి ఏజన్సీలో కీలకమైన అపరాల సీజన్ను అవకాశంగా చేసుకొని మావోయిస్టులు తమ ప్రాబ ల్యం పెంచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నా రు. గిరిజనులు ఏడాది పొడవునా జీవనానికి అవసరమయ్యే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపరాల వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అపరాల వ్యాపారం ఊపందుకోవడంతో గిరిరైతులకు మేలు చేయడం ద్వారా తమ పట్టు నిలబెట్టుకోవాలని మావోయిస్టులు యత్నిస్తున్నారు. అపరాలకు గిట్టుబాటు ధర ఇప్పించి, ఏళ్ల తరబడి నిలిచిపోయి న బకాయిలు వసూలుకు కృషి చేసి గిరిజనుల ఆదరణ పొందాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు సేకరిస్తూ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. వ్యాపారులపై ఒత్తిడి గిరిజనులకు బకాయిలు చెల్లించేలా మావోయిస్టులు అప్పుడే ఒత్తిళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల ఆరున గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఓ వ్యాపారి భార్యను, మంగళవారం మరో అపరాల వ్యాపారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. దారకొండకు చెందిన వ్యాపారి చేత రైతులకు బకాయి చెల్లింపజేసి అతని భార్యను చెర నుంచి విడిచి పెట్టినట్టు తెలిసిం ది. అలాగే గిరిజనులకు బకాయి పడ్డ మొత్తా న్ని చెల్లిస్తేనే వ్యాపారిని విడిచిపెడతామని చెప్పిన మావోయిస్టులు ప్రజాకోర్టులో విచారిం చి అతనిని విడిచిపెట్టినట్లు తెలిసింది. గతంలో గిరిజనుల మద్దతు కూడగట్టుకోవడానికి మా వోలు ఇదేఎత్తుగడ అనుసరించారు. ఇప్పుడూ అదే బాటలో యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement