breaking news
not reached
-
ఏదీ సౌరభం !
సోలార్ విద్యుదుత్పత్తిలో జిల్లా చతికిలబడింది. నిర్దేశిత లక్ష్యానికి చాలాదూరంలో నిలిచిపోయింది. సబ్సిడీ ఉన్నా.. సౌర ఫలకాల కొనుగోలుకు జిల్లా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అధికారుల ప్రచార లోపమే దీనికి కారణం. ఏలూరు(ఆర్ఆర్పేట) : సోలార్ విద్యుదుత్పత్తి పథకం ఆశించిన ఫలితాలు సాధించ లేకపోయింది. ఈ పథకం ద్వారా గృహాలపై ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాలను 50శాతం సబ్సిడీపై సర్కారు అందిస్తున్నా.. వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ పథకం అమలులో అధికారులూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. తగిన ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం జిల్లాలో సోలార్ ద్వారా 21 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు గృహావసరాలకు, పరిశ్రమలకు , కళాశాలలకు సౌరఫలకాలు అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 83 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో సౌరఫలకాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్న 51 మంది దరఖాస్తుదారులకు వాటిని అందించారు. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 881 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అంటే ఒక మెగావాట్ కూడా పూర్తిగా ఉత్పత్తి కావడం లేదన్నమాట. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా సుమారు 1500 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కిలో వాట్కు రూ.85 వేల ఖర్చు గృహావసరాల నిమిత్తం సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోవాలంటే కిలోవాట్ సామర్థ్యానికి రూ.85 వేలు ఖర్చవుతుంది. ఒక్కో గృహానికి ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు ఏసీలు వంటి పరికరాల వినియోగానికి రోజుకు రెండు కిలోవాట్ల (8 యూనిట్లు) కరెంట్ అవసరమవుతుందని విద్యుత్ సంస్థల అంచనా. ఈ లెక్కన ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రూ.1.70 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం రూ.70 వేలు నెడ్క్యాప్ ద్వారా సబ్సిడీగా అందిస్తుంది. అంటే వినియోగదారులు రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు వారు వినియోగించే సుమారు 240 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. మిగిలిన విద్యుత్ను అమ్ముకోవచ్చు. దీనికోసం విద్యుత్ సంస్థలు సౌరఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో బై డైరెక్షనల్ మీటరును అమర్చుతాయి. ఆ మీటరు ద్వారా వినియోగదారుడు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు చేరుతుంది. అలా చేరిన కరెంట్కు యూనిట్కు రూ.5.40 చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారునికి చెల్లిస్తాయి. విద్యా సంస్థలు ముందుకొచ్చాయి సోలార్ విద్యుదుత్పత్తికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. భీమవరం విష్ణు, ఎస్ఆర్కేఆర్ కళాశాలలు, తాడేపల్లిగూడెం వాసవి కళాశాల, తణుకులోని చిట్టూరి విద్యా సంస్థ, ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలూ ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే గృహ వినియోగదారులు ముందుకు రావడం లేదు. వారిలోనూ అవగాహన పెరగాలి. –డి.వి.ప్రసాద్, నెడ్క్యాప్ జిల్లా మేనేజర్ -
90 వేల మందికి అందని చంద్రన్న కానుక
ముగిసిన పంపిణీ గడువు కాకినాడ సిటీ: రేష¯ŒS కార్డుదారులకు ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక పేరుతో అందజేసిన సరుకుల పంపిణీ గడువు బుధవారం రాత్రితో ముగిసింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆయావర్గాల కార్డుదారులకు 15వ తేదీలోపు కానుక కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆదివారం రాత్రి ఈ పోస్ సర్వర్లో పంపిణీ చేసే ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆ గడువు నాటికి జిల్లాలో సరుకుల పంపిణీ పూర్తికాకపోవడంతో జిల్లా అధికారులు ప్రభుత్వానికి తెలియజేసి మరో రెండు రోజుల గడువు పొడిగించగా మంగళ, బుధవారాల్లో తిరిగి పంపిణీని కొనసాగించారు. కానీ జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల మంది రేష¯ŒSకార్డుదారులు సరుకులు పొందలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 16 వేల 381 మంది కార్డుదారులుండగా, వీరిలో 13 లక్షల 72 వేల 750 మంది సరుకులను తీసుకున్నారు. ఇంకా 43 వేల 631 మంది సరుకులను తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఈ నెలలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంజూరు చేసిన 89 వేల 203 కార్డుల్లో 42 వేల మంది కార్డుదారులు చంద్రన్న కానుకలను తీసుకున్నారు. ఇంకా 47 వేల 203 మంది సరుకులను తీసుకోలేకపోయారు. అయితే మంజూరైన కొత్త కార్డుల్లో లబ్ధిదారులకు ఇప్పటి వరకు 75 వేల కార్డులు పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 14 వేల మంది లబ్ధిదారులకు కార్డులు అందాల్సి ఉంది. మంజూరైన కొత్త కార్డుల పంపిణీ జాప్యంతో అర్హులైప లబ్థిదారులు 50 శాతం మంది చంద్రన్న కానుక సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కొంత మంది లబ్థిదారుల వేలిముద్రలు, ఐరీస్లను ఈ–పోస్ మిషన్లు తీసుకోకపోవడంతో వారుకూడా సరుకులు అందుకోలేకపోయారు. -
పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిరాశాజనకంగా ముగిసింది. పన్ను పరిధిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ్టి సమావేశంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ ముసాయిదాలపై చర్చ జరిగినట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.