breaking news
Norway Open Chess Tournament
-
కరువానాపై అర్జున్ విజయం
స్టావెంజర్: నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ జోరుకు బ్రేక్ పడగా... తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత నంబర్వన్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయంతో టైటిల్ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్ గేమ్లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్సన్ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్ గేమ్లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్పై సంచలన విజయం సాధించింది. -
అర్జున్పై తొలిసారి నెగ్గిన గుకేశ్
స్టావెంజర్: గత ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన తర్వాత భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పాల్గొన్న పలు టోర్నీలలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అయితే నార్వే ఓపెన్ టోర్నీలో గుకేశ్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతోన్న ఈ టోర్నీలో... గుకేశ్ ఆరో రౌండ్లో నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్పై క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి గెలిచాడు. కార్ల్సన్ను ఓడించిన ఉత్సాహంలో గుకేశ్ క్లాసికల్ ఫార్మాట్లో మరో ప్రత్యర్థిపై తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆ ప్రత్యర్థి ఎవరో కాదు భారత్కే చెందిన యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్. గతంలో అర్జున్తో పోటీపడిన ఆరుసార్లు గుకేశ్కు విజయం దక్కలేదు. ఒక గేమ్లో ఓడిపోయి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో ప్రయత్నంలో మాత్రం గుకేశ్ పైచేయి సాధించాడు. మూడున్నర గంటలకుపైగా జరిగిన ఏడో రౌండ్ గేమ్లో గుకేశ్ తెల్ల పావులతో ఆడుతూ 92 ఎత్తుల్లో అర్జున్ను ఓడించాడు. ఈ విజయంతో గుకేశ్ 11.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 12.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) అగ్రస్థానంలో... 11 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ మూడో స్థానంలో ఉన్నారు. హికారు నకమురా (అమెరికా; 8.5 పాయింట్లు) నాలుగో స్థానంలో, అర్జున్ (7.5 పాయింట్లు) ఐదో స్థానంలో, వె యి (చైనా; 6.5 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. -
నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్సన్..
నార్వే చెస్ టోర్నీ-2024 ఛాంపియన్గా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రౌండ్లో ఫాబియానో కారువానాపై కార్ల్సన్ విజయం సాధించాడు. తొలుత వీరిద్దిరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్లో ఫాబియానో కరువానాను కార్ల్సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భారత గ్రాండ్మాస్టర్ ప్రగ్నానంద రమేష్బాబు.. హికారు నకమురాను ఓడించడంతో కార్ల్సెన్ విజయం లాంఛనమైంది.నకమురా ఓటమి పాలవ్వడంతో కార్ల్సెన్ స్టాండింగ్లో తన ఆధిక్యాన్ని నిలుపునకుని ఛాంపియన్గా అవతరించాడు. కార్ల్సన్కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజయం కావడం విశేషం. ఇక ఈ టోర్నీలో కార్ల్సన్(17.5) తొలి స్ధానం సంపాదించగా.. నకమురా(15.5), ప్రగ్నానంద(14.5) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో జు వెన్షున్(చైనా) విజేతగా నిలిచింది. 🐐🐐🐐 @MagnusCarlsen pic.twitter.com/MUH73HWmNG— Chess.com (@chesscom) June 7, 2024 Magnus Carlsen beats Fabiano Caruana in Armageddon to earn at least a playoff for the #NorwayChess title! https://t.co/vj9WZbbkJq pic.twitter.com/fdWy4evo1K— chess24 (@chess24com) June 7, 2024 -
వైశాలి విజయం... హంపి పరాజయం
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. నాలుగో రౌండ్ గేమ్లో వైశాలి 54 ఎత్తుల్లో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. ఆరుగురు గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత వైశాలి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నంబర్వన్ కోనేరు హంపి 55 ఎత్తుల్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో 65 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్కు షాక్
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్సన్కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్సన్పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్పై ఇదే తొలి విజయం. Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG— chess24 (@chess24com) May 29, 2024మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు. -
Norway chess: ఆనంద్కు మరో విజయం
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్సన్ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్కు మూడో విజయం
స్టావెంజర్ (నార్వే) : భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మూ డో విజయాన్ని సాధించాడు. జాన్ లుడ్విగ్ హామర్ (నార్వే)తో బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్లో ఆనంద్ 36 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆనంద్ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆనంద్ తలపడతాడు. -
ఆనంద్కు ఐదో ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. అరోనియన్ (ఆర్మేనియా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. కామన్వెల్త్ చెస్లో హంపి, లలిత్ల శుభారంభం న్యూఢిల్లీ: కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో ఏపీ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ఎం.ఆర్. లలిత్బాబు శుభారంభం చేశారు. తొలి రౌండ్లో హంపి ... సోహమ్పై, లలిత్బాబు... ఓజస్ కులకర్ణిపై గెలిచారు.