New Income tax act 2025
-
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్. -
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి. -
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి. -
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.అలాగే 26ఏఎస్/ఏఐఎస్కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్ఆర్ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్కం ట్యాక్స్తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం. -
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సక్రమ పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు భారంకాకుండా ఆదాయపన్ను శాఖ అధికారులు వ్యవహరించవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. 2025 ఆదాయపన్ను శాఖ చట్టంపై జాతీయస్థాయి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన 2026 ప్రారంభ్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టం ద్వారా భారత్ స్నేహపూర్వక పన్ను దేశంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు. -
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్కప్ మ్యాచ్లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్కమ్ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్గా ప్రకటించిన క్లీన్బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్ -
కొత్త ఆదాయపన్ను చట్టానికి సిద్ధం కండి
వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి) కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానున్నందున అధికారులు, అందుకు సంసిద్ధం కావాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) కోరింది. అధికారులు కొత్త చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, తగినంత స్పష్టతతో పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వ్యక్తం చేశారు.ఆదాయపన్ను శాఖ అధికారులకు నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కొత్త చట్టానికి మారేందుకు వీలుగా నిబంధనలు, విధానాలు, పత్రాల రూపకల్పన జరుగుతున్నట్టు, ఇందుకు సంబంధించి శిక్షణ కూడా కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆదాయపన్ను శాఖ పరిపాలనను సీబీడీటీయే చూస్తుంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను చట్టం 1961 స్థానంలో.. ఆదాయపన్ను చట్టం 2025 అమల్లోకి రానుండడంతో ఇచ్చిన ఈ సందేశానికి ప్రాధాన్యం నెలకొంది.‘‘మీ ప్రమేయం, ఉత్సాహం కొత్త చట్టానికి సాఫీగా మారడాన్ని నిర్ణయిస్తుంది. ఆదాయపన్ను శాఖ పాత్ర అన్నది పన్నుల వసూళ్లు, అమలు వరకే కాకుండా ప్రక్రియలను సులభతరం చేయడం, విశ్వాసం పెంపొందించడం, సేవల కేంద్రంగా మారుతోంది’’అని అగర్వాల్ తన సందేశంలో పేర్కొన్నారు. -
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి.


