breaking news
New electricity charges
-
కొత్త కనెక్షన్లకూ ఛార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై రూ.15,485 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఇప్పుడు దీనికి అదనగా కొత్త కనెక్షన్ల ఛార్జీలను పెంచుతూ మరో షాక్ ఇస్తోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే కొత్త ఛార్జీలు చెల్లించాలి్సందేనంటూ ప్రతిపాదన రూపొందించారు. వీటిని నిర్ణయించేందుకు, విద్యుత్ రెగ్యులేటరీ చట్టంలోని నిబంధనలకు నాలుగో సవరణను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఆ చట్టంలో మార్పులు చేస్తూ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 23లోగా మండలికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని కోరింది. అనంతరం.. ముసాయిదాను ప్రకటిస్తామని, ఇది ప్రకటించాక 21 రోజుల్లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది.ప్రస్తుత విధానం ఇదీ..విద్యుత్ సర్వీసు అవసరమైనప్పుడు వినియోగదారులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు దరఖాస్తు చేసుకుంటారు. డిస్కం నుంచి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. అప్పటికే ఉన్న విద్యుత్ లైన్ల నుంచి కొత్త సర్వీసు ఇచ్చే ప్రాంతానికి ఎంతదూరం ఉంది?.. దానికెంత విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు అవసరమవుతాయని ఒక అంచనా రూపొందిస్తారు. దాని ప్రకారం ఆ ఖర్చులో కొంత మొత్తాన్ని లేదా పూర్తిగానూ చార్జీల రూపంలో చెల్లించాలంటూ వినియోగదారునికి నోటీసు జారీచేస్తారు. దాని ప్రకారం చెల్లించిన తరువాత సర్వీసును మంజూరుచేస్తారు. కానీ, ఇకపై అలా కుదరదు. దరఖాస్తు చేస్తున్నప్పుడే ముందే నిర్ణయించిన ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.కమిషన్కు ఛార్జీలు నిర్దేశించే అధికారంవిద్యుత్ లైన్ ఏర్పాటుకు అయిన ఖర్చుల రికవరీకి సంబంధించి 150 కిలోవాట్లు, అంతకుమించిన లోడ్కు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేయాల్సిన ఛార్జీలను నిర్దేశించే అధికారాన్ని కమిషన్కు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కట్టబెట్టింది. ఇందుకు అనుగుణంగా 150 కిలోవాట్ల వరకు కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేస్తున్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్గదర్శకాలను కమిషన్ ప్రతిపాదించింది. డిస్కంల నెట్వర్క్ నుంచి కిలోమీటర్ పరిధి.. 150 కిలోవాట్ల లోడ్ వరకు (కొత్త కనెక్షన్/ప్రస్తుతమున్న సర్వీస్కు అదనపు లోడ్ కింద) 2025–2026 ఆర్థిక ఏడాదిలో డెవలప్మెంట్ ఛార్జీలను కమిషన్ నిర్దేశించింది.లోడు 75 కిలోవాట్లకు మించితే అంతే..ఇక వినియోగదారుడు తన లోడ్ 75 కిలోవాట్లకు మించితే వారంతట వారే 150 కిలోవాట్ల వరకు ఎల్టీగానీ హెచ్టీగానీ ఎంచుకుని డెవలప్మెంట్ ఛార్జీలను చెల్లించాలి. ఈ ఛార్జీలతో పాటు అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ను రెగ్యులేటరీ నిబంధనల మేరకు చెల్లించాలి. 2026–2027 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త, అదనపు లోడ్కు సంబంధించిన సర్వీస్లైన్ ఛార్జీల షెడ్యూల్ను డిస్కంలు కమిషన్కు సమర్పించవచ్చు. డిస్కంల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాకపోతే కొత్త ఛార్జీలను ఖరారు చేసేంత వరకూ 2025–2026 చార్జీలనే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. -
KTR: పేదలకు కాంగ్రెస్ పెట్టనున్న కరెంట్ మంటలు
-
పవర్ ‘పంచ్’
రూ.941 కోట్ల వడ్డన గృహ వినియోగం 200 యూనిట్లు దాటితే మోతే వచ్చే ఏప్రిల్ నుంచే కొత్త విద్యుత్ చార్జీలు చార్జీల పెంపునకు ఆమోదం తెలిపిన ఏపీఈఆర్సీ ప్రభుత్వం రూ. 3,186 కోట్ల సబ్సిడీయే ఇవ్వడంతో వినియోగదారులపై భారం.. సగటున 5% పెరగనున్న చార్జీలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరగనుంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రజలపై ఏకంగా రూ. 941 కోట్ల భారం పడనుంది. విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా భరించకుండా కోత పెట్టడంతో చార్జీలు పెరగనున్నాయి. సగటున ఐదు శాతం మేర చార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సోమవారం ఆమోదముద్ర వేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1,188 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించగా.. ఈఆర్సీ స్వల్పంగా రూ. 247 కోట్ల మేర తగ్గించి రూ.941 కోట్ల మేర చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. 200 వందల యూనిట్ల వరకు వినియోగంపై కొత్తగా ఎలాంటి భారం మోపలేదు. అంతకుమించి విద్యుత్ను వాడే గృహ వినియోగదారులు సహా వాణిజ్య, పారిశ్రామిక వర్గాలను దండుకునేలా చార్జీలను పెంచింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టినప్పటికీ డిమాండ్ చార్జీల విషయంలో ఏమాత్రం సడలింపు ఇవ్వలేదు. జెన్కో ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల నష్టం వాటిల్లుతోందనే సూచనలను ఈఆర్సీ పట్టించుకోలేదు. ఇందులో కొంతమేరకే కోతపెట్టింది. 11 వేల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ప్రభుత్వం చెబుతుంటే, అంత అవసరం లేదని నియంత్రణ మండలి భావించింది. అందులో 3,098 మిలియన్ యూనిట్లు మేర కోత విధించింది. ఈ రూపేణా కొనుగోలు విద్యుత్ భారాన్ని కొంతమేర తగ్గించే ప్రయత్నం చేసింది. సర్కారు సబ్సిడీ రూ.3,186 కోట్లే రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.25,515 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. అయితే ఈఆర్సీ దీన్ని రూ.22,329 కోట్లకు పరిమితం చేసింది. రూ. 7,716 కోట్ల మేర ఆర్థిక లోటు ఉందని.. డిస్కమ్లు గత నెలలో ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 6,455 కోట్ల సబ్సిడీ వస్తుందని ఆశించిన డిస్కమ్లు.. మొత్తం లోటులో రూ.1,261 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం కేవలం రూ. 3,186 కోట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. పంపిణీ నష్టాలను నివారించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డిస్కమ్లు రూ.1188 కోట్లకు తిరిగి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఇందులో రూ. 247 కోట్ల మేరకు తగ్గించడంతో పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 941 కోట్లను చార్జీల రూపంలో సమకూర్చుకోనున్నాయి. అయినప్పటికీ రూ. 3,589 కోట్ల మేర ఆర్థిక లోటు ఉండటంతో.. దీన్ని అధిగమించేందుకు 3,098 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు విద్యుత్ను తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మిగులు విద్యుత్ కోసం 11 వేల మిలియన్ యూనిట్ల కొనుగోలుకు స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. ఏపీఈఆర్సీ ఇందులో దాదాపు 3వేల మిలియన్ యూనిట్ల కొనుగోలును నిరాకరించినా, ఇంకా 8 వేల మిలియన్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ భారం రూ. 6 వేల కోట్ల పైచిలుకు ఉండే వీలుంది. పంచాయతీల్లో చీకట్లు: గ్రామ పంచాయతీలు ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. తాజాగా మరో రూ. 25 కోట్లమేర చార్జీల రూపంలో భారం మోపేందుకు డిస్కమ్లు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అదనపు భారం వల్ల పంచాయితీలకు సమస్యలు తప్పవంటున్నారు. అదే బాబు అదే పాలన మూడురోజుల కిందట విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బడ్జెట్ ప్రసంగాన్ని మీడియా ముందు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి సన్నద్ధమవుతున్నారని అన్నారు. బాబులో ఏ మార్పూ రాలేదని ‘అదే బాబు అదే పాలన’ అని కూడా జగన్ విమర్శించారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. బడుగులకు ఊరట: ఈఆర్సీ చైర్మన్ విద్యుత్ చార్జీల పెంపులో 92 శాతం వినియోగదారులకు ఊరట కలిగించామని ఏపీఈఆర్సీ చైర్మన్ గ్రంథి భవానీ ప్రసాద్ తెలిపారు. ఉచిత విద్యుత్కు కత్తెర? నష్టాల భర్తీ కోసం విద్యుత్ వినియోగం తగ్గేలా చూడాలని, కొనుగోలు విద్యుత్కు కోత పెట్టాలని డిస్కమ్లకు ఏపీఈఆర్సీ సూచించింది. ఏకంగా 3,098 మిలియన్ యూనిట్ల మేరకు కోత విధించింది. దీంతో ఈ మేరకు ఎక్కడ కోత విధిస్తారనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమలు కొత్తగా వస్తాయని, వ్యవసాయ వినియోగం పెరుగుతుందని ఊహించి డిస్కమ్లు లెక్కించాయని ఏపీఈఆర్సీ భావించింది. పరిశ్రమలకు అవసరమైనప్పుడు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తామని చెప్పింది. నిరంతర విద్యుత్ పథకం అమలులో ఉంది కాబట్టి గృహ, వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ ఒక్కటే. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కసరత్తులో ఉంది. రైతులకు సోలార్ విద్యుత్ పంపుసెట్లను అందజేయాలని నిర్ణయించింది. కొత్త కనెక్షన్లు 2.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటే, 50 వేలకే పరిమితం చేసింది. వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు అమర్చే ఆలోచనలో ఉంది. దీన్నిబట్టి చూస్తే కోత పెట్టే విద్యుత్లో సింహభాగం వ్యవసాయ రంగం నుంచే ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికే 9 గంటల ఉచిత విద్యుత్ హామీకి తూట్లు పొడిచి 7 గంటలే ఇస్తున్నారు. అదీ ఎక్కువగా రైతు వినియోగించలేని అర్ధరాత్రి సమయంలో సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది సంస్కరణల పేరుతో 3 వేల మిలియన్ యూనిట్లు తగ్గిస్తామని ‘అందరికీ విద్యుత్’ డాక్యుమెంట్లో ప్రభుత్వమే వెల్లడించింది. ఇవన్నీ ఉచిత విద్యుత్కు కోత వేసే సూచనలేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలపై పరోక్ష వడ్డన పరిశ్రమలపై ఏకంగా రూ.600 కోట్ల మేర వడ్డనకు సర్కారు సిద్ధమైంది. డిమాండ్ చార్జీల రూపంలో ఈ మొత్తం వసూలు చేయాలన్న ప్రతిపాదనకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే డిమాండ్ చార్జీలున్నాయని (పరిశ్రమల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అదనంగా విధించే చార్జీలు) పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ విచారణ సందర్భంగా ఆఫ్ పీక్ అవర్స్లో చార్జీలు తగ్గించాలని, పీక్ అవర్స్లో పెంచుకున్నా ఫర్వాలేదని చెప్పారు. ఆఫ్ పీక్ అవర్స్లో తాము వాడకం పెంచుకోవడం వల్ల పీక్ అవర్స్లో లోడ్ పడకుండా ఉంటుందని సూచించారు. అయితే ఇవేవీ ఈఆర్సీ పరిగణనలోనికి తీసుకున్నట్టు లేదు. సీవోడీ చార్జీలను పెంచి పరిశ్రమలపై భారం మోపారు. పరిశ్రమలు రానట్టేనా? రాజధాని నిర్మాణం, కొత్త పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా వేశాయి. ప్రస్తుతం 54,884 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ లభ్యతను, ఈ ఏడాది 57,982 మిలియన్ యూనిట్లకు పెంచాలని డిస్కమ్లు ప్రతిపాదించాయి. కానీ దీనికి ఏపీఈఆర్సీ ఒప్పుకోలేదు. ఇందులో 3 వేల మిలియన్ యూనిట్లకు పైగా కోత పెట్టింది. దీంతో పరిశ్రమలు రావడానికి అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలని కమిషన్ సూచించింది. ముందస్తుగానే తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న సర్కారుకు ఈ ఆదేశం ఓ విధంగా షాక్ ఇచ్చినట్టే. అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు పరిశ్రమలు అంగీకరిస్తాయా? అనేది అనుమానమే. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ రాయితీ హామీని ఇవ్వలేదు. కాబట్టి కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది ఇబ్బందికరమేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పారు. పవర్లూమ్స్ దెబ్బ నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ రాయితీలు కల్పిస్తామన్నారు. కానీ ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ఈ రంగానికి విద్యుత్ చార్జీల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. -
విద్యుత్ చార్జీల మోతకు నేడు పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనల హైడ్రామాకు మంగళవారంతో తెరపడే వీలుంది. పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇదేరోజు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికిముందు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమని ఉన్నతాధికారులు చెప్పనున్నట్టు సమాచారం. రూ.7 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు ఉందని, ఇందులో ప్రభుత్వం ఏ మేర సబ్సిడీ ఇస్తుందో వేచి చూడాలని వారంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బట్టి ఏయే శ్లాబులకు చార్జీలు పెంచాలో డిస్కమ్లు నిర్ణయం తీసుకునే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సబ్సిడీ మొత్తాన్ని వెల్లడించే అవకాశం లేదు. ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపేందుకు మాత్రమే సీఎం అనుమతించవచ్చని చెబుతున్నారు. -
మళ్లీ ధరల ‘షాక్’....
= జిల్లా వాసులపై నెలకు రూ.7.75 కోట్ల భారం =యూనిట్కు 55 పైసలు పెంపు = రానున్న ఏప్రిల్ నుంచి అమలు =ఉచిత విద్యుత్ హుష్! సాక్షి,విజయవాడ : వరుస ఘటనలతో అతలాకుతలమవుతున్న జనానికి ప్రభుత్వం మళ్లీ ధరల షాక్ ఇవ్వనుంది. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అనుమతిచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్నాయనే సాకుతో వినియోగదారులపై చార్జీల సవారీ చేసేందుకు డిస్కంలు సిద్ధమౌతున్నాయి. యూనిట్కు 55 పైసలు వరకు పెంచే అవకాశాలున్నాయని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈసారి పేదల్ని కూడా వదలిపెట్టకుండా చార్జీలు పెంచి వడ్డించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. జిల్లాపై రూ.7.5 కోట్ల భారం జిల్లాలో 14.25లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 11లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులే. ప్రతిరోజూ జిల్లాలో 50లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. యూనిట్కు అర్ధరూపాయి చొప్పున పెంచినా...జిల్లాపై రోజుకు రూ.25లక్షల చొప్పున నెలకు రూ.7.75 కోట్ల భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయని, సర్చార్జీలతో కలుపుకుని రెట్టింపు కావడంతో విద్యుత్ బిల్లుల్ని పట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఉచిత విద్యుత్ హుళక్కేనా?.... జిల్లాలో నెలకు 0-50 యూనిట్లులోపు విద్యుత్ను వినియోగించే ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. జిల్లాలో 50 యూనిట్లు లోపు విద్యుత్ను ఉపయోగించే ఎస్సీ కుటుంబాలు 45వేల వరకు ఉండగా, ఎస్టీ కుటుంబాలు మరో 5వేలున్నాయి. వీరు నెలకు 22.50లక్షల విద్యుత్ యూనిట్లు ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా చెల్లించాల్సిన రూ.32.62లక్షలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటి వరకు యూనిట్ రూ.1.45 పైసలుండగా, రాబోయే రోజుల్లో రెండు రూపాయలకు చేరనుంది. దీంతో మరో రూ 12.37లక్షల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ కలలు పేదలకు ఉచిత విద్యుత్ ఇప్పిస్తున్న ప్రభుత్వం.... బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పెరిగిన చార్జీలతో కలిపి బిల్లులు చెల్లించేందుకు ముందుకు వస్తుందా? లేక ఆభారం పేదలపైనే మోపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే కొత్తగా వచ్చే ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించేం దుకు ఇష్టపడకపోతే ఆ చార్జీలు ప్రజల నుంచే వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.