breaking news
navata
-
మోకాలి శస్త్రచికిత్స తర్వాత జాతీయ క్రీడల్లో రజత పతకం
హైదరాబాద్ చిన్ననాటి నుంచే సెపక్తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె, 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యంతో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అయితే, శిక్షణ సమయంలో మోకాలికి తీవ్ర గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని అధిగమించి, మళ్లీ తిరిగి బరిలోకి దిగి ఈసారి జాతీయ స్థాయిలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోస్కోపి, జాయింట్ రీప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ హరిప్రకాష్ ఆమె చికిత్స గురించి వివరించారు.“నవత శిక్షణలో ఉండగా మోకాలికి తీవ్రమైన గాయం అయ్యింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో, ఇంటర్నెట్లో అన్వేషించి మమ్మల్ని సంప్రదించారు. పరీక్షల తర్వాత ఆమెకి ఉన్న గాయం – పూర్తిగా నాశనమైన ఏసీఎల్ (యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్) అని నిర్ధారించాం. ఇది మోకాలిలో ప్రధాన లిగమెంట్లలో ఒకటి. గాయం తీవ్రంగా ఉండటంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.మొదట వాపు తగ్గేందుకు రెండు వారాల పాటు వేచి ఉన్నాం. అనంతరం ఆమె తన మోకాలిలో ఉండే మరో లిగమెంట్ను తీసుకుని మళ్లీ అమర్చాం. ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి ఆటను ప్రారంభించారు. అంతకుమించి, జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆనందదాయకం. తొడ నుండి లిగమెంట్ తీసుకుంటే శరీరానికి ఎలాంటి హాని ఉండదు. పైగా శరీరం త్వరగా అంగీకరిస్తుంది. కృత్రిమ లిగమెంట్లను ఉపయోగిస్తే అంగీకారం కొంత ఆలస్యం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ లిగమెంట్లు దెబ్బతినినప్పుడు మాత్రమే కృత్రిమ లిగమెంట్లు ఉపయోగిస్తాం.గాయాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. అప్పుడు ఏసీఎల్ మాత్రమేనా, లేక మెనిస్కస్ గానీ, కార్టిలేజ్ గానీ దెబ్బతిన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. లిగమెంట్ గాయాలు అయితే వాపు తగ్గిన తర్వాతే శస్త్రచికిత్స చేస్తాం. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ కూడా ఎంతో కీలకం” అని డాక్టర్ హరిప్రకాష్ తెలిపారు.తిరిగి ఆడగలనని అనుకోలేదు: నవత“ఆసియా క్రీడలలో ఆడే అవకాశానికి చాలా ఉత్సాహంగా గోవాలో శిక్షణలో పాల్గొన్నాను. కానీ అక్కడ మోకాలికి గాయం కావడంతో ఎంతో షాక్కి లోనయ్యాను. వెంటనే బెస్ట్ స్పోర్ట్స్ సర్జన్ ఎవరో ఇంటర్నెట్లో వెతికాను. అప్పుడే కిమ్స్లో డాక్టర్ హరిప్రకాష్ పేరును చూశాను. మా సొంత ఊరు ఇక్కడే కావడంతో వెంటనే ఆస్పత్రికి వచ్చి చూపించుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాను.ఆ తర్వాత ముంబైలో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం రావడంతో ఫిజియోథెరపీకి ఎక్కువ సెలవులు తీసుకోలేకపోయాను. అందువల్ల కోలుకోవడానికి సుమారు 8–10 నెలలు పట్టింది. తర్వాత నెమ్మదిగా తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 2024 అక్టోబర్, నవంబర్ నెలల నుంచి తిరిగి శిక్షణ కొనసాగించాను.సెపక్తక్రా అనేది లెగ్ వాలీబాల్ లాంటి ఆట. చెయ్యి తాకితే ఫౌల్ అవుతుంది. మోకాళ్లతో ఎక్కువ పనివుంటుంది. అటువంటి ఆటను మోకాలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఆడగలనని నేను అనుకోలేదు. కానీ డాక్టర్ చేసిన శస్త్రచికిత్స విజయవంతంగా జరగడంతో నేను పూర్తిగా కోలుకుని జాతీయ స్థాయిలో పతకం సాధించగలిగాను” అని నవత ఆనందం వ్యక్తపరిచారు. -
నవత.. మరో ఘనత
ఆరోసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక వరల్డ్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వచ్చే నెల బ్యాంకాక్లో మెగాటోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: సెపక్తక్రా క్రీడలో జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి నవత దూసుకుపోతోంది. నిరుపేద కుటుంబ, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా మొక్కవోని దీక్ష, పట్టుదలతో సెపక్తక్రాలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. ప్రధాన స్రై్టకర్గా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. వచ్చే నెల 15 నుంచి 20 వరకు బ్యాంకాక్ (థాయ్లాండ్)లో జరగనున్న సెపక్తక్రా వరల్డ్ చాంపియన్షిప్కు భారత మహిళల జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో మహారాష్ట్ర (ఔరంగాబాద్)లో జరిగిన ప్రత్యేక క్యాంపులో ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన నవతను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 28న జాతీయ జట్టుతో కలిసి ఆమె బ్యాంకాక్కు బయలుదేరనుంది. సెపక్తక్రాలో ప్రదర్శనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నవతకు రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. అంతర్జాతీయ పోటీల్లో నవత ప్రతిభ... సెపక్తక్రాలో నవత గతంలో ఐదుసార్లు అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2013 సెప్టెంబర్లో యుథంటిని (థాయ్లాండ్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్షిప్లో దేశానికి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో భారత మహిళల జట్టు మూడోస్థానంలో నిలిచింది. 2014 మార్చిలో కౌలాలంపూర్(మలేసియా)లో జరిగిన ఐఎస్టీఏఎఫ్ సూపర్సిరీస్ చాంపియన్షిప్లో పాల్గొంది. అదే ఏడాది ఆగస్టులో బ్యాంకాక్(బ్యాంకాక్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్షిప్లో పాల్గొని రజత పతకం సాధించింది. సెప్టెంబర్లో కొరియాలో జరిగిన ఏషియన్స్ గేమ్స్లో, 2015లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్కు దేశం తరుఫున పాల్గొంది.


