breaking news
National Emblem
-
చిహ్నమే కాదు, స్ఫూర్తీ ముఖ్యమే!
అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనికుడు. అశోకుడిది ఒక ఆదర్శవంతమైన పాలన. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశోకుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నాలను రూపొందించుకున్నామో, ఆ లక్ష్యాలను ప్రభుత్వాలు మరువకూడదు. ‘‘భారత జాతీయ జెండాలో గతంలో మనం వాడిన చరఖాకు బదులుగా చక్రాన్ని ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది కేవలం ఒక గుర్తు కాదు. దీని వెనుక ఒక సామాజిక మార్పు, ఒక మహోన్నత వ్యక్తి దాగున్నారు. అతడే అశోకుడు. అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనిక చక్రవర్తి. భారత చరిత్రలో అశోకు డిది ఒక ఆదర్శవంతమైన పాలన. అది భారత చరిత్ర పైనే కాదు, ప్రపంచ చరిత్రపైనే గొప్ప ప్రభావాన్ని చూపింది. అది ఒక జాతీయ వాద చరిత్ర కాదు. అశోకుడు తన దూతలను, ప్రతినిధులను ప్రపంచంలోని అనేక దేశాలకు పంపించాడు. అయితే ఆయనది దురా క్రమణ కాంక్ష కాదు. శాంతి సందేశమే ఆయన ఆశయం.’’ జాతీయ పతాకంలో చేర్చాల్సిన ధర్మచక్రాన్ని గురించి 1947 జూలై 22న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి. మన జాతీయ పతాకంలో పొందుపరచిన ధర్మచక్రానికీ, సమ్రాట్ అశోకుడికీ ఉన్న సంబంధం ఏమిటో చాలామందికి తెలుసు. మన దేశ రాజముద్ర, అశోకుని స్తంభంలోని సింహాల చిత్రమని కూడా చాలా మంది ఎరిగినదే. అయితే, అవి ఎలా నిర్మించారు? ఎందుకు నిర్మిం చారు? వాటిని ఎవరు గుర్తించారు? అనే విషయాలు తెలియవు. ఈ తరానికి వాటి ప్రాముఖ్యత తెలియాల్సిన అవసరమున్నది. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ఆ సింహాల నిర్మాణం పైనే వివాదం చెలరేగింది. సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపించే సింహా లకు బదులుగా వాటిని ఉగ్రరూపంలో నిర్మించారని పలువురు చరిత్ర కారులు ఆరోపించారు. ప్రతిపక్షాలూ విమర్శలను గుప్పించాయి. బ్రిటిష్ పాలకులు భారత దేశం వచ్చేవరకూ అశోకుని గురించి గానీ, బౌద్ధ చరిత్ర గానీ ప్రచారంలో లేదు. రాత ప్రతుల్లో, ముఖ్యంగా పాళీ భాషలో, సంస్కృత భాషలో బౌద్ధం గురించి వివరాలు ఉండేవి కానీ, ఇతర ఆధారాలు లేవు. 1818 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ జనరల్ హెన్సీ టైలర్ సాంచి స్థూపాన్నీ, దాని అవశేషాలనూ కనుగొన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 1881లో దానిని పదిలపరిచే పని మొదలైంది. 1919 కల్లా పూర్తయ్యింది. ఎప్పుడైతే సాంచిలో ఇటు బౌద్ధ శిల్పాలు, ఇతర అవశేషాలు బయటపడ్డాయో, బౌద్ధ చరిత్ర మీద, అశోకుని పాలన మీద అధ్యయనం జరపాలన్న ఆసక్తి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తల్లో మొదలైంది. అంతకుముందే సారనాథ్ ప్రాంతంలో కూడా కొన్ని ఆశ్చర్యం గొలిపే శిలావిగ్రహాలు, ఇతర నిర్మాణాలను 1780లో విలియం హోడ్జెస్ అనే చిత్రకారుడు గుర్తించాడు. అక్కడ అతడొక స్థూపాన్ని చూశాడు. కానీ అది బౌద్ధ స్థూపం అని తెలియదు. ఆ తర్వాత 1794లో బెనారస్ కమిషనర్ జోనాధన్ డంకన్ కొన్ని తవ్వకాలు జరి పాడు. కొన్ని ఇటుకలు మాత్రమే అక్కడ దొరికాయి. అయితే 1861లో బ్రిటిష్ భారత పురాతత్వవేత్త లార్డ్ కన్నింగ్హామ్ ఆ స్థూపాన్ని సందర్శించి, తవ్వకాలను ముమ్మరం చేశాడు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఎఫ్.ఓర్టల్ ఆనాటి భారత పురాతత్వ సొసైటీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ను ఒప్పించి, 1904–05 సంవత్సరాల మధ్య కాలంలో చేపట్టిన తవ్వకాలలో స్థూపం స్వరూపం బయట పడింది. అందులోని అశోక స్తంభం, ఆ స్తంభంలోని సింహాలు, ఇతర చిహ్నాలు అన్నీ కలిపి భారత రాజముద్రను రూపొందించుకున్నాం. అశోకుని స్థూపంలో ఉన్న సింహాల భాగాన్ని భారత రాజ ముద్రగా 1947 డిసెంబర్ 29వ తేదీన ఆమోదించుకున్నాం. దానిని 1950, జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చారు. ఇందులో నాలుగు దిక్కులా సింహాల బొమ్మలను విశ్వాసానికి, శక్తికి, ధైర్యానికి గుర్తు లుగా ప్రతిష్ఠించుకున్నాం. అంతే కాకుండా జాతీయ వృక్షంగా మర్రి చెట్టును నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా బౌద్ధ సాంప్రదాయంతో ముడివడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అశోక స్తంభ నిర్మాణం కమలం మీదనే జరిగింది. జాతీయ పక్షి నెమలి అశోకుని వంశానికి చిహ్నం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం, మన రాజముద్రలో ఉన్న సింహాలు బుద్ధుని ప్రతీకలుగా భావిస్తారు. ఆయన జన్మించినది శాక్య తెగ. అందుకే సిద్ధార్థుడిగా జన్మించి, గౌతమ బుద్ధునిగా మారిన బుద్ధున్ని శాక్య సింహంగా పిలుస్తారు. స్తంభం పైన నాలుగు సింహా లను ఉంచడమంటే నలుదిక్కులా ఆయన బోధనలను వ్యాప్తి చేయా లనీ, విస్తరించాలనీ అశోకుని ఉద్దేశ్యంగా చరిత్రకారులు భావిస్తారు. అందులో ఏనుగు ఆయన శక్తికీ, ఆయన జన్మ రహస్యానికీ చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా వృషభం ఆయన బలాన్ని సూచిస్తుంది. ఆయన ఇంటినుంచి మహాభినిష్క్రమణ రోజున బుద్ధుడు తీసుకెళ్ళిం దనడానికి సంకేతంగా గుర్రాన్ని భావిస్తున్నారు చరిత్రకారులు. అయితే మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత దాదాపు 84,000 బౌద్ధ నిర్మాణాలను చేపట్టినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా, గౌహతి నుంచి కర్ణాటక దాకా భారతదేశమంతటా బౌద్ధాన్ని తన శాసనాల ద్వారా, స్థూపాలు, ఇతర నిర్మాణాల ద్వారా దశదిశలా వ్యాప్తి చేశాడు. అశోకుడు కనుక అటువంటి నిర్మాణాలను చేపట్టి ఉండకపోతే భారత దేశంలో బౌద్ధం పునరుజ్జీవనం పొందడం సాధ్యమయ్యేదే కాదు. బుద్ధుడు జన్మించిన ఈనాటి నేపాల్లోని లుంబిని, జ్ఞానోదయం పొందిన బోధ్ గయ, మొదటి బోధన చేసిన సారనాథ్, నిర్వాణం పొందిన కుశీ నగరం... ఈ రోజు ప్రపంచానికి అందు బాటులో ఉన్నాయంటే అది అశోకుడి దార్శనికత ఫలితమే. బౌద్ధ సాహిత్యంలోని ఈ విషయాలన్నింటినీ విదేశీ బౌద్ధ యాత్రికులు, ప్రత్యేకించి హ్యూయన్త్సాంగ్, పాహియాన్ లాంటి వాళ్లు తమ రచనల్లో పేర్కొన్నారు. బౌద్ధ చారిత్రక ప్రదేశాలను సంద ర్శించినట్టు; అక్కడ చైత్యాలు, విహారాలు, స్థూపాలు ఉన్నట్టు వారు రాశారు. ఆ వివరాలను పరిగణనలోనికి తీసుకొని బ్రిటిష్ పురాతత్వ చరిత్రకారులు తవ్వకాలు జరిపి బౌద్ధ చారిత్రక ఆధారాలను బయట పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి. అశోకుడు వేసిన చాలా శాసనాల్లో తన పేరు నేరుగా లేదు. ‘దేవానాం పియ’(దేవానం ప్రియ) అని మాత్రమే శాసనాల్లో ఉంది. అయితే 1840 సంవత్సరంలో శ్రీలంకలో టర్నల్ అనే రచయిత శ్రీలంక చరిత్ర మహాగ్రంథమైన ‘మహావంశ’లో అశోకుడే దేవానాం పియ అని అని గుర్తించాడు. అశోకుడు కేవలం కొన్ని చారిత్రక నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. అప్పటి వరకూ కొనసాగుతున్న యజ్ఞ, యాగా దుల హింస, ప్రత్యక్ష దోపిడీ నుంచి బుద్ధుని బోధనల ద్వారా సమాజాన్ని విముక్తం చేశారు. దానివల్ల వృత్తులు, పరిశ్రమలు, వ్యవ సాయం అభివృద్ధి చెందాయి. మూఢనమ్మకాలను వ్యాపింపజేసిన పురోహిత వర్గ ఆధిపత్యాన్ని అశోకుడు నిలువరింపజేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పురోహిత వర్గం అశోకుడి మీద ఎన్నో రూపాల్లో తప్పుడు ప్రచారాలు చేసింది. కానీ సత్యం జయిస్తుందనే గౌతమ బుద్ధుని ఉవాచ అశోకుడి విషయంలో రుజువైంది. భారత దేశా నికిæస్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశో కుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నలను రూపొందించు కున్నామో, ఆ లక్ష్యాలను మరువకూడదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
National Emblem: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. అశోక చక్రంపై ఎంతో ఠీవిగా, విశ్వాసంతో కనిపించే సింహాలకు బదులు.. భయపెట్టే, దూకుడు భంగిమలో ఉన్న సింహాల ప్రతిమను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిని వెంటనే మార్చాలంటూ ప్రధానిని డిమాండ్ చేశారు. ‘‘మోదీ జీ, సింహాల ముఖ భంగిమ గమనించండి. ఇది ఘనమైన సార్నాథ్ చిహ్నమా లేక గిర్ సింహానికి వక్రీకరణ రూపమా? పరిశీలించి, అవసరమైన మేరకు మార్పులు చేయండి’’అంటూ లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘గంభీరంగా కనిపించే మన జాతీయ చిహ్నం అశోక సింహాలకు అవమానమిది. రాజసానికి బదులుగా గర్జిస్తూ, దూకుడుతో మోదీ మార్కుతో ఉన్న సింహాల ప్రతిమను పార్లమెంట్ కొత్త భవనంపై ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వెంటనే మార్చండి’అంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు జవహర్ సర్కార్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జాతీయ చిహ్నాన్ని స్వతంత్ర భారతంలో 1950లో మనం స్వీకరించాం. ఈ చిహ్నం విషయంలో ప్రస్తుత జోక్యం పూర్తిగా అవాంఛనీయం, అనవసరం. అశోక చక్రంపైని సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?’అని పేర్కొన్నారు. ‘గాంధీ నుంచి గాడ్సే దాకా.. ప్రశాంతంగా, దర్పంగా కూర్చుని కనిపించే మన జాతీయ చిహ్నంలోని సింహాల నుంచి.. పార్లమెంట్ నూతన భవనంపై ఆవిష్కరించిన కోపంతో, కోరలు చాచి కనిపించే సింహాల వరకు..ఇదే మోదీ నూతన భారతం’అంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: బీజేపీ పార్లమెంట్ నూతన భవనంపైన ఆవిష్కరించి నాలుగు సింహాల ప్రతిమ సార్నాథ్ స్తంభంపైనున్న సింహాలకు ప్రతిరూపమేనని బీజేపీ పేర్కొంది. నిస్పృహలో ఉన్న ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ప్రధాని మోదీ లక్ష్యంగా ఏదో ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని పేర్కొన్నారు. బ్రిటిష్ జమానాలో 150 క్రితం నిర్మించిన భవనానికి బదులుగా కొత్తగా పార్లమెంట్ భవనాన్ని ఏర్పాటు చేయడమే ప్రతిపక్షాల కడుపుమంటకు కారణమన్నారు. -
కొత్త పార్లమెంట్: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం
New Parliament building.. దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన నిర్మాణాన్ని అక్టోబర్లోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కాగా, ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని(నాలుగు సింహాలతో) ఆవిష్కరించారు. కాగా, జాతీయ చిహాన్ని కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం స్పెషల్ ఇదే.. - కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఈ ఖర్చు 29 శాతం పెరిగి రూ. 1,250 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. 13 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు, సాంస్కృతిక వైవిద్యం కొత్త పార్లమెంట్లో కనిపించనుంది.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు భవన నిర్మాణంలో పని చేస్తన్నారు. - ఈ ప్రాజెక్ట్ డిజైన్ను హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్) రూపొందించనున్నారు. - కొత్త పార్లమెంట్ భవనంలోని ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, 2. లోక్సభ సభాపతి, రాజ్యసభ చైర్పర్సన్, ఎంపీలు, 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్లుగా నిర్ణయించారు. కాగా.. లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు ఉండనుంది. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు ఉండనుంది. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. Hon’ble PM Shri @narendramodi ji unveiled the 'National Emblem' cast at New Parliament Building. सत्यमेव जयते। 🇮🇳 pic.twitter.com/b2VOPkFHAx — Darshana Jardosh (@DarshanaJardosh) July 11, 2022 -
అమీర్ఖాన్కు నోటీసులు
-
అమీర్ఖాన్కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. పాపులర్ టీవీ షో సత్యమేవ జయతేలో జాతీయ చిహ్నాన్ని (లోగో), అందులో సత్యమేవ జయతే అనే భాగాన్ని కేంద్ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే ఆందోళనకారుడు తన లాయర్ ద్వారా ఈ నోటీసులు పంపించారు. విశేష ప్రజాదరణ పొందిన సత్యమేవ జయతే కార్యక్రమానికి యాంకర్ కమ్ నిర్మాతగా వ్యవహరించిన అమీర్ఖాన్, ఆయన భార్య, సహనిర్మాత కిరణ్ రావు, దర్శకుడు సత్యజిత్ భక్తల్ ను ఇందులో దోషులుగా పేర్కొన్నారు. జాతీయ చిహ్నాన్ని గానీ, దాంట్లోని ఏదైనా భాగాన్నిగానీ, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరికీ అధికారం లేదని రాయ్ న్యాయవాది మనోజ్ సింగ్ వాదిస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. లేదంటే దీనికి సంబంధించి తన క్లయింటు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించడానికి అమీర్ ఖాన్, కిరణ్రావు తదితరులెవ్వరూ అందుబాటులో లేరు.