-
మీరేమన్నా అంటే.. చచ్చిపోతా..!
హిమాయత్నగర్ : ‘ఓ వ్యక్తిపై యజమానురాలు ఇంటి అద్దె చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఆ వ్యక్తిని పోలీసులు పిలిచి మందలించారు. దీంతో ఆ వ్యక్తి ‘మీరేమన్నా అంటే.. నేను చచ్చిపోతా.. అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ముగ్గురు క్యాబ్డ్రైవర్లు, ఐదారుగురు ఫుడ్ డెలివరీ బాయ్స్ తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్యక్తిని పిలిచి విచారించగా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. నన్ను పీఎస్కు పిలిచి మందలిస్తారా.. మీ పద్ధతి ఏం బాగోలేదు’ అంటూ బ్లాక్మెయిల్కు దిగాడు. ఇదీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారం. ఇది మీ పద్ధతి కాదు అని హెచ్చరించినందుకే వీరిద్దరూ పోలీసులపై తిరగబడి వింతగా ప్రవర్తిస్తున్నారు. నీ పేరు రాసి చచ్చిపోతా.. హైదర్గూడలో పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ వృద్ధురాలి ఇంట్లో ప్రకాశరావు అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నారు. జనవరిలో వృద్ధురాలి ఇంట్లో కి అద్దెకు దిగారు. అప్పటి నుంచి సరిగ్గా ఇంటి అద్దె కూడా ఇవ్వలేదు. అద్దెకు దిగేప్పుడు రూ.50 వేలకు ఓ చెక్కును ఇచ్చాడు. అసలు ఇతగాడికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. వృద్ధురాలు అద్దె కావాలి అనడంతో అప్పుడప్పుడు రూ.2వేలు ఇచ్చేవాడు. ఈ విషయంపై వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పిలిచి మందలించారు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు ఇస్తావా..? అంటూ వృద్ధురాలిని వేధించడం మొదలు పెట్టాడు. ట్యాంక్బండ్పై సూసైడ్ స్లిప్తో.. తన వేధింపులు భరించలేకపోతున్నా అంటూ వృద్ధురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మళ్లీ ఆ వ్యక్తిని పీఎస్కి పిలిపించారు. పద్ధతి మార్చుకుని ఆమెకు అద్దె డబ్బులు ఇవ్వాలని చెప్పారు. దీంతో ‘మీరేమన్నా అంటే నేను చచ్చిపోతా’ అంటూ పోలీసులను బ్లాక్మెయిల్ చేశాడు. ‘నన్ను నారాయణగూడ పోలీసులు వేధిస్తున్నారు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోతా’ అంటూ సూసైడ్ నోట్ రాసుకుని లేక్పోలీస్ స్టేషన్ ఎదురుగా తిరుగుతున్నాడు. అనుమానం వచ్చిన లేక్ పోలీసులు ఓ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఉన్నతాధికారిని కలిసి సూసైడ్ నోట్ చూపించాడు. విషయం గురించి ఉన్నతాధికారి నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్కు ఫోన్ చేసి అడగడంతో ఇతడి లీలలు వివరించారు. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ వద్దకు పంపారు. ఇది సివిల్ మ్యాటర్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను నన్ను వేధిస్తున్నారంటూ వారిపై కేసు వేయాలని లాయర్ను కూడా సంప్రదించాడు. క్యాబ్, ఫుడ్ఆర్డర్ డబ్బులు ఎగ్గొట్టాడు నారాయణగూడ పీఎస్ పరిధిలోని బర్కత్పుర సిగ్నల్ వద్ద ఓ ఇంట్లో చంద్రశేఖర్ భార్యతో కలిసి ఉంటున్నాడు. పనుల నిమిత్తం పలుమార్లు ఓలా, ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని పని నిమిత్తం నగరంలోని పలు ప్రాంతాలకు తిరిగి ఇంటికి చేరతాడు. పర్సులో డబ్బులు సరిపడా లేవు తీసుకొస్తా అని ఇంటిపైకి వెళ్తాడు. మళ్లీ బయటకు రాడు. నచ్చిన ఫుడ్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. డెలవరీ బాయ్ ఎంతసేపు పిలిచినా స్పందన ఉండదు. పలుమార్లు కాలింగ్ బెల్ కొడితే భార్య బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేరు అని చెబుతుంది. దీంతో క్యాబ్డ్రైవర్లు, ఫుడ్డెలివరీ బాయ్స్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరిలా నన్ను నిందించడం సరికాదు క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని పీఎస్కు పిలిపించి విచారించారు. నేను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదంటూ బదులిచ్చాడు. దీంతో పోలీసులు మందలించడంతో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? పీఎస్కు పిలిపించి నిందించడం సరికాదు’ అంటూ పోలీసులపైనే ఎదురు దాడికి దిగడంతో అందరూ అవాక్కయ్యారు. -
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ భారీ మోసం
హిమాయత్నగర్ (హైదరాబాద్): హిమాయత్నగర్లోని ప్రైమ్టెక్ సొల్యూషన్స్ అనే ఓ కన్సల్టెన్సీపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ సంస్థ మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని, ఎంసెట్లో మార్కులు వేయిస్తానని చెప్పి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెడికల్ సీటు ఇప్పిస్తానని తన దగ్గర ప్రైమ్టెక్ సొల్యూషన్స్ అధినేత సతీష్పాల్యాడ్ రూ.10 లక్షలు తీసుకున్నారంటూ గోపీకృష్ణ అనే బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కన్సల్టెన్సీ కార్యాలయంపై దాడులు నిర్వహించి విచారణ నిర్వహించారు. కాగా, బాధితుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్ల నుంచి ఈ సంస్థ ఇక్కడ నడుస్తోంది. -
హవాలా కేసు ఐటీ శాఖకు అప్పగింత
హైదరాబాద్ : హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తు పట్టుకున్న కేసును నారాయణగూడ పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు. రెండు రోజుల క్రితం హిమాయత్ నగర్లో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హిమాయత్ నగర్ నుంచి కారులో డబ్బు తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నారు. వీరిలో హిమాయత్ నగర్లోని హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో నలుగురు ఉన్నారు. చాంద్బాగ్కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వారు డబ్బు తరలిస్తున్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. -
బర్కత్పుర డివిజన్ కార్పొరేటర్ అరెస్ట్
అలిండియా సుపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు, బర్కత్పుర కార్పోరేటర్ దిడ్డి రాంబాబును శుక్రవారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని నారాయణగూడ పోలీసు స్టేషన్కు తరలించారు. గత నెల 30న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల నేపథ్యంలో బర్కత్పురలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. అ క్రమంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి దిగారు. దాంతో బీజేపీ నాయకులు అదే రోజు నారాయణ గూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా దిడ్డి రాంబాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement