breaking news
nano chemical factory
-
మాకొద్దీ మాయదారి ఫ్యాక్తరీ
-
మాకొద్దీ మాయదారి ఫ్యాక్టరీ
-
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
-
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
పాణ్యం : కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసులు బనాయించి తమ వారిని తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. కొండజూటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న నానో కెమికల్ ప్యాక్టరీని అడ్డుకుంటున్న గ్రామస్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత మందిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్స్టేషన్ ఎదుట ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘నానో’ బారి నుంచి కాపాడండి
పాణ్యం : పాడి పంటలతో కళకళలాడుతున్న గ్రామంలో కెమికల్ పరిశ్రమ పెట్టి మనుషులు, పశు సంపద మనుగడకు పెనుముప్పు తెచ్చి పెడుతున్నారని మండల పరిధిలోని కొండజూటూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో రూ. 1100 కోట్లతో నిర్మించతలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమను ఎలాగైనా అడ్డుకోవాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం గ్రామ పరిధిలో సాగునీటి ఆధారంగా ఏటా రెండుకార్ల పంటలు పండుతున్నాయని, కెమికల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మొత్తం విషపూరితమవుతుందని జగన్మోహన్రెడ్డికి తెలిపారు. పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ గ్రామాలను నాశనం చేసేందకు పూనుకుందన్నారు. కొద్దిగా చొరవ తీసుకుని కెమికల్ పరిశ్రమను అడ్డుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్మోహన్రెడ్డి త్వరలోనే గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, లాయర్బాలస్వామి, సుమిత్ర, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.