breaking news
nannapaneni
-
ఇన్సైడర్ ట్రేడింగ్..టీడీపీ నేత ఇంటికి నోటీసులు
-
మరో రెండు జిల్లాల ఏర్పాటుకు డిమాండ్
వరంగల్ : పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా రాష్ట్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. తెలంగాణలో కొత్త జిల్లాల డిమాండ్ ఆగడం లేదు. తమ ప్రాంతాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఎక్కడో చోట నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సాక్షాత్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ డిమాండ్ను తెరపైకి తేవడం గమనార్హం. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాను విభజించి.. జనగామ్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. అయితే, వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలని, ఈ మేరకు రెండు జిల్లాల మార్పు అనివార్యమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తాజాగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మొదట ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ.. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
పీఠం కోసం..
♦ మేయర్ పదవి దక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు ♦ రేసులో ముందున్న నన్నపనేని, గుండా ప్రకాశ్ ♦ డిప్యూటీ మేయర్ పరిశీలనలో జోరిక, బోడ డిన్న ♦ కీలక నేతల వద్దకు ఆశావహుల పరుగులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో ఈ కీలక ప్రక్రియ పూర్తి కానుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించింది. కార్పొరేషన్లోని 58 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన ఎనిమిది మంది కూడా అధికార పార్టీలోనే చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు తిరుగులేని మెజారిటీ ఉండడంతో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు ముఖ్య నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలిసి తమ కోరికను చెప్పుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. గులాబీ పార్టీ ముఖ్య నేతలు టి.హరీశ్రావు, కె.టి.రామారావు, కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లి మేయర్ పదవి వచ్చేలా తమకు సహకరించాలని కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్యతోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలుస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న అధిష్టానం.. మేయర్ పదవి ఎవరికి అప్పగించాలనే విషయంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పదవిని ఆశిస్తున్న కీలక నేతల వివరాలను సేకరిస్తోంది. అధికార పార్టీ కావడంతో అన్ని రకాలుగా సమాచారం తీసుకుంటోంది. ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా పరిశీలిస్తోంది. 19వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన నన్నపునేని నరేందర్ పేరును మేయర్ పదవికి టీఆర్ఎస్ అధిష్టానం ప్రధానంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఆర్టీసీ టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా కీలకంగా పని చేసిన నేపథ్యం ఆయనకు అనుకూలిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ చివరి నిమిషయంలో చేజారడం నరేందర్కు కలిసివచ్చే మరో అంశంగా ఉంది. కాగా, అధిష్టానం పరిశీలనలో 26వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన గుండా ప్రకాశ్రావు కూడా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించినందున గుండా ప్రకాశ్రావుకు అవకాశం ఇవ్వాలని ఆర్యవైశ్య మహాసభ కోరుతోంది. ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నేతృత్వంలో పలువురు సంఘం ముఖ్యులు గుండా ప్రకాశ్కు మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రయత్నిస్తున్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య పేరును మేయర్ పదవి కోసం పరిశీలించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధిష్టానాన్ని కోరుతున్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ సైతం మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వద్దిరాజు గణేష్కు ఇప్పటికీ టీఆర్ఎస్ సభ్యత్వం లేకపోవడం పదవి విషయంలో అడ్డంకిగా మారుతోంది. ‘డిప్యూటీ’పై పలువురి కన్ను.. మేయర్ పదవి సీనియర్ నేతలకు దక్కనున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎక్కువ మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ తరహాలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికి ఈ పదవి ఇవ్వవచ్చనే అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్న 30వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్న, 34వ డివిజన్ కార్పొరేటర్ జోరిక రమేశ్, 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఖాజా సిరాజొద్దిన్, 36వ డివిజన్ కార్పొరేటర్ అబూబక్కర్, 6వ డివిజన్ నుంచి గెలుపొందిన చింతల యాదగిరి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం డిప్యూటీ మేయర్ పదవి కోసం పరిశీలిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు, పార్టీలో క్రీయాశీలకంగా పని చేయని వారు సైతం ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నా టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఏపీపై కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి కొరిటెపాడు(గుంటూరు): తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని శాసనమండలి మాజీ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. స్థానిక నవభారత్ నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలపై పన్నులు విధించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 10 సంవత్సరాలు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా తేల్చారని, ఈ 10 ఏళ్లు కూడా ఆగలేరా అని ప్రశ్నించారు. ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటే రేపు సచివాలయం, అసెంబ్లీకి కూడా పన్నులు కట్టాలని తెలంగాణ ప్రభుత్వం అదేశిస్తుందన్నారు. ఈ ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాసనమండలి చీఫ్ విఫ్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగిసిందని ఆమె తెలిపారు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని స్పష్టం చేశారు. నన్నపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, ములకా సత్యవాణిరెడ్డి, చిట్టాబత్తిన చిట్టిబాబు, చంద్రగిరి ఏడుకొండలు, పోతురాజు ఉమాదేవి, నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.