-
Nandamuri Suhasini Son Marriage Photos: నందమూరి సుహాసిని కుమారుడి వివాహం (ఫొటోలు)
-
అందుకే ఓడిపోయే సీటు సుహాసినికి ఇచ్చారు
కేపీహెచ్బీకాలనీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ లేదని, వారి కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఓడిపోయే కూకట్పల్లి సీటును నందమూరి సుహాసినికి కేటాయించారని అన్నారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలో చేపట్టిన రోడ్షోలో భాగంగా కేపీహెచ్బీకాలనీ బస్టాప్ సెంటర్లో ఆయన మాట్లాడారు. లోకేష్బాబును నేరుగా మంత్రిని చేసిన చంద్రబాబు... ఏమాత్రం రాజకీయాలు తెలియని సుహాసినిని మాత్రం ఎన్నికల్లోకి లాగి బలిపశువును చేశారన్నారు. సుహాసిని సోదరులను ఈ ఎన్నికల ద్వారా పూర్తిగా రాజకీయాలకు దూరం చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని... ఇక ఏవైపు ఉంటారో ఓటర్లే తేల్చుకోవాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో ఒక్క కేపీహెచ్బీ మాత్రమే టీడీపీకి దక్కిందని, కేపీహెచ్బీ కాలనీ ప్రజలు మరోసారి మోసపోవద్దని... టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి మాధవరం కృష్ణారావును గెలిపించాలని కోరారు. కృష్ణారావు పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి 26 కులాలకు న్యాయం చేయాలని కోరారని.. బీసీ కమిషన్ ద్వారా నివేదికను తెప్పించుకొని తప్పకుండా న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, కృష్ణారావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు తప్పు చేశారు... సీఎం కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడు ముమ్మాటికీ తప్పు చేశారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి డబ్బు సంచులతో కెమెరాలకు చిక్కింది నిజం కాదా? మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫోన్లో మాట్లాడింది నిజం కాదా? అంటూ కేటీఆర్ నిలదీశారు. కలికాలంలో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపారని... అందులో భాగంగానే పాము, ముంగీసలైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు తీరుతో స్వర్గంలోని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. -
బాబు ఉచ్చులో మరో బలిపశువు!
నిన్నటివరకు ఆమె సాధారణ గృహిణి మాత్రమే. కాకపోతే దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె. పేరు చుండ్రు సుహాసిని. బహుశా నందమూరి కుటుంబానికి తప్ప ఆమె గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబు కౌటిల్య వ్యూహంలో భాగంగా ఉన్నట్లుండి ఆమె టీడీపీ నామినీగా, నందమూరి వంశస్థురాలిగా కూకట్పల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. తన మురికి రాజకీయాల కోసం నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎలా వాడుకుని తర్వాత కరివేపాకులా విసిరిపారేస్తారో ప్రపంచానికే తెలుసు. నందమూరి కుటుంబ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి చెప్పిందనే సాకుతో సుహాసినిని రాజకీయ ముగ్గులోకి దింపినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా భారతదేశంలోనే అత్యంత సంచలనాత్మకంగా ఆయన సొంత అల్లుడు చంద్రబాబు జరిపిన రాజకీయ కుట్రలో నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి తదితర కుటుంబ సభ్యులు ఎలా పావుల్లాగా ఉపయోగపడ్డారో అందరికీ తెలుసు. తన కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అధికార రాజకీయాల్లో సుస్థిరపరిచేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు అధికారంతోనే బతుకీడుస్తారు. అధికారంతోనే నిద్రపోతారు. అధికారంతోనే చస్తారు కూడా. ఆ అధికారంకోసం ఎంతకైనా దిగజారతారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే దశాబ్దాల బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీ ముందు సాగిలపడి టీడీపీ ఆత్మగౌరవ నినాదాన్ని, దాని మూలసూత్రాలను తాకట్టుపెట్టేయడమే. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు ప్రతిష్ట పాతాళానికి అడుగంటిపోయింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి నుంచి జనం దృష్టిని మరల్చడానికి యూపీఏ–ఎన్డీఏ రాజకీయాలను చర్చలోకి తీసుకొచ్చాడు బాబు. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ స్పష్టవైఖరి, పాదయాత్ర భారీ విజయంతో పాటు తన నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క భారీ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టి, అంతవరకు బండబూతులతో సత్కరించిన అదే కాంగ్రెస్తో చేతులు కలపడానికి పరుగెత్తాడు. కాంగ్రెస్తో హనీమూన్ ఎపిసోడ్ చప్పబడిపోవడంతో నందమూరి కుటుంబ సెంటిమెంట్ని ట్రంప్ కార్డుగా బయటకు తెచ్చాడు. పైగా తెలంగాణలో ఎంత చిన్న పాత్రలో అయినా సరే తన ఉనికిని ప్రదర్శించుకోవాలనుకున్న యావతోనే ఇప్పుడు సుహాసినిని ఎన్నికల ముగ్గులోకి దింపాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్న చందంగా నారావారి ఫ్యామిలీ పన్నిన ఉచ్చులో సుహాసిని ఇరుక్కుపోయారు. ఆమె తెలుసుకోవలసిన చరిత్ర ఒకటుంది. ఆమె తాత ఎన్టీఆర్నే సీఎం పదవినుంచి దింపివేసిన ఘనత బాబుది. తర్వాత దగ్గుపాటి కుటుంబాన్ని తోసిపారేశాడు. టీడీపీలో తన స్థానం పదిలమయ్యేంతవరకు, ఆమె తండ్రి హరికృష్ణను వాడేసుకున్నాడు. తర్వాత హరికృష్ణను బాబు ఎంత ఘోరావమానాలకు గురిచేశాడో లోకానికే తెలుసు. మరణించేవరకు ఆ అవ మాన భారంతోనే హరికృష్ణ గడిపారు. ఇక జూని యర్ ఎన్టీఆర్ని కూడా స్టెఫ్నీ టైర్లా ఎన్నిరకాలుగా వాడుకుని బాబు వదిలేశాడో తెలిసిన విషయమే. సుహాసిని తల్లీ... దయచేసి బాబు ఉచ్చులో మరోసారి చిక్కుకోవద్దు. నందమూరి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచే మరో కుట్రకు మీరు పనిముట్టుగా మారవద్దు. ఎన్టీఆర్ అభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, మీ కన్నతండ్రి ఆకాంక్షలకు వ్యతి రేకంగా మీరు ఇప్పటికీ బాబుతో కలిసి నడవాలనుకుంటే మీ తాతయ్య ఎన్టీఆర్, మీ కన్నతండ్రి హరి కృష్ణ ఆత్మలు శాంతించవని గ్రహించండి. తెలంగాణలో సెటిలర్ల సెంటిమెంట్ గేమ్ ఆడేం దుకు చంద్రబాబు ఎందుకు హరికృష్ణ కుటుంబాన్ని ఎంచుకున్నట్లు? తన భార్యను, కుమారుడిని లేదా కోడలిని బాబు ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకంటే తెలంగాణలో టీడీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదని బాబుకు బాగా తెలుసు. అందుకే తెలంగాణలో తన కుమారుడి, తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును బాబు పణంగా పెట్టే చాన్సే లేదు. నందమూరి కుటుంబంపై నిజంగా బాబుకు ప్రేమ ఉంటే 2014 లోనే హరికృష్ణను బరిలో నిలిపి మంత్రిపదవిని ఇచ్చేవారు. కానీ ఎన్టీఆర్ కుటుంబీకులు ఇప్పటికీ ఈ మేకవన్నె పులిని ఎలా నమ్ముతున్నారనే ఆశ్చర్యం. సుహాసిని ఇంటిపేరును చర్చలోకి దింపటం భావ్యం కాదు కానీ ఆమె మెట్టింటి పేరును మరుగుపర్చి పుట్టింటి పేరును మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి తెలంగాణలో ఉనికికోసం బాబు చేస్తున్న కుట్రలకు తాజాగా ఆమె బలికాబోతున్నారన్నది వాస్తవం. – బీజీఆర్ -
సుహాసిని భర్త స్థానంలో తండ్రి పేరు
సాక్షి, సిటీబ్యూరో: మహాకూటమి తరఫున కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వెంకట సుహాసిని ఓటరు కార్డులో ఆమె భర్త స్థానంలో తండ్రి హరికృష్ణ పేరు నమోదైంది. ఆమె ఇటీవలే నాంపల్లి నియోజకవర్గం నుంచి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే తలంపుతోనే ‘నందమూరి’ పేరు ప్రచారం కోసం కాబోలు... ఆమె చుండ్రు ఇంటి కోడలైనప్పటికీ, నందమూరి వెంకట సుహాసినిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్. సాధారణంగా పెళ్లయ్యాక ఓటరుగా నమోదు చేయించుకునేటప్పుడు తండ్రి/భర్త స్థానం కాలమ్లో భర్త పేరు నమోదు చేయించుకుంటారు. అయితే సుహాసిని మాత్రం తండ్రి పేరు నమోదు చేయించుకున్నారు. కానీ పొరపాటో మరి తొందరపాటో తెలియదు గానీ.. తండ్రి పేరు కాస్తా భర్తగా నమోదైంది. ఆమె అఫిడవిట్లో హరికృష్ణను తండ్రిగానే పేర్కొన్నారు. అయితే అఫిడవిట్తో పాటు ఓటరుగా నమోదైనట్లు తెలియజేసేందుకు సమర్పించిన ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీలోనూ తండ్రి పేరు అని ఉన్న చోట భర్త పేరుగా హరికృష్ణ పేరుతోనే జారీ చేశారు. ‘ఫాదర్’ అని ఉండగా, కొట్టివేసి వైఫ్ ఆఫ్ అని దిద్ది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేశారు. ఓటరు జాబితాలో ఉన్న మేరకే అలా చేశారని తెలుస్తోంది. నాంపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల జాబితా పార్ట్నెంబర్ 48, సీరియల్ నెంబర్ 710 ఓటరుగా ఆమె పేరు నమోదైంది. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారి మమత దృష్టికి తీసుకెళ్లగా... ఇలాంటి స్వల్ప పొరపాట్లు జరుగుతుంటాయని, అలాంటి వాటితో నామినేషన్ను తిరస్కరించలేమని స్పష్టం చేశారు. -
బాబు పొలిటికల్ గేమ్లో పావులైన ఎన్టీఅర్ ఫ్యామిలీ
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement