breaking news
Nambur
-
హజ్యాత్రికుల బృందాన్ని కలిసిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హజ్ యాత్రికుల బృందాన్ని కలిశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి హజ్యాత్ర బృందం బయల్దేరనుంది. దీనిలో భాగంగా నంబూరుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్.. యాత్రికులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలిసారిగా నంబూరు హజ్ క్యాంప్ నుంచి హజ్ యాత్రికలు బృందం బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం తరఫున హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రం గురించి ప్రార్ధన చేయమని కోరుతున్నానని, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాని సీఎం జగన్ తెలిపారు. హజ్ యాత్రలో మీకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. హజ్ యాత్రలో ఇబ్బంది తలెత్తకుండా కమిటీని పంపిస్తున్నామని, హజ్ యాత్రికులకు ఏ సమస్య వచ్చినా అంజద్ బాషా చూసుకుంటారన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే అంజద్ బాషాతో పాటు ఇతర అధికారులు మీకు అందుబాటులో ఉంటారని హజ్ యాత్రికులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు మైనార్టీల తరఫున సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే అంజద్ బాషా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు సీఎం జగన్ సంక్షేమ ఫథకాలు అందిచారన్నారు. మైనార్టీలకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలిచారన్నారు. ఆనాడు వైఎస్సార్, ఇప్పుడు సీఎం జగన్ మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు. గతంలో పోలిస్తే మైనార్టీలకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ అందాయని ఈ సందర్భంగా తెలియజేశారు. -
మీకోసం మీ ఎమ్మెల్యే
-
మహిళ దారుణ హత్య
గొంతుకోసి హతమార్చిన దుండగులు భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు నంబూరు(పెదకాకాని): గుర్తుతెలియని దుండగులు మహిళను దారుణంగా గొంతుకోసి పరారైన సంఘటన నంబూరులో చోటుచేసుకుంది. మండల పరిధిలోని నంబూరు విజయభాస్కర్నగర్కు చెందిన నంబూరు సురేష్తో గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడుపాలెం గ్రామానికి చెందిన జ్యోతికి వివాహం అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉంది. సురేష్ పొగాకు కంపెనీలో ముఠా కూలీగా పనిచేస్తుండగా జ్యోతి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం ప్రార్ధనకు వెళ్లిన జ్యోతి అనంతరం సుమారు మూడు గంటల సమయంలో దుస్తులు ఉతికేందుకు సమీపంలోని గుంటూరు చానల్ వద్దకు వచ్చింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆ సమయంలో దుస్తులు ఉతికేవారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాలువ దాటి వెళ్లిందని చెబుతున్నారు. కాలువ దాటి వెళ్లిన జ్యోతి(25) సోమవారం ఉదయం సమీపంలో ఉన్న ముళ్ళ పొదలలో కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెదకాకాని పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఎస్.సుబ్బరాయుడు, డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ సీహెచ్ చంద్రమౌళి, ఎస్ఐ కృష్ణయ్య చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్కా ్వడ్, క్లూస్ టీమ్లను రప్పించి తనిఖీలు చేశారు. భార్యాభర్తల మధ్య వివాదం కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిని గుర్తుతెలియని దుండగులు పదునైన కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన జ్యోతి ముళ్లపొదలలోకి ఎందుకు వెళ్లింది. ఎవరైనా పథకం ప్రకారం అక్కడికి పిలిపించారా, జ్యోతిని హత్య చేయడం వెనుక భర్త పాత్ర ఏమైనా ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు.