breaking news
Nalla Suryaparakash
-
‘ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా..’
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్కు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖికి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. -
జన హోరు
అట్టహాసంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సూర్యప్రకాష్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చిన ప్రజానీకం యువకుల బైక్ ర్యాలీ ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు ర్యాలీలో పాల్గొన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాజీపేట రూరల్ : వైఎస్సార్సీపీ వరంగల్ లోక్సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ ర్యాలీ బుధవారం జనసందోహం నడుమసాగింది. కాజీపేట ఫాతిమానగర్ వంతెన వద్ద ఉదయం వైఎస్సార్సీపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు వేలాది మంది ర్యాలీకి సిద్ధమయ్యూరు. అక్కడికి పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ చేరుకున్న అనంతరం జిల్లా, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో నల్లా సూర్యప్రకాష్తో పాటు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మేహ ందర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ గట్టు శ్రీకాంత్రెడ్డిలతో ప్రత్యేక రథంతో ర్యాలీ సాగింది. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కాజీపేట బ్రిడ్జి, ఫాతిమానగర్ జంక్షన్ల మీదుగా డప్పుచప్పుళ్లతో గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ర్యాలీ సాగింది. అభ్యర్థికి సంఘీభావంగా నగర యువత బైక్ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ సినీనటుడు విజయ్చందర్ తలకు కాషాయపు రంగు టవల్ కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు ఉత్సాహంచూపారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలు కూడా ర్యాలీలో తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రచార రథంపై తెలంగాణ, ైవె ఎస్సార్లపై వినిపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాజీపేట పోలీసులు కలెక్టరేట్ వరకు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవిందర్, జనరల్ సెక్రెటరీ గాదె నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భగవాన్ రెడ్డి, ఇరుగు సునిల్ కుమార్, గవాస్కర్రెడ్డి, మునిగాల విలియం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, పూజారీ సాంబయ్య, సంగాల ఈర్మియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్కుమార్ యాదవ్, జిల్లా నాయకులు మునిగాల కల్యాణ్రాజ్, అప్పం కిషన్, ఎర్రంరెడ్డి మహిపాల్ రెడ్డి, దుప్పటి ప్రకాష్, మంచె అశోక్, కౌటిల్రెడ్డి, అచ్చిరెడ్డి, గాందీ, నెమలిపురి రఘు, నాగపురి దయాకర్, రజనికాంత్, గౌని సాంబయ్య, ఆరెపెల్లి రాజు, దోపతి సుదర్శన్ రెడ్డి, ప్రతీక్రెడ్డి, బద్రుద్దీన్ఖాన్, బొడ్డు శ్రావన్, సంపత్, తిక్క శ్రీధర్, రవికుమార్, ఎం.అనిల్ లతో పాటు వర్థన్నపేట, పాలకుర్తి, పరకాల, హసన్పర్తి, నర్సంపేట తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి పాల్గొన్నారు.