-
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్స్టిట్యూట్ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్స్టిట్యూట్ ప్లేయర్కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్బాష్ లీగ్లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
నాలుగు రోజుల్లోనే మారిన కోచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్ను ఎంపిక చేసిన హెచ్సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్గా ఉన్న జాకీర్ హుస్సేన్ను కొత్త కోచ్గా ప్రకటించింది. టీమ్ను ఎంపిక చేసే క్రమంలో హెచ్సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి. అనిరుధ్ కోచ్గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్లో కూడా అండర్–19 కోచ్గా వ్యవహరించిన అనిరుధ్ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్గా మళ్లీ తన్మయ్ అగర్వాల్నే హెచ్సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది. జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్దేవ్ గౌడ్, యుధ్వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్ఆర్ చరణ్. -
దిగ్గజ క్రికెటర్ను అవమానపరుస్తారా?
న్యూఢిల్లీ: ఐపీఎల్ను మరో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలా మార్చలేమన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డారు. మొదట షెడ్యూల్ ప్రకారం ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ను జరుపుదామని బీసీసీఐ ప్రయత్నించినా, విదేశీ ఆటగాళ్లుంటేనే బావుంటుందనే ఆలోచనతో లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ప్రస్తావన తెచ్చారు. ‘ఐపీఎల్ను.. తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమని చెబుతూ, మరో ముస్తాక్ అలీ టోర్నీ అవసరం లేదన్న ఆ అధికారి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. ఎందుకంటే వారు ఓ దిగ్గజాన్ని అవమానపరిచారు. ఆ తర్వాత దాన్ని పేలవ టోర్నీగా పేర్కొన్నారు. మరి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నారు.(ధోని భవితవ్యంపై గావస్కర్ స్పందన..) ముందు ఆ టోర్నీ పేరు చెప్పి ఓ గ్రేట్ మ్యాన్ను అగౌరవపరిచారు. ఆ తర్వాత పేలవమైన టోర్నమెంట్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ టోర్నీ ఎందుకు పేలవంగా మారింది. ఆ టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండరు అనే విషయం తెలుసుకదా. అది దేశవాళీ టోర్నీ. అంతర్జాతీయి స్థాయిలో ఆడే భారత ఆటగాళ్లు లేకపోవడం వల్లే అది పేలవంగా మారిపోయింది. బీసీసీఐ బిజీ షెడ్యూల్ కారణంగా ముస్తాక్ అలీ టోర్నీకి ఆదరణ తగ్గింది. దీనిపై బీసీసీఐ కచ్చితంగా దృష్టి సారించాలి. ఆ టోర్నీని మెరుగుపరిచే అంశంపై ఫోకస్ చేయాలి’ అని గావస్కర్ పేర్కొన్నారు. -
4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్ మెరుపులు
తిరువనంతపురం: ఆదివారం అంతర్జాతీయ టి20లో హ్యాట్రిక్... మంగళవారం మూడు బంతుల్లో (వైడ్ను మినహాయించి) మూడు వికెట్లు... ఇప్పుడు గురువారం మళ్లీ అదే తరహా ప్రదర్శన! పేసర్ దీపక్ చాహర్ జోరు కొనసాగుతూనే ఉంది. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన చాహర్ నాలుగు బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో మొదటి, మూడో, నాలుగో బంతులకు చాహర్కు ఈ 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో రాజస్తాన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూపీ 9 వికెట్లకు 164 పరుగులు చేయగా, రాజస్తాన్ 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. -
చాంపియన్ కర్ణాటక
ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు ఫైనల్ దాకా అజేయమైన ఫలితాల్ని సాధించాయి. చివరకు ఫైనల్ ముగిసేదాకా అజేయంగా నిలిచింది మాత్రం కర్ణాటక. సమవుజ్జీల మధ్య జరిగిన అంతిమ సమరంలో కర్ణాటక జయభేరి మోగించి టి20 జాతీయ చాంపియ గా నిలిచింది. ఇండోర్: మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 85 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో కర్ణాటకకు ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషాద్ షేక్ (41 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. కర్ణాటక బౌలర్ మిథున్(2/24) మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తర్వాత కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. రోహ కదమ్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. మయాంక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన నౌషాద్ టాస్ నెగ్గిన కర్ణాటక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్రకు రాహుల్ త్రిపాఠి (30; 3 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (12) ఓ మోస్తరు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరితో పాటు విజయ్ జోల్ (8) కూడా ఔట్ కావడంతో మహారాష్ట్ర రన్రేట్ 10 ఓవర్లదాకా ఆరు పరుగులను మించలేకపోయింది. నౌషద్ షేక్ ధాటిగా ఆడటంతో ఆ తర్వాత మహారాష్ట్ర స్కోరులో వేగం పుంజుకుంది. అతను అంకిత్ బావ్నే (29; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 81 పరుగులు జోడించాడు. చివరిదాకా క్రీజులో ఉండి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. కరియప్ప, సుచిత్ చెరో వికెట్ తీశారు. నడిపించిన రోహ , మయాంక్ అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కర్ణాటక 14 పరుగుల వద్దే ఓపెనర్ శరత్ (2) వికెట్ను కోల్పోయింది. కానీ మరో వికెట్ కోల్పోయేలోగానే మ్యాచ్ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్ రోహన్ కదమ్కు జతయిన మయాంక్ కర్ణాటకను వేగంగా నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్కు 92 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్ను ఈ జోడీ తేలిగ్గా ఆడేసింది. దీంతో ఓవర్కు సగటున 8 పరుగులు సాధిస్తూ లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో మొదట రోహన్, ఆ తర్వాత మయాంక్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహన్ నిష్క్రమణ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (8 నాటౌట్) అండతో మయాంక్ చెలరేగాడు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే కర్ణాటక విజయాన్ని అందుకుంది. సమద్ ఫలా, దివ్యాంగ్ చెరో వికెట్ తీశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement