breaking news
Munsiff Magistrate
-
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదు
-
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదు
సాక్షి, కరీంనగర్: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ జడ్డి ఆదేశించారు. కాగా హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్రెడ్డి ప్రవీణ్కుమార్పై ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఐపీఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదుకు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. మంగళవారం ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్కు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. -
న్యాయవాదులపై పోలీసుల దాడి !
శృంగవరపుకోట, న్యూస్లైన్ :మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జరిగిన మెగా లోక్అదాలత్లో తమపై పోలీసులు దాడి చేసినట్లు న్యాయవాదులు ఆరోపిస్తూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోర్టు ఆవరణలో న్యాయమూర్తి వి. నరేష్ ఆధ్వర్యంలో మెగా లోక్అదాలత్ నిర్వహించారు. దీనికి ఎస్.కోట, వేపాడ, జామి, లక్కవరపుకోట మండ లాలకు చెందిన కక్షిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేసులు రాజీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గలాటా జరగడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. న్యాయవాది మామిడి చంద్రశేఖర్పై ఎస్.కోట ఎస్సై సంతోష్కుమార్, కానిస్టేబుల్ విజయ్ దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని బార్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కామేశ్వరరావు, జి.ప్రకాష్, ఇతర న్యాయవాదులు ఆరోపించారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తి నరేష్కు ప్రత్యేక పిటీషన్ ఇచ్చారు. అనంతరం విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది చంద్రశేఖర్ మాట్లాడుతూ, మనోవర్తి కేసుకు సంబంధించి చర్చలు జరుగుతుండగా ఎస్సై సంతోష్కుమార్, కానిస్టేబుల్ విజయ్ తనపై ఒక్కసారిగా దాడి చేశారన్నారు. దళితుడినైనా తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. ఈ విషయమై ఎస్సై సంతోష్కుమార్ మాట్లాడుతూ, విచారణ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు న్యాయమూర్తి సమక్షంలో గొడవ పడ్డారని, వారిని విడిపించి చెరోవైపు కూర్చోబెట్టాం తప్ప ఎవ్వరినీ కొట్టలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఐ బుచ్చిరాజును వివరణ కోరగా కోర్టులో జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. తమ సిబ్బంది అతిగా ప్రవర్తించినా, తప్పు చేసినట్లు రుజువైనా చర్యలు తప్పవన్నారు. దాడి అమానుషం న్యాయవాది మామిడి చంద్రశేఖర్ పోలీసులు దాడి చేయడం అమానుషమని వైఎస్సార్సీపీ నాయకుడు కుంభా రవిబాబు అన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రఘురాజుతో కలిసి న్యాయవాదిని పరామర్శించారు. సీఐ బుచ్చిరాజుతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఐని కోరారు.