breaking news
Mumbai - Ahmedabad
-
హైవేపై ట్రాఫిక్ జామ్.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, దాదాపు 500 మంది విద్యార్థులు హైవేపై ట్రాఫిక్లో చిక్కుకుని అల్లాడిపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుమజాము వరకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో, 5-10 తరగతులు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. థానే, ముంబై వైపు నుంచి వస్తున్న వాహనాల రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు.I challenge the gov. of Maharashtra Ministers to make a travel from Bhiwandi to Wada. The Mumbai Ahmedabad highway for all the reasons is always with hours of traffic snarls. Should even Industries function in Maharashtra any more? @AjitPawarSpeaks @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/xSyeAoarJi— Vedang Dongre (@VedangDongre) October 14, 2025మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థులంతా ట్రాఫిక్లోనే ఉన్నారు. దీంతో, స్థానికులు వారికి ఆహారం అందించారు. చాలా మందికి ఆహారం, నీరు అందకపోవడంతో ఆవేదన చెందారు. విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుమీదే ఉన్నారు. ఈ కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థుల చివరి బస్సు బుధవారం ఉదయం బయటకు వచ్చినట్టు పిల్లల పేరెంట్ ఒకరు చెప్పుకొచ్చారు.वसई, मुंबई: मुंबई-अहमदाबाद महामार्ग पर, घोड़बंदर से लेकर वसई फाटा तक, आज भारी ट्रैफिक जाम की स्थिति देखी गई। मार्ग पर वाहनों की लंबी कतारें लगी हुई हैं, जिससे यात्रियों को भारी असुविधा का सामना करना पड़ रहा है। pic.twitter.com/a0mRI6VxFr— मुकेश त्रिपाठी- Mukesh Tripathi/✍️ (@mukesht37) October 13, 2025వాహనాల రద్దీ కారణంగా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. భారీ వాహనాలను మళ్లించడం వల్ల ఈ జామ్ ఏర్పడిందని.. దీని ఫలితంగా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో అధిక ట్రాఫిక్ భారం ఏర్పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. NH46, NH30, NH19, NH49...Every day you wake up, a new NH is in the news for construction quality issues, and that too usually within months of being built. Shri @nitin_gadkari, please give petrol a break from ethanol and sort out your dept first. pic.twitter.com/hvZMGHM4sy— THE SKIN DOCTOR (@theskindoctor13) October 14, 2025 -
దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..!
దేశంలోని ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నిర్మిస్తున్న సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను రైల్వే, జౌళి శాఖ మంత్రి దర్శన జార్దోష్ తన ట్విటర్ ఖాతా వేదికగా షేర్ చేశారు. జార్దోష్ ట్విటర్ పోస్టులో ఇలా పేర్కొన్నారు.. "సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నాను. అత్యాధునిక పరిజ్ఞానంతో బహుళ-అంతస్థులలో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని - సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని" ఆమె తెలిపారు. సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు చెందిన బయట, లోపలికి సంబంధించిన రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహ మరోక చిత్రంలో స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2023 డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. కానీ, మహారాష్ట్రలో భూ సేకరణలో జాప్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల మార్చి 2020లో ప్రకటించిన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా గడువును 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63 శాతం, దాద్రా అండ్ నగర్ హవేలీలో 100 శాతం, మహారాష్ట్రలో 60.2 శాతం భూ సేకరణ జరిగింది. Sharing with you all, 1st glimpse of graphical representation of Surat's Bullet Train station. The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond - the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z — Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022 నిర్మాణంలో ఉన్న ఈ 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. ఈ మొత్తం ప్రాజెక్టు పొడవులో 348 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో, 4 కిలోమీటర్లు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హావేలీలో, మిగిలిన 156 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్ నుంచి రుణంగా అందనుంది. 2026లో సూరత్ - బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి బుల్లెట్ రైలు ట్రయల్ రన్ జరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్నావ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పారు. (చదవండి: మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!) -
పేలిన గ్యాస్ ట్యాంకర్ 8మంది సజీవ దహనం
సాక్షి, ముంబై: ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్తో నిండిన ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయి. అనంతరం ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అనేకమంది ఉలిక్కిపడ్డారు. దీని నుంచి తేరుకునేలోపే అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్తోపాటు పలువురికి గాయాలయ్యాయి.