-
దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..!
దేశంలోని ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నిర్మిస్తున్న సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను రైల్వే, జౌళి శాఖ మంత్రి దర్శన జార్దోష్ తన ట్విటర్ ఖాతా వేదికగా షేర్ చేశారు. జార్దోష్ ట్విటర్ పోస్టులో ఇలా పేర్కొన్నారు.. "సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నాను. అత్యాధునిక పరిజ్ఞానంతో బహుళ-అంతస్థులలో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని - సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని" ఆమె తెలిపారు. సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు చెందిన బయట, లోపలికి సంబంధించిన రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహ మరోక చిత్రంలో స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2023 డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. కానీ, మహారాష్ట్రలో భూ సేకరణలో జాప్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల మార్చి 2020లో ప్రకటించిన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా గడువును 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63 శాతం, దాద్రా అండ్ నగర్ హవేలీలో 100 శాతం, మహారాష్ట్రలో 60.2 శాతం భూ సేకరణ జరిగింది. Sharing with you all, 1st glimpse of graphical representation of Surat's Bullet Train station. The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond - the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z — Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022 నిర్మాణంలో ఉన్న ఈ 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. ఈ మొత్తం ప్రాజెక్టు పొడవులో 348 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో, 4 కిలోమీటర్లు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హావేలీలో, మిగిలిన 156 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్ నుంచి రుణంగా అందనుంది. 2026లో సూరత్ - బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి బుల్లెట్ రైలు ట్రయల్ రన్ జరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్నావ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పారు. (చదవండి: మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!) -
పేలిన గ్యాస్ ట్యాంకర్ 8మంది సజీవ దహనం
సాక్షి, ముంబై: ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్తో నిండిన ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయి. అనంతరం ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అనేకమంది ఉలిక్కిపడ్డారు. దీని నుంచి తేరుకునేలోపే అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్తోపాటు పలువురికి గాయాలయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement