-
మట్టి ఇళ్లను.. ప్రింట్ చేసుకుందాం..
మట్టి గోడలు.. చౌడు మిద్దెలు.. పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించని ఒకప్పటి ఇళ్లు. మిద్దె తయారీలో దూలాలు, కలప తప్ప ఏమాత్రం ప్రకృతి హానికారకాలు లేని నిర్మాణాలవి. మళ్లీ అవే ఇళ్లు మనకు భవిష్యత్ చూపబోతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి, మట్టి ఇళ్లను ‘ప్రింట్’ చేసుకునే సరికొత్త అవకాశం వచ్చేస్తోంది. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వందల ఏళ్ల కిందట కేవలం మట్టితో ఇళ్లు కట్టుకునేవారు. పునాదుల కోసమో, మరో అవసరానికో రాళ్లు వాడేవారు. ఆధారం కోసం దూలాలను, పైకప్పు కోసం కలపను వాడేవారు. స్థానికంగా దొరికే మట్టికి సున్నపురాయి కలిపి, ఒకరోజు ముందు నానబోసి, ఎద్దులతో తొక్కించి.. ముద్దలుగా పేర్చుతూ గోడలు కట్టేవారు. ప్రకృతికి ఏమాత్రం హాని చేయని నిర్మాణాలు అవి. ఇప్పుడదే తరహాలో ఆధునిక మట్టి ఇళ్లు కట్టుకునే అవకాశాన్ని ఇటలీ ఆర్కిటెక్ట్, విద్యావేత్త మారియో క్యూసినెల్లా అందుబాటులోకి తెచ్చారు. శతాబ్దాల కిందటి ఎడారి నాగరికతల నాటి ఇళ్లను తలపించేలా.. గుండ్రని ఆకృతిలో వీటి మోడల్ను రూపొందించారు. పూర్తిగా ఆధునికమైన త్రీడీ ప్రింటింగ్ విధానంలో ఇటీవలే ఇటలీలో ఈ మోడల్ ఇళ్లను నిర్మించారు. దగ్గర్లో దొరికిన మట్టితోనే.. మారియో డిజైన్ చేసిన త్రీడీ ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా దొరికిన మట్టి, ఇతర వనరులనే వాడారు. అదనంగా ఉపయోగించింది తలుపులు, కుర్చీలు వంటివే. ఈ ఇళ్లలో లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూం వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. ‘‘ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి ఇళ్లు కోల్పోయినవారు నివాసం ఉండటానికి ప్రస్తుతం వేగంగా కల్పించగల ప్రత్యామ్నాయం ఇదే. ప్రకృతి విపత్తులు సంభవించిన చోటుకి ఈ త్రీడీ ప్రింటర్ను పంపిస్తే చాలు.. మట్టి తవ్వడం నుంచి పూర్తి నివాసయోగ్యమైన ఇల్లు కట్టడం దాకా పూర్తవుతుంది. భవిష్యత్తులో ఈ మట్టి ఇళ్లే కీలకంగా మారనున్నాయి’’ అని మరియో చెప్తున్నారు. త్రీడీ ప్రింటింగ్తోనే ఫర్నిచర్ కూడా.. మట్టి, సాంకేతిక మేళవించిన ఈ ఇళ్లకు మారియో.. ‘టెక్లా’ పేర్లు పెట్టారు. కందిరీగ ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా గమనించారా? బురదమట్టిని పోతపోసి ఉబ్బెత్తుగా నిర్మాణం చేసుకొని అందులోకి వెళ్తుంది. గుడ్లు పెట్టి పిల్లలైన తరువాత బయటికొస్తాయి. ఆ మట్టి నిర్మాణాలు గట్టిగా ఉంటాయి. వేరే కీటకాలూ వాటిని వినియోగించుకుంటాయి. అచ్చం అలాగే.. పొరలు పొరలుగా రెండు వృత్తాలు కలిసి ఉండే ఆకారంలో ఉబ్బెత్తుగా ఇళ్లను నిర్మిస్తారు. సెంట్రింగ్ పనిముట్లు అవసరం లేకుండానే.. 200 గంటల్లో 645 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని నిర్మించవచ్చని మరియో తెలిపారు. చుట్టూ గోడలు, లోపలి గోడలతోపాటు గోడకు ఆనుకుని ఉండే టేబుల్ వంటి నిర్మాణాలూ త్రీడీ ప్రింటర్తోనే రెడీ అయిపోతాయన్నారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ‘కాప్ 26 క్లైమెట్ చేంజ్’ సదస్సులో కర్బన ఉద్గారాలు లేని ప్రాజెక్టుగా ‘టెక్లా’ ఎంపికవడం గమనార్హం. విపత్తులను తట్టుకునేలా నిర్మాణం ఈ మట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఉద్గారాలు లేని యూరప్ను నిర్మించడమే తన లక్ష్యమని మారియో చెప్పారు. మట్టి ఇల్లు కదా.. వానలు, వరదలను తట్టుకుంటుందా అన్న ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా.. వానలు, వరదలు, భూకంపాలను తట్టుకునేలా త్రీడీ ప్రింటింగ్లో డిజైన్ చేశామన్నారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
‘మమ్మల్ని బురదలో బొంద పెట్టండి మేడమ్’
సాక్షి, రామగుండం(కరీంనగర్): ‘మాకు పునరావాసమైనా కల్పించండి లేకుంటే.. ఓబీ మట్టి కుప్పల బురదలో మమ్మల్ని బొందపెట్టండి..’ అంటూ అంతర్గాం మండల పరిధి లోని మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రభావిత గ్రామమైన లింగాపూర్ ఎస్సీ కాలనీవాసులు కలెక్టర్ సంగీత ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాలనీకి సమీపంలో ఉన్న ఓ బీ కుప్పలతో భయంభయంగా కాలం వెల్లదీస్తున్నామని, ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు బురద నీరంతా కాలనీని చుట్టుముడుతోందని, అక్కడ జీవనం సాగించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం తమ కాలనీని సందర్శించి త్రీమెన్ కమిటీతో అందించే పరిహారం, సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించేందుకు కొంతపరిహారం అందించినా.. పూర్తిస్థాయిలో చేయలేదని పేర్కొన్నారు. ఓపెన్కాస్టు జీవితకాలం పూర్తవడంతో తమకు పరిహారం చెల్లించకుండానే ముఖం చాటేసే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. పదకొండేళ్లుగా బురదతో కాలం వెల్లదీస్తున్నామ ని తెలిపారు. తమకు సింగరేణి ఇచ్చిన హామీ ప్రకా రం పునరావాస ప్యాకేజీ, నివేశన స్థలాలు పంపిణీ చే సి ఆదుకోవాలని లింగాపూర్ మాజీ సర్పంచ్ ఇరికిళ్ల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ, కాలనీవాసులు కోరారు. -
రాజమండ్రిలో అగ్నిప్రమాదం
రాజమండ్రి క్రైం: రాజమండ్రి లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన రాజమండ్రిలోని ఆశోక థియేటర్ వెనక భాగంలో ఉన్న పూరింట్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసెకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున ఎగిసి పడటంతో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
Advertisement