breaking news
mrityunjaya
-
చలి తీవ్రత ఎక్కువే
న్యూఢిల్లీ: డిసెంబర్ 2025– 2026 ఫిబ్రవరి వరకు మూడు నెలల సీజన్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. మధ్య భారత, వాయవ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా, పంజాబ్తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి నాలుగైదు రోజులపాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలుంటాయని పేర్కొన్నారు. నవంబర్8–18వ తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయవ్య ప్రాంతాల్లో శీతలగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు. -
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
-
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రి క్వార్టర్స్లో నిర్వహించిన హోమం సందర్భంగా పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. చదవండి: విద్యార్ధులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెంపు -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
బెంగళూరులో మృత్యుంజయ కార్టూన్ ప్రదర్శన
-
'హోంమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారు'
హైదరాబాద్: పొన్నాల లక్ష్మయ్య అనినీతిని బయటపెడతామంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయ విమర్శించారు. కలలను అమ్ముకుంటూ కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ను సింగపూర్, లండన్ చేస్తామంటూ సాధ్యంకాని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభం వల్లే 50 శాతం ఖరీఫ్ పంట నాశనమైందన్నారు. 200 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


