శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. ‘సామజవరగమన’ (2023) వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ద్వితీయ సినిమా ఇది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్గా రెబా మోనికా జాన్ నటించారు. శనివారం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ‘మృత్యుంజయ్’లో రెబా మోనికా జాన్ తనదైన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


