breaking news
Motor vehicles
-
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం పెచ్చుమీరుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆరీ్టఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగి్నప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు.ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబంధించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతోపాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దురి్వనియోగం చేస్తున్నారు.వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్లకు 10 వాట్స్లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. కొద్ది కాలం క్రితం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్ల వినియోగం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒక్కోసారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.అడ్డగోలుగా అమ్మకాలు..మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీస చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా హెవీ ఫోకస్ ఉన్న ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలను సీజ్ చేస్తాం. అధిక వెలుగు వచ్చే లైట్లు వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. కంపెనీలు అమర్చిన లైట్లు మినహా ఏ ఒక్కరూ విడిగా ఎల్ఈడీ లైట్లు పెట్టుకోకూడదు. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –ఎం. రమేష్ (గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ) -
విభిన్న ప్రతిభావంతులకు 1,750 మోటార్ వాహనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం 1,750 మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా (పూర్తి సబ్సిడీతో) అందించనుంది. అసెంబ్లీ నియోజకవర్గానికి పది చొప్పున వాహనాలను కేటాయించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల రోజైన డిసెంబర్ 3న వీటి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనలను సరళతరం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రెండు విడతలుగా 1,532 వాహనాలను మాత్రమే పంపిణీ చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకే విడతలో అంతకు మించిన సంఖ్యలో వాహనాలను అందిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం 80 శాతం వైకల్యం ఉంటేనే వాహనాన్ని ఇవ్వగా, జగన్ ప్రభుత్వం దానిని 70 శాతానికి తగ్గించింది. వయోపరిమితిలో కూడా సడలింపులు ఇచ్చారు. తద్వారా మరింతమందికి లబ్ధి చేకూరనుంది. వాహనాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు 5,743 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయడానికి జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను నియమించారు. ఈ కమిటీలో విభిన్న ప్రతిభావంతుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసర్, ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ, రవాణా శాఖల జిల్లా అధికారులు, ఎముకల వైద్య నిపుణులు (సర్జన్), ఇతర అధికారులు ఉంటారు. ఇవీ నిబంధనలు ► వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి ► లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉండాలి ► గతంలో ఎప్పుడూ ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు ► గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనాలు మంజూరుకాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు ► జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, వృత్తిదారులు అయితే ఎస్ఎస్సీ ధ్రువపత్రం, విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ విద్యార్హతల పత్రాలు ఉండాలి ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజులో పూర్తి ఫొటో ► వీటన్నిటిని ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు అప్లోడ్ చేయాలి. వైకల్యం శాతం తగ్గింపు.. వయోపరిమితి పెంపు ► ఎంఏ కుమార్ రాజా, ఎండీ, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల సహాయ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నారు. వైకల్యం శాతం తగ్గింపు, వయో పరిమితి పెంపు వంటి అవకాశాలతో విభిన్న ప్రతిభావంతులకు మేలు చేయడంలో సీఎం జగన్ పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. గతంలో 80 శాతం పైగా వైకల్యం ఉన్నవారే అర్హులు కాగా, ఇప్పుడు 70 శాతానికి తగ్గించాం. గతంలో 18 నుంచి 40 ఏళ్ల వయో పరిమితి నిబంధన ఉంటే ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులుగా అవకాశం ఇచ్చారు. అర్హులకు ఒక్కొక్కరికి సుమారు రూ.92 వేల ఖరీదైన మోటారు వాహనం ఉచితంగా అందిస్తాం. -
వాహన పత్రాల చెల్లుబాటు పొడిగింపు..
సాక్షి, న్యూఢిల్లీ: వాహనాల ఫిట్ నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తో సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్గడ్కరీ ప్రకటించారు. కరోనా విజృంభిస్తుండటం, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఫ్రిబ్రవరి 2020తో పత్రాల చెల్లుబాటు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవడానికి జూన్ వరకు మొదట గడువునిచ్చిన కేంద్రప్రభుత్వం జూన్ నాటికి దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పౌరులకు ఇబ్బంది కలిగించకూడదే ఉద్దేశంతో వాహన పత్రాల చెల్లుబాటు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం అందించింది. (వైరస్ బారిన ఒకే కుటుంబంలో 26 మంది) -
నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పదు జరిమానా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : మోటారు వాహనాలతో రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాటిని తనిఖీ కోసం ఆపే అధికారం రవాణా శాఖ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఆ సమయంలో ఆ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ సక్రమంగా ఉండి, వాహన చోదకుడు కూడా సరైన స్థితిలో ఉంటే ఎటువంటి జరిమానా చెల్లించనక్కరలేకుండా హాయిగా వెళ్లవచ్చు. ఒకవేళ వాహనంలో అవసరమైన పత్రాలు లేకపోతే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే కొన్నిసార్లు తమవద్ద అన్నీ ఉన్నా జరిమానా వేశారంటూ వాహనచోదకులు లబోదిబోమంటూంటారు. సాధారణంగా వివిధ పత్రాలు లేనందుకు, నిబంధనలు ఉల్లంఘించినందుకు కిందివిధంగా జరిమానా విధిస్తూంటారు. అంతకన్నా అధికంగా వసూలు చేస్తే సదరు అధికారులను ప్రశ్నించవచ్చు. * మోటారు వాహనాల చట్టం సెక్షన్ 181 ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి లెసైన్స్ లేకుంటే రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే సెక్షన్ 180 ప్రకారం వాహనం ఇచ్చినందునకు యజమానికి రూ.1000, వాహనం నడపడం రాని కారణంగా సెక్షన్ 184 కింద రూ.1000 మొత్తం రూ.2500 జరిమానా విధించవచ్చు. * సెక్షన్ 184 ప్రకారం ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు. * రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే రూ.1000, వాహనం ఇరువైపులా వస్తువులు తీసుకెళ్తే రూ.1000, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000 జరిమానా తప్పదు. * సెక్షన్ 190 (2) ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.100, నిషేధ ప్రాంతంలో వాహనం పార్కింగ్ చేస్తే రూ.100, ప్రమాదకరంగా వాహనం పార్కింగ్ చేస్తే రూ.100 జరిమానా విధిస్తారు. * సెక్షన్ 192 ప్రకారం వాహనం రిజిస్ట్రేషన్ చేయించకుంటే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ జరిమానా తప్పదు. * సెక్షన్ 196 ప్రకారం వాహనానికి ఇన్సూరెన్స్ చేయించకుంటే రూ.1000 ఫైన్ వేస్తారు. * సెక్షన్ 177 (4) ప్రకారం ట్యాక్సీ, ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు. * సెక్షన్ 177 (6) ప్రకారం ఆటోలో పరిమితికి మించి {పయాణికులను ఎక్కించుకుంటే రూ.ఒక్కొక్కరికి రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. * సెక్షన్ 177 (7) ప్రకారం గూడ్స్ క్యారియర్ డ్రైవర్ యూనిఫాం వేసుకోకుంటే రూ.100 నుంచి రూ.200 ఫైన్ విధిస్తారు. * సెక్షన్ 177 (9) ప్రకారం నంబర్ ప్లేట్ లేకపోయినా, దానిపై ఎటుంటి గుర్తులు ఉన్నా రూ.100 నుంచి రూ.200 జరిమానా వేస్తారు. * సెక్షన్ 177 (19) ప్రకారం హెల్మెట్ ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ, సెక్షన్ 177 (20) సీట్బెల్ట్ ధరించకుంటే రూ.100 ఫైన్ చెల్లించాలి. * సెక్షన్ 177 (21) ప్రకారం ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళితే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు. * సెక్షన్ 179 (1) ప్రకారం తనిఖీ సమయంలో అధికారులకు ఆటకం కల్పిస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. * సెక్షన్ 185 (ఎ) ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే చార్జ్షీట్ రాసి కోర్టుకు పంపుతారు.