mothilal naik
-
తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన పుంగనూరు జడ్జి
ఎన్పీకుంట (కదిరి) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానును పుంగనూరు జడ్జి మోతీలాల్నాయక్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ముందుగా అమ్మవారిని సందర్శించుకొని, ఆతర్వాత అమ్మవారి ఘాట్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. చెట్టు వద్ద కూర్చొని అమ్మవారి చరిత్ర, మర్రిమాను ప్రత్యేకతను గైడ్ అనిల్తో తెలుసుకున్నారు. ఏఎస్ఐ దేవీశ్రీ రమణ, కానిస్టేబుల్ విజయ్నాయక్ తదితరులు ఉన్నారు. -
దాడిలో యువకుడు మృతి
ధర్మవరం రూరల్ : కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. బంధువులు, పోలీసుల సమాచారం మేరకు.. ఉరవకొండ మండలం వెంకటంపల్లి తండాకు చెందిన లక్ష్మిబాయ్కి ధర్మవరం మండలం నిమ్మలకుంటకుS చెందిన రమేష్నాయక్తో వివాహమైంది. అయితే కుటుంబ కలహాలతో కొద్ది రోజుల క్రితం దంపతులు విడిపోయారు. ఈ నేపధ్యంలో మంజులాబాయ్ చిన్నాన్న తపాల్నాయక్ దంపతులను కలపాలనే ఉద్దేశ్యంతో బుధవారం నిమ్మలకుంటకు వచ్చి రమేష్నాయక్తో మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవకు దారికి తీసింది. ఈ క్రమంలో రమేష్నాయక్ సోదరుడు మోతిలాల్నాయక్(24)పై తపాల్ నాయక్ పక్కనే ఉన్న ఇస్త్రీపెట్టెతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన మోతిలాల్నాయక్ను వెంటనే ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం అటు నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.