breaking news
Mote
-
వాళ్లకు కిరాయి మనుషులే దిక్కు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ వాళ్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నరు, కానీ ఊరోళ్లు వంద మంది ఉంటలేరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పరాయి నాయకులు, కిరాయి మనుషులే వారికి దిక్కని విమర్శించారు. మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు.. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలుగా అభివర్ణించారు. వాళ్లు సీసాలను, పైసలను, అబద్ధాలను నమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చేదని మంత్రి విమర్శలు గుప్పించారు. వారి మాటలకు మోసపోతే గోసపడతమని జనాలను హెచ్చరించారు. టీఆర్ఎస్.. చేసేది చెబుతుందని, చెప్పిందే చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దీనికోసం అసెంబ్లీ ఆమోదం కూడా ఇదివరకే తీసుకున్నామని స్పష్టం చేశారు. నిజానికి రుణమాఫీ ఇదివరకే బ్యాంకుల్లో జమ అయ్యేవన్నారు. ఈసారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. (బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలి ) -
ముడుపు విప్పి, మొక్కు తీర్చుకున్న కేసీఆర్
నిజామాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముడుపు విప్పి, పద్నాలుగేళ్ల నాటి మొక్కు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోతెలో 2001లో ఆయన మట్టిని ముడుపు కట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చాకే ఆ మట్టిని ముడుపు విప్పుతానని కేసీఆర్ గతంలో ప్రతిజ్ఞ చేశారు. కృతజ్ఞతతో తెలంగాణ సాధిస్తామని ఆయన అప్పట్లో ముడుపు కట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ శుక్రవారం మాట్లాడుతూ తాను బతికున్నంత వరకూ మోతెనే తన స్వగ్రామం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మోతె గ్రామం నుంచే శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు లక్ష వరకూ రుణమాఫీ చేయటంతో పాటు, మోతెలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్ బాధితుల్ని ఆదుకుంటామన్నారు. కాగా తెలంగాణా సాధించామని సంతోషపడితే సరికాదని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.