breaking news
moon wallk
-
ఎలన్ మస్క్ మరో సంచలనం, అంతరిక్షంపై నడక కోసం!
ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ మరో సంచలనానికి తెరతీయనుంది. నలుగురు వ్యక్తులు సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు మే నెలలో స్పేస్ ఎక్స్ ట్రైనింగ్ను ప్రారంభించనుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఆ నలుగురు సిబ్బంది అంతరిక్షంపై కాలు మోపనున్నారు. ఇప్పటివరకు భూమి నుంచి 853 మైళ్ల ఎత్తులో భూ కక్ష్యను చేరిన రికార్డ్ ఉంది. అయితే ఇప్పుడు 'ఇన్స్పిరేషన్4'..ఎలన్ మస్క్ తన స్పేస్ఎక్స్ అంతరిక్షయానానికి పెట్టిన పేరు. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్4 ద్వారా షిఫ్ట్4 పేమెంట్స్ అధినేత, బిలియనీర్ జేర్డ్ ఐసాక్మాన్ నేతృత్వంలోని పొలారిస్ డాన్ మిషన్ ద్వారా ఇప్పుడా ఆ రికార్డ్ను అధిగమించి 870 మైళ్ల గరిష్ట ఎత్తుకు చేరుకోవాలనే లక్ష్యంతో స్పేస్ఎక్స్ తన ట్రైనింగ్ను ప్రారంభించనుంది. Thanks @PanAquaDiving and instructors Peter and Sean... Im feeling up to speed on SCUBA again and ready to rejoin w/ @PolarisProgram crew next week for training. — Jared Isaacman (@rookisaacman) May 13, 2022 అన్నీ అనుకున్నట్లు జరిగితే, 1972లో చివరిగా చంద్రుడు దిగినప్పటి నుండి మళ్లీ ఇప్పుడు మానవులు భూమి నుండి అంతరిక్షానికి ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డ్ నెలకొల్పనుంది. వచ్చే వారం నుంచే ట్రైనింగ్ ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పొలారిస్ డాన్ మిషన్ లో పాల్గొనేందుకు క్రూ సిబ్బంది సిద్ధమవుతుందని ఐసాక్మాన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆస్ట్రోనాట్స్ మిషన్లో స్పేస్ ఎక్స్ బిజీ బిజీ 2020 నుంచి స్పేస్ఎక్స్ సంస్థ భూమి మీద నుంచి 408 కిలోమీట్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ నాసాకు ఆస్ట్రోనాట్స్ను పంపిస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్లో క్రూ-3కి చెందిన ఆస్ట్రోనాట్స్లు రాజా చారి, థామస్ మార్ష్బర్న్, కైలా బారన్, మాథియాస్ మౌరర్'లను స్పేస్ ఎక్స్ సంస్థ నాసాకు పంపించింది. మళ్లీ 6నెలల త్వరాత ఆ క్రూ-3 సిబ్బంది మే6 (శుక్రవారం ఉదయం)న అమెరికాలోని సముద్ర ప్రాంతమైన ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. ఐసాక్ మాన్ ఇంటర్వ్యూ స్పేస్ ఫ్లైట్ నౌ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఐసాక్మాన్ స్పేస్వాక్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రస్తుతం కూ-3, ప్రైవేట్ ఏఎక్స్-1 లాంచింగ్, లాంచ్ క్రూ-4తో బిజిగా ఉంది. త్వరలో స్పేస్ వాక్ కోసం ట్రైనింగ్ తీసుకోబోతున్నాం' అని వెల్లడించారు. రీయూజబుల్ రాకెట్లతో రీయూజబుల్ రాకెట్లతో (పునర్వినియోగ రాకెట్) పోరాలిస్ ప్రోగ్రామ్ సిరీస్ లాంచ్ కానున్నాయని, దానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు ఐసాక్మాన్ తెలిపారు. అంతేకాదు ఐజాక్మాన్ రీయూజబుల్ రాకెట్లతో స్టార్షిప్లో మొదటి స్పేస్ వాక్ మూడవ పొలారిస్ ప్రోగ్రామ్ లాంచ్ కోసం స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. చదవండి👉చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
అదొక అద్భుత ఘట్టం.. లైవ్లో చూపించినా నమ్మరెందుకు?
చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్ లునార్ మాడ్యుల్’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా? సాక్షి, వెబ్డెస్క్: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, లునార్ మాడ్యూల్ పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉద్వేగభరిత క్షణాలవి.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్ మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. #50thAnniversary 🌚👨🏼🚀👨🏼🚀👨🏼🚀 "That's one small step for man, one giant leap for mankind." ... and #Jump Happy #MoonDay 🌚 &#WorldJumpDay#50thanniversaryofthemoonlanding#LunarLanding#ManOnTheMoon 👨🏼🚀👨🏼🚀👨🏼🚀 pic.twitter.com/t7Ut0ogSN5 — Miguel Velasco (@_miguelvelasco) July 20, 2019 మూన్డేగా గుర్తింపు ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. కట్టుకథ.. కౌంటర్లు బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. -
రికార్డు బుక్లోని 'మూన్వాక్' !
మైకేల్ జాక్సన్ రికార్డును బద్దలుకొట్టిన పాలమూరు కుర్రాడు గంటలో 4.2 కి.మీ. దూరం 'మూన్వాక్' జడ్చర్ల: ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ మూన్వాక్తో సృష్టించిన గిన్నిస్ బుక్ రికార్డును తెలంగాణ యువకుడు బ్రేక్ చేశాడు. శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో నిర్వహించిన మూన్వాక్ ఈవెంట్లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి వంశీ కృష్ణ గంట వ్యవధిలోనే 4.238 కిలోమీటర్లు దాటి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2002లో జాక్సన్ తన కాళ్ల మునివేళ్లతో వివిధ నృత్యరీతుల్లో వెనక్కి తిరిగిచూడకుండా గంట వ్యవధిలో 2.4 కి.మీ. మూన్వాక్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. గిన్నీస్ వారు పరిశీలించిన అనంతరం ఈ రికార్డు ను ధ్రువీకరీంచాల్సి ఉంటుంది. అయితే వంశీకృష్ణ కేవలం 33 నిమిషాల 4 సెకన్ల వ్యవధిలోనే 2.4 కి.మీ. దాటి రికార్డును తిరగరాశాడు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనాథాచారి గిన్నిస్బుక్ నిర్వాహకులుగా వ్యవహరించారు. సరిగ్గా మధ్యాహ్నం 3.11 గంటలకు మూన్వాక్ ప్రారంభించిన వంశీకృష్ణ 4.11 గంటలకు ముగించాడు. అనంతరం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. తాను మైకేల్ జాక్సన్కు వీరాభిమానినని, దీనికోసం ఎంతో సాధన చేశానని తెలిపారు. శనివారం జాక్సన్ జయంతి రోజున ఆయనకు ఇది తాను ఇచ్చిన నివాళి అని పేర్కొన్నాడు. మహబూబ్నగర్ జిల్లా మానవపాడుకు చెందిన వంశీకృష్ణ కుటుంబం రంగారెడ్డి జిల్లా తాండూర్లో స్థిరపడింది. రికార్డు సృష్టించిన వంశీకృష్ణను మంత్రి సి.లక్ష్మారెడ్డి అభినందించారు.