breaking news
Mohammad hussain
-
ఐరాస వేదికగా మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్..!
జెనీవా: ఐక్యరాజ్యసమితి (United Nations)లో పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. మానవ హక్కుల మండలిలో పాక్ వక్ర బుద్ధిని భారత్ దుయ్యబట్టింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మైనారిటీలపై దాడులు జరిపే ఆ దేశం మానవహక్కులపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ భారతీయ దౌత్యవేత్త మొహమ్మద్ హుస్సేన్ చురకలు అంటించారు. పాక్ తప్పుడు ప్రచారాలు చేసే బదులు తన దేశంలోని మైనారిటీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలంటూ హితవు పలికారు.ఇటీవల పాకిస్తాన్లో ఆ దేశ సైన్యం చేసిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా కూడా పాక్ సర్కార్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్లు సుదీర్ఘకాలంగా సైనిక ఆపరేషన్లకు కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇతరుల ముందు మానవ హక్కుల పాఠాలు చెబుతోంది కానీ.. అక్కడి పరిస్థితులు చూస్తే వాటికి పూర్తిగా విరుద్ధం.. తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తోందంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం తమ కనీస ప్రాథమిక హక్కుల్ని సైతం కాలరాస్తోందంటూ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాఘ్ జిల్లా దిర్కోట్లో నలుగురు, ముజఫ రాబాద్, మిర్పూర్లలో ఇద్దరు చొప్పున చనిపో యారు. ముజఫరాబాద్లో మంగళవారం జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడం తెల్సిందే. దీంతో, బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. -
ఎయిర్పోర్ట్లో రెండున్నర కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్, న్యూస్లైన్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మీర్ మహ్మద్ హుస్సేన్(35) సింగపూర్ నుంచి సిల్క్ ఎయిర్లైన్స్ ఎంఐ(478) విమానంలో గురువారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్యాంటు, చొక్కా లోపలి భాగంలో రెండు బంగారు బిస్కెట్లు, ఓ బ్రాస్లెట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇవి 2 కిలోల 499 గ్రాముల బరువు ఉన్నాయి. వీటి రూ.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. హుస్సేన్ అక్రవుంగా బంగారం తెస్తున్నందున అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ ఆర్. మనోహర్, డిప్యూటీ కమిషనర్ ఈవీఎన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కల్యాణ్, కస్టమ్స్ సూపరిండెంట్ రామకృష్ణారావు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు అన్వర్, మొహినుద్దీన్, ప్రతాప్రెడ్డి, హుస్సేన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి మాసంలో అధికంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలోనే పదికిపైగా బంగారం పట్టివేత కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో కస్టమ్స్ అధికారులు సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేజీ బంగారానికి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రో ప్లేట్ల రూపంలో రెండున్నర కేజీల బంగారాన్ని తీసుకొచ్చాడు. పాప్కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో, లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా ఇలా పలు విధాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయూరు.