breaking news
the Ministry of Civil Aviation
-
పార్కింగ్ చార్జీల రద్దు 28 వరకు పొడిగింపు
శంషాబాద్ : చిల్లర కొరత కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల పార్కింగ్ చార్జీల రద్దు గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఈ నెల 14 నుంచి పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం లేదు. చిల్లర పరిస్థితి అదే విధంగా ఉండడంతో ప్రభుత్వం ఈ నెల 28 వరకు పార్కింగ్ చార్జీలను రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి ఎలాంటి పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం లేదని జీఎంఆర్ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
-ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో బందోబస్తు శంషాబాద్ టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమేరకు శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఇస్తాంబుల్ వెళ్లడానికి విమానాలు లేకపోయిన ప్పటికి ముంబై, ఢిల్లీ నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.