breaking news
minister thalasani
-
జంట నగరాల్లో బోనాల సందడి
-
మినీ థియేటర్లు.. ఆన్లైన్లో టికెట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభి వృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ ప్రారంభమైంది. ‘టీఎస్బాక్స్ ఆఫీస్.ఇన్’ ద్వారా ఆన్లైన్ టికెట్స్ పొందొచ్చు. అలాగే షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతులు అందించే ఆన్లైన్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రెండింటిని ప్రారంభిం చుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమానులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్రావు, ఎఫ్డీసీ ఎండీ నవీన్ మిట్టల్, జేఎండీ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు దిల్ రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు. సినిమా షూటింగ్ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్ఎఫ్డీసీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు. సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, మార్గదర్శకాలు తయారుచేసి సీఎం అనుమతితో నిర్వహిస్తామన్నారు. రమణాచారి మాట్లాడుతూ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్ రాంమోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్లైన్ పోర్టల్ విధానం ఉపయోగపడుతుందన్నారు. టీఎస్ ఐపాస్ తరహాలోనే ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ను ప్రారంభించామని, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని వీరందరు ఏడురోజుల్లో ఆన్లైన్ అనుమతులు ఇస్తారన్నారు. -
హైదరాబాద్లో అతిపెద్ద సినిమా పండుగ
హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద సినిమా పండుగకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ పేరుతో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు జరగనున్న సినీ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన తలసాని.. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ ద్వారా సినిమా రంగంలోని అన్ని కళలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకలో 75దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని, యూరోపియన్, చైనీస్ సినిమా రంగం నుంచి కూడా ప్రముఖులు, అతిధులు వస్తారని వివరించారు. కార్నివాల్లో భాగంగా 200కు పైగా స్టాల్స్ ద్వారా ఒక మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు సుమారు 100 సంస్థలు ఆసక్తి చూపాయని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యానిమేషన్ సంస్థలు.. డిస్ని, ప్యారామౌంట్, డ్రీమ్వరల్డ్, కేన్స్, దుబాయి ఫిల్మ్ మార్కెట్ తదితర సంస్థలు స్టాళ్లను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిలిం కార్నివాల్ లో భాగంగా 80 దేశాలకు చెందిన 200 చిత్రాలు, దాదాపు 1000 లఘు చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 300 మంది పెట్టుబడిదారులకు.. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయతలపెట్టిన అంతర్జాతీయ ఫిలిం ఇనిస్టిట్యూట్ను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ఇనిస్టిట్యూట్ స్థాపన కోసం 50 నుంచి 100 ఎకరాల స్థల సేకరణను వేగవంతం చేశామన్నారు. -
వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం
సాక్షి,సిటీబ్యూరో: జలవిహర్లో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి. పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు రవి యాదవ్ల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు