-
మంత్రికి తెలీకుండానే పోస్టింగ్
► కేడర్ పోస్టులో నాన్ కేడర్ అధికారి నియామకం ► అటవీ శాఖలో ఉన్నతాధికారుల విస్మయం సాక్షి, అమరావతి: బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నిబంధనలను అటవీశాఖ గాలికొదిలేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ముఖ్య కార్యదర్శి అనంతరాములకు తెలియకుండా కీలకమైన బదిలీలు జరిగిపోతున్నాయి. మంత్రికి, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి ఫైలు పంపకుండా రాష్ట్ర అటవీ దళాల అధిపతి పీకే సారంగి బైపాస్ చేసి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు పంపించి డీఎఫ్ఓలను బదిలీ చేస్తున్న తీరుపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) షేక్ సలాంను నియమిస్తూ ఈనెల 18న జారీ చేసిన జీవో 161 ఇందుకు నిదర్శనం. ఇదీ విధానం: అటవీ శాఖ డీఎఫ్ఓల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ప్రతిపాదన ఫైలు ఆమోదానికి ముందుగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర అటవీ దళాల అధిపతి పంపాలి. అనంతరం ముఖ్య కార్యదర్శి ఈ ఫైలును సంబంధిత మంత్రికి పంపుతారు. మంత్రి అనుమతితో సీఎస్కు పంపించి ఉత్తర్వులు జారీచేస్తారు. కానీ, రాష్ట్ర అటవీ అధికారుల నియామకాలకు సంబంధించిన ఫైళ్లను సీఎస్కు పంపాల్సిన అవసరంలేదు. మంత్రి అనుమతి తీసుకుని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నేరుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అలాగే, కేడర్ పోస్టుల్లో అఖిల భారత అటవీ అధికారులనే నియమించాలనే నిబంధన ఉంది. ఇందుకు భిన్నంగా.. రాష్ట్ర రోడ్డు రహదారుల అభివృద్ధి సంస్థలో పర్యావరణ అధికారిగా పనిచేస్తున్న షేక్ సలాం అటవీశాఖలో తనకు పోస్టింగ్ ఇవ్వాలని అటవీ దళాల అధిపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ ఫైలును అటవీ దళాల అధిపతి బైపాస్ చేసి మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి పంపకుండా సీఎస్కు పంపి బదిలీ ఉత్తర్వులిచ్చారు. -
శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
చీరాల: శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగ సిద్ధమైంది. మహాశివరాత్రి రోజున ఈ తలపాగా చుట్టిన తర్వాతే మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు. కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు. ఈ తలపాగాతో మం గళవారం ఉదయం పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరింది. తాను నేసిన బట్టతో పరమశివుణ్ని వరుడిగా అలంకరించడం తన అదృష్టమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్అండ్ బి, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు లు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. -
నగదు కష్టాలపై ప్రత్యామ్నాయ చర్యలు
ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న నగదు కష్టాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు బ్యాంకర్లను ఆదేశించారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీహాల్లో బుధవారం బ్యాంకర్లతో పాటు పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య ప్రజలు పడే ఇబ్బందులను గమనించామన్నారు. దీనిపై ఏం చర్యలు చేపట్టారని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావును మంత్రి ప్రశ్నించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో రూ.2,380 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు. అయితే రిజర్వు బ్యాంకు నుంచి కొత్త నోట్లు రూ.930 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. వీటిని అన్ని బ్యాంకులకు పంపామన్నారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం తగిన ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ తీరు పట్ల మంత్రి శిద్ధా రాఘవరావు చర్చించారు. రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయటంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఆన్లైన్ విధానం ద్వారా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ హేమామహేశ్వరరావు సమాధానమిచ్చారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సంబంధితశాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ సామాజిక పింఛన్దారులకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. చౌకదుకాణాలు, ఎరువుల దుకాణాల్లో ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయశాఖకు సంబంధిత అధికారులతో ప్రతి రోజూ ఆయా మండలాల వారీగా సమీక్షిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ–2 సాల్మన్ రాజ్కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసా రత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చిరుధాన్యాలతో రోగాలు దూరం
- మంత్రి శిద్దా రాఘవరావు ఒంగోలు టౌన్ : చిరుధాన్యాలతో రోగాలు దూరమవుతాయని రాష్ట్ర రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాత రోజుల్లో ఆస్పత్రులు ఎక్కువగా ఉండేవి కావని, ఆనాటి ప్రజలు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడంతో రోగాల బారిన పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, ఒబెసిటీ (అధిక బరువు), మోకాళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. ప్రొటీన్లు, కాల్షీయం, ఇనుము, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న చిరుధాన్యాల వాడకంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడలని కోరారు. పౌష్టికాహార వారోత్సవాలను వారం రోజులకు పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని సూచించారు. చిరు ధాన్యాల వాడకం గురించి గ్రామ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తే వారి ఆహారపు అలవాట్లలో దానంతట మార్పు అదే వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలని మంత్రి సూచించారు. విలన్లా కనిపిస్తున్న రైస్ : కలెక్టర్ రైస్ విలన్లా కనిపిస్తోందని కలెక్టర్ సుజాతశర్మ వ్యాఖ్యానించారు. రైస్ను పాలిష్ చేసిన తర్వాత ఆహారంగా తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్స్ పోతున్నాయన్నారు. కార్బోహైడ్రేట్ మాత్రమే మిగులుతోందన్నారు. ఫలితంగా బీపీ, షుగర్, వంటి రోగాలు వస్తున్నాయన్నారు. ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎక్కువ ఖర్చు అయినా మంచి ఫుడ్గా భావించి ఎక్కువ మంది తింటూ రోగాల బారిన పడుతున్నారన్నారు. సమతుల ఆహారమే మంచి పౌష్టికాహారమని, తక్కువ ఖర్చుతో దాన్ని పొందొచ్చన్నారు. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మహిళల చేతుల్లోనే ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడంలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి ఇంటిలో వండిపెట్టేవారు మహిళలే అయినందున వారికి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, మహిళా కమిషన్ సభ్యురాలు టి.రమాదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.విశాలాక్షి పాల్గొన్నారు. ఆహా ఏమి రుచి! పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శనను మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ సందర్శించారు. చిరుధాన్యాలతో అం గన్వాడీలు తయారు చేసిన రకరకాల వంటకాలు అదిరిపోయాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన కేక్ను కలెక్టర్ సుజాతశర్మ కట్ చేశారు. కేక్ను పక్కనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావుకు అందించారు. ఆ కేక్ను రుచి చూసిన కలెక్టర్ ‘ఆహా ఏమి రుచి’ అంటూ దాన్ని తయారు చేసిన అంగన్వాడీ కార్యకర్త జయశ్రీని అభినందించారు. -
ఆరు నెలల్లో అన్ని బస్సులకు జీపీఎస్
విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులకు జీపీఎస్ను అమర్చుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కంపార్ట్మెంట్లను విజయవాడ సిటీ టెర్మినల్లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 వేల ఆర్టీసీ బస్సుల్లోను ఆరు నెలల్లో జీపీఎస్ సిస్టమ్ అమలులోకి తెస్తామన్నారు. పాత బస్సులను సరుకు (గూడ్స్) రవాణాకు ఉపయోగించి ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని సిటీ పరిధిలో తిరిగే ప్రతీ బస్సులోను ప్రత్యేక కంపార్టుమెంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ నగరంలో 350, విశాఖలో 350 సిటీ బస్సులు తిరుగుతున్నాయని, ఆ బస్సుల్లోను వారం రోజుల్లో మహిళలకు ప్రత్యేక కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సులను మరింత సౌకర్యవంతంగాను, సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రతీ బస్సు స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో అన్ని బస్స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని, రెండవ దశలో 1200 మండల కేంద్రాల్లో బస్స్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ బస్ డిపో, ఆర్టీసీ గ్యారేజీల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) జి.జయరావు, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, కృష్ణా రీజినల్ మేనేజర్ పీవీ రామారావు, అధికారులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement