-
రూ.లక్షల్లో టోకరా..
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : దాదాపు ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తూ అందరి వద్ద సుమారు రూ. 20 లక్షలపైన అప్పులు చేసి ఓ వ్యాపారి ఉడాయించినట్లు భైంసాలో పుకార్లు వ్యాపించాయి. భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయిల దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి గత కొంత కాలంగా అప్పుల వాళ్లకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా దుకాణానికి రావడం లేదని, రెండు రోజులుగా దుకాణం మూసి ఉండడంతో, దుకాణంలో పాలు పోసే వారు ఆదివారం దుకాణం వద్ద గుమిగూడారు. ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. అంతేకాకుండా సదరు వ్యాపారి తన చిన్న కుమారుడి సెల్ఫోన్కు అప్పుల బాధ తాళలేక చనిపోతున్నానంటూ మెసేజ్ పెట్టడంతో, అతని కుమారుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 1 న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. హోటల్లో గుమాస్తా నుంచి.. నేరడిగొండ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కుటుంబం గత ఏడెమినిదేళ్ల క్రితం భైంసాకు వలస వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట్లో స్థానిక హోటల్లో స్వీట్లు చేసే పనికి కుదిరాడు. ఇక్కడి వారితో పరిచయాలు పెరగడంతో నాలుగేళ్ల క్రితం బోయిగల్లిలో సొంతంగా స్వీట్ దుకాణం ప్రారంభించాడు. కానిస్టేబుల్నూ వదల్లేదు.. దుకాణం నడిపే క్రమంలో తెలిసినవాళ్ల వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. తన దుకాణంలో పనిచేసే మాస్టర్(వంటవాడు) వద్దే రూ. 3.5 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. తన యజమాని అడగడంతో వంటవాడు భార్య నగలు కుదువపెట్టి మరీ వ్యాపారికి అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. దుకాణంలో పాత్రలు కడిగే మహిళ వద్ద రూ. 40 వేలు అప్పు తీసుకున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.ఇక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద, తెలిసిన వారి నుంచి దొరికిన చోటల్లా అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భైంసా పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్ వద్ద కూడా అప్పు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఆయన దుకాణంలో పాలు పోసే వారు దాదాపు పదిమంది వరకు ఉన్నారు. వీరు ప్రతిరోజు 20 నుంచి 60 లీటర్ల వరకు పాలు పోసేవారని చెబుతున్నారు. పాలు పోస్తున్న తమకు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నాడని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా దుకాణంలో సదరు వ్యక్తి కనిపించకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వాపోయారు. అదృశ్యం కేసు నమోదు.. మిఠాయిల దుకాణం నిర్వహించే సదరు వ్యాపారి అప్పుల బాధ తాళలేక వెళ్లిపోతున్నానంటూ ఈ నెల 1 న తన కొడుకు సెల్ఫోన్కు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాడని అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇటీవలే కూతురి పెళ్లి కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడని తెలిపాడు. ఇక తన కోసం వెతకవద్దని, దుకాణం నడిపి అప్పులు తీర్చాలంటూ వాయిస్ మెసెజ్ పెట్టినట్లు ఫిర్యాదులో కుమారుడు పేర్కొనడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మూడునెలలుగా తిప్పుతున్నాడు నేను గత మూడేళ్లుగా స్థానిక బోయిగల్లిలో మిఠాయి దుకాణంలో పాలు పోస్తున్నాను. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడు. అయితే మూడు నెలలుగా మాత్రం డబ్బుల కోసం తిప్పుకున్నాడు. కూతురి పెళ్లి చేశానని, త్వరలో చెల్లిస్తానని చెప్పేవాడు. ప్రతిరోజు 30 లీ పాలు పోసేవాడిని. మూడునెలల బకాయిలు రావాల్సి ఉంది. – రాజు, పాల వ్యాపారి, భైంసా నమ్మకంతో పోసేవాళ్లం మేం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పోసేవాళ్లం. రోజుకు 30 లీటర్ల వరకు పాలు తీసుకునేవాడు. నమ్మకంగా డబ్బులు చెల్లించేవాడు. అయితే గత కొద్ది నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. రేపు, మాపు అంటూ తిప్పి పంపేవాడు. మా లాగే ఇంకా కొందరికి డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. – రాజేందర్, ప్రసాద్, భైంసా -
రూ.75 లక్షలకు టోకరా?
నిజామాబాద్ మార్కెట్లో పసుపు వ్యాపారి పరారీ లబోదిబోమంటున్న కమీషన్ ఏజెంట్లు, రైతులు నిజామాబాద్ : నిజామాబాద్ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలుదారుడు సుమారు రూ.75 లక్షలకు టోకరా వేశాడు. యార్డులో పసుపు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించినట్లు కమీషన్ ఏజెంట్లు, కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఈ వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. పసుపు కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించకుండా ఉడాయించడంతో కమీషన్ ఏజెంట్లు, రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధిత ఏజెంట్లు, కొందరు రైతులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యాపారి నాలుగైదేళ్లుగా పసుపు కొనుగోలు చేస్తున్నాడు. ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పసుపు కొనుగోళ్లు జరిపాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బులు చెల్లిస్తూ వచ్చిన ఆయన, వారం రోజుల నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బుల చెల్లింపులు నిలిపివేశారు. శనివారం, ఆదివారం పసుపు కొనుగోళ్లు లేకపోవడంతో ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఈ వ్యాపారి కమీషన్ ఏజెంట్లకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ వ్యాపారి పరారైనట్లు కమీషన్ ఏజెంట్లు భావిస్తున్నారు. బాధితుల్లో రైతులు ఈ వ్యాపారి బాధితుల్లో కొందరు రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కమీషన్ ఏజెంట్ల వద్ద పసుపు కొనుగోళ్లు చేసి, చేతులెత్తేనట్లు తెలిసింది. వీరంతా సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎంతెంత టోకరా వేసి వెళ్లాడని చర్చించుకున్నట్లు సమాచారం. మంగళవారం బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలే.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు టోకరా పెట్టడం ఇది కొత్తేమీ కాదు. కానీ.. ఈ పదేళ్లలో ఈ తరహా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. 2004కు ముందు సుమారు 10 మంది వరకు వ్యాపారులు ఇలా ఉడాయించారు. అనంతరం ఐపీఈతో నిజామాబాద్ నగరానికి వచ్చి దర్జాగా ఇతర వ్యాపారాలు చేసుకున్నారు. సుమారు పదేళ్ల అనంతరం ఇప్పుడు మళ్లీ మార్కెట్ యార్డులో వ్యాపారి టోకరా వెలుగులోకి రావడంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారి టోకరా వేయడంపై మార్కెటింగ్శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement