-
ఫ్యామిలీ డాక్టర్తో అద్భుత ఫలితాలు
నాదెండ్ల: ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అద్భుత ఫలితాలు సాధిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కితాబిచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం ఆమె పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గ్రామానికి చెందిన నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ తదితరులు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. మంత్రి రజని వారిళ్లకు వెళ్లారు. వారికి అందుతున్న వైద్యసేవపై ఆరా తీశారు. ఫ్యామిలీ డాక్టర్ మీ ఇళ్లకే వచ్చి వైద్యం చేస్తున్నారా, కావాల్సిన మందులిస్తున్నారా, నెలలో ఎన్నిసార్లు వస్తున్నారు, ఏం పరీక్షలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ‘ప్రతినెలా రెండుసార్లు వస్తున్నారు’ వైద్యులు ప్రతినెలా రెండుసార్లు తమ ఇళ్లకే వచ్చి వైద్యం అందిస్తున్నారని నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ, వారి కుటుంబ సభ్యులు మంత్రి రజనికి వివరించారు. బీపీ, ఇతర అవసరమైన పరీక్షలు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా ఎప్పుడూ లేదని, ప్రభుత్వ వైద్యుడే తమ ఇళ్లకు వచ్చి వైద్యం చేయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎంఎల్ హెచ్పీ, ఏఎన్ఎంలు కూడా నిరంతరం రోగులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రికార్డులు పక్కాగా నిర్వహించండి రోగులకు అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని మంత్రి రజని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఓపీ సమయంలో ప్రతి రోగి ఆరోగ్య వివరాలు ఈహెచ్ఆర్లో నమోదయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి ఆరోగ్య సేవలందించే సమయంలో రోగులు, పిల్లలతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తూబాడు గ్రామంలో ఈ ఒక్కరోజే ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఏకంగా 266 మందికి ఓపీ సేవలు అందించామని చెప్పారు. ఈ స్థాయిలో గ్రామస్తులకు వైద్య సేవలు గతంలో ఎప్పుడూ అందలేదన్నారు. జగనన్న పరిపాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒకటని ప్రశంసించారు. మంత్రి స్థానిక వైఎస్సార్ హెల్త్ క్లినిక్కు వెళ్లి 104 వాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కూడా పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కూడా మంత్రి పరిశీలించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ప్రజా స్పందన అద్భుతం ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంపై పూర్తిస్థాయిలో ఆరా తీశానని చెప్పారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు. వీరిలో సగానికిపైగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రభుత్వ సిబ్బంది గ్రామాలకే వెళ్లి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారని.. ఎవరికైనా మెరుగైన వైద్యసేవలు అవసరమైతే పీహెచ్సీకి సిఫారసు చేస్తారని తెలిపారు. అవసరమైతే సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కూడా పంపిస్తారని వివరించారు. అక్కడ కూడా లొంగని జబ్బు అయితే బోధనాస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఆస్పత్రులను అనుసంధానించామని చెప్పారు. -
8న ‘ఆరోగ్య మహిళ’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా విస్తరణ.. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించి ఆపై 1,200 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 8న ప్రారంభించే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలన్నారు. సీపీఆర్పై విస్తృత ప్రచారం గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్లకు గురైన వారిని సత్వరమే కాపాడటంలో దోహదపడే ప్రాథమిక చికిత్స కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్రావు అధికారులకు సూచించారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఇలా అరెస్ట్అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్కు గురయ్యేవారికి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)ల కోసం మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ‘కంటివెలుగు’ అందరికీ చేరాలి కంటివెలుగు పథకంలో భాగంగా అందిస్తున్న కంటి పరీక్షలు అందరికీ చేరాలని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించే 8 పరీక్షలివే.. 1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు. 2. ఓరల్, సర్వ్యకిల్, రొమ్ము కేన్సర్ల స్క్రీనింగ్. 3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు, చికిత్స, మందులు. 4.మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు,పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు. 5.మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్. 6. నెలసరి సమస్యలపై పరీక్షలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, అవసరమైనవారికి అ్రల్టాసౌండ్ టెస్టులు. 7.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు, అవగాహన. 8.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన -
సాక్షి బతుకు చిత్రం : ANM ఆరోగ్య కార్యకర్తలపై ప్రత్యేక కథనం
-
మెడికల్ టూరిజంతో ఎకానమీకి ఊతం..
న్యూఢిల్లీ: భవిష్యత్లో అందుబాటు ధరల్లో వైద్య సేవలందించే మెడికల్ టూరిజం కేంద్రంగా భారత్ ఎదగనుందని, దేశ ఎకానమీకి ఈ విభాగం తోడ్పాటు గణనీయంగా ఉండబోతోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పోర్ట్ఫోలియోలో ఇది కూడా కీలకం కానుందని ఆమె తెలిపారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ పేషంట్ల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. ఎక్కువ మంది ప్రధానంగా క్యాన్సర్, అవయవ మార్పిడి, ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ, హృద్రోగాలు మొదలైన సమస్యల చికిత్స కోసం వస్తున్న వారు ఉంటున్నారని సంగీతా రెడ్డి చెప్పారు. ముఖ్యంగా నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, కెన్యా, నైజీరియా, ఇథియోపియా, ఒమన్, యెమెన్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ పేషంట్లు వస్తున్నారని ఆమె తెలిపారు. -
ఫస్ట్ఎయిడ్ ఏబీసీడీలు
చాలా సందర్భాల్లో ఫస్ట్ ఎయిడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఎన్నో ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ మీద మనమందరమూ అవగాహన కలిగి ఉండటం ఎంతో మంచిది. అందుకు ఉపకరించేదే ఈ కథనం. ఏదైనా ఓ అనుకోని సంఘటనతోనో, అకస్మాత్తుగా రుగ్మతతోనో రోగికి చికిత్స అవసరమైనప్పుడు వైద్య శిక్షణ అంతగా లేని మామూలు వ్యక్తులు చేసే తొలి ఆరోగ్య సేవను ప్రథవు చికిత్సగా చెబుతారు. ఆ క్షణాన అవసరమైన సేవ అందించడం ద్వారా రోగి పరిస్థితి వురింత విషమించకుండా చేయడం ఇందులో సాధ్యమవుతుంది. అలాగే ఆ సమయానికి అందించిన ఆ తొలి చికిత్సే ప్రాణాలు కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రథవు చికిత్స ఏబీసీడీలు... ఏదైనా ప్రక్రియలో ఏబీసీడీలు అంటే... ప్రాథమిక అంశాలని అర్థం. కాని ఫస్ట్ ఎయిడ్లో ఏ,బీ,సీ,డీలను గుర్తుంచుకుంటే చికిత్స చాలా సులువవుతుంది. తద్వారా మామూలు వ్యక్తులు కూడా చికిత్స ప్రాధాన్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. అలాగే దాన్ని అందించడమూ సులువవుతుంది. ఇక్కడి ఏ, బీ, సీ లు ప్రథమ చికిత్సలోని కొన్ని ఇంగ్లిషు మాటలకు సంక్షిప్త రూపాలు. అవి... ►ఏ అంటే... ఎయిర్ వే గాలి పీల్చే వూర్గంలో అవాంతరం లేకుండా చూడటం ►బీ అంటే... బ్రీతింగ్... శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం ►సీ అంటే... సర్క్యులేషన్... అంటే రక్తస్రావం అవ#తుంటే ఆపి... రక్త ప్రవాహ వ్యవస్థ (సర్క్యులేషన్) సక్రవుంగా సరిగ్గా జరిగేలా చూడటం. డీ అంటే ..డెడ్లీ బ్లీడింగ్ / డీఫైబ్రిలేషన్ ఉదాహరణకు... ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్లు అనిపించింది. సాధారణంగా స్పృహ తప్పిన వ్యక్తుల నాలుక వెనక్కువెళ్లవచ్చు. దాంతో అది శ్వాసతీసుకునే వూర్గాన్ని అడ్డుకుంటుంది. అందుకే పడుకున్న భంగివులోనే ఉన్న రోగి గదవును ఎత్తుగా ఉండేలా... తలను కాస్తంత పైకెత్తినట్లుగా పడుకోబెడితే శ్వాస తీసుకునే వూర్గానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది. ఇదే... మొదటి ఏ. అంటే ఎయిర్వేలో అంతరాయం లేకుండా చూడటం. అలా చేశాక... రోగికి శ్వాస అందేట్లు చేయడం, తగినంత గాలి ఆడేలా చూడటం ప్రధానం. దీన్ని బ్రీతింగ్లోని మొదటి అక్షరం ‘బి’తో సూచిస్తారు. ఇక రక్తస్రావం అవతుంటే ఆపడం... అంటే సర్క్యులేషన్ సక్రవుంగా జరిగేలా చూడటం ఆ తర్వాతి ప్రాధాన్య అంశం. దీన్నే ఇంగ్లిష్ అక్షరమైన ‘సి’తో సూచిస్తారు. ఇక వురికొందరు ‘డి’ అనే అక్షరాన్ని కూడా చేర్చి– డెడ్లీ బ్లీడింగ్ లేదా డీఫైబ్రిలేషన్ అని కూడా అంటారు. అయితే వురికొందరు ఏబీసీలు చాలనీ... డి అనే ఆ వూట ‘సి’– సర్క్యులేషన్లోనే భాగవుని అంటారు. ఇంకొందరు ప్రథవు చికిత్స ప్రిన్సిపుల్స్ చెబుతూ ఈ ప్రక్రియలో వుూడు ‘బి’లపై దృష్టినిలపాలని చెబుతుంటారు. అవి... బ్రీతింగ్ (శ్వాస), బ్లీడింగ్ (రక్తస్రావం), బోన్స్ (ఎవుుకలు). అంటే... శ్వాసక్రియ చక్కగా జరిగేలా చూడటం, రక్తస్రావాన్ని అరికట్టడం, ఎవుుకలకు ఏదైనా ప్రవూదం జరిగిందేమో చూడటం... ఈ మూడూ ∙ప్రథవు చికిత్సలోని ప్రాథమిక ప్రాణరక్షణ (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంశాలని చెబుతారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవచ్చు/చేయవచ్చు... ►కాళ్లు వుడతపడటం/మెలికపడటం వల వాస్తే... వాచిన చోట ఐస్ పెట్టాలి. స్ప్రెయిన్ అయిన కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్ ఇవ్వాలి. ►ముక్కు నుంచి రక్తస్రావం అవ#తుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయంతో వుుక్కుపై కాస్తంత ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవాలి. దీని వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. ►చెవిలో ఏదైనా దూరితే... చెవిలోకి టార్చిలైట్ వేయాలి. కాంతికి ఆకర్షితం కావడం కీటకాలకు ఉండే సహజమైన ఇన్స్టింక్ట్. అలా అది ఆ వెలుగుకు ఆకర్షితమై బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే చెవిని శుభ్రమైన నీటితో (ప్లెయిన్వాటర్తో) కడగాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెవిలో కొబ్బరినూనె వంటి జిడ్డుగా ఉండే పదార్థాలు వూత్రం అస్సలు వేయకూడదు. అది చెవి ఇన్ఫెక్షన్కు దారితీసి, మరింత ప్రమాదం తెచ్చిపెడుతుంది. ►వాంతులు, విరేచనాలు అవ#తుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియకు బదులు మెడికల్ షాపుల్లో దొరికే ఓఆర్ఎస్నే వాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం ఉప్పు, పంచదార కలిపిన నీళ్లలో ఏవైనా కాలుష్యాలు ఉంటే అది రోగిని మరింత దిగజార్చే అవకాశాలుంటాయి కాబట్టి రెడీమేడ్గా దొరికే ఓఆర్ఎస్నే వాడటం మంచిది. ►యాక్సిడెంట్ రోగులైతే... ప్రవూదం వల్ల అవ#తున్న రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం. రక్తం పోకుండా చూడటం వుుఖ్యం. ►కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయాన్ని కడగాలి. ►కాలిన గాయాలైతే... వాటిపైనుంచి నీళ్లు ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వెళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు) వురింతగా చెడకుండా ఉంటాయి. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు. ►జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డతో అద్దుతూ ఉండాలి. ఒంట్లోని ఉష్ణోగ్రతను గ్రహించి, ఆ తడిగుడ్డలోని నీరు ఆవిరవుతూ ఉండటం వల్ల దేహ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గేందుకు అవకాశం ఉంది. ►పాము కరచిన సందర్భంలో రోగికి తొలిసాయంగా ఆత్మస్థైర్యం కలిగించడం వుుఖ్యం. ఇక పావుు కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం వుుఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం వుుఖ్యం. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. అంతేతప్ప సినిమాల్లో చూపినట్లుగా పాముకరచిన చోట గాటుపెట్టి రక్తం బయటకు పీల్చి ఉమ్మేయడం వంటి టెక్నిక్లను అనుసరించకూడదు. ఇక గుండెపోటు వచ్చి గుండె ఆగిన సందర్భాల్లో కార్డియో పల్మునరీ రీసుసీయేషన్ (సీపీఆర్) అనే ప్రథమచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దీనికి కొద్దిపాటి శిక్షణ అవసరమవుతుంది. అలాంటి శిక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే రోగికి సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించాలి. లేదా అంబులెన్స్లో పీసీఆర్ చేస్తూనే ఆసుపత్రికి తీసుకురావాలి. ఇలా సీపీఆర్తో కూడా చాలా ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ కాబట్టి ఆసక్తి ఉన్నవారు కొద్దిపాటి శిక్షణతో దీన్ని చేయవచ్చు. అన్ని చోట్లా ఫస్ట్ ఎయిడ్ పనిచేయదు... ఏదైనా ప్రవూదమో, అత్యవసర పరిస్థితో ఏర్పడినప్పుడు మెుదటి అరగంటను ప్లాటినం క్షణాలనీ, రెండో అరగంటను బంగారు క్షణాలనీ (గోల్డెన్ మెుమెంట్స్), ఆ తర్వాతి గంటను (సిల్వర్ మొమెంట్స్) అని అంటారు. అంతే... రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే దాన్ని బట్టే అతడు కోలుకునే సవుయంలో వచ్చే (రికవరీ) సవుస్యలు అంతగా తగ్గుతాయి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు అది గ్యాస్ వల్ల కావచ్చు అనుకొని నిర్లక్ష్యం చేసి సవుయం దాటిపోయాక ఆసుపత్రికి తీసుకొస్తే పరిస్థితి వురింత జటిలం కావచ్చు. అందుకే అది గ్యాస్ వల్ల వచ్చిన సవుస్యా లేక నిజంగానే హార్ట్ ప్రాబ్లవూ అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. ఇది డాక్టర్ మాత్రమే తీసుకునే నిర్ణయమని గుర్తుంచుకోవాలి. అదే పక్షవాతం (స్ట్రోక్) విషయంలో కూడా వర్తిస్తుంది. ఓ నిర్ణీతమైన సవుయంలోనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే ఇంజెక్షన్ ఇస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది. అందుకే అలాంటి సంక్లిష్టసవుయాల్లో అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులకు వెళ్లడం వుంచిది. అదే సౌకర్యాలు లేని చోటికి వెళ్తే... ఒక డాక్టర్ నుంచి వురో డాక్టర్ వద్దకూ ఓ ఆసుపత్రి నుంచి వురో ఆసుపత్రికీ తిరుగుతూ విలువైన ఆ సవుయాన్ని కాస్తా అలా తిరగడంలోనే వృథా చేస్తే అవుూల్యమైన కాలం కాస్తా గడిచిపోయి పరిస్థితి వురింత విషమించే అవకాశం ఉంటుంది. డా. శివనారాయణరెడ్డి వెన్నపూస సీనియర్ పీడియాట్రీషియన్ అండ్ నియోనేటాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement