-
వింత ఘటన.. ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్
అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం. దాంతో, ఆధార్ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్పూర్లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్గా మారాయి. In a seemingly bizarre incident, guests at a #wedding in Uttar Pradesh's #Amroha district were asked to show their #Aadhaar cards before they were allowed to pick up dinner plates.The incident took place in Hasanpur where two sisters were getting married at the same venue. pic.twitter.com/9IfenucXUH— IANS (@ians_india) September 25, 2022 -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
పెద్దదర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవం
కడప కల్చరల్ : అస్థానె మగ్దూమ్ ఇల్లాహిలోని హజరత్ ఖ్వాజా సయ్యద్షా అమీనుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గురువుల మజార్ వద్ద ప్రత్యేకంగా ఫాతెహా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీఠాధిపతి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. దర్గా ప్రాంగణంలోని దుకాణాల వద్ద మహిళలు కిటకిటలాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్గా ఆధ్వర్యంలోని లంగర్ఖానాలో వేలాది మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
Advertisement