breaking news
mdr
-
కాలేయ రోగుల్లో ఎండీఆర్ ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: కాలేయ మార్పిడి రోగుల్లో సగం మందికిపైగా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ (ఎండీఆర్) ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు హైదరాబాద్కు చెందిన సౌత్ ఏసియన్ లివర్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించింది. 26 నెలలపాటు జరిగిన ఈ అధ్యయనంలో 67 మంది కాలేయ శస్త్రచికిత్స రోగులను పరిశీలించారు. వారిలో 24 శాతం మందిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించారు. 46 మంది కాలేయ మార్పిడి పొందిన రోగుల్లో 16 మందికి ఇన్ఫెక్షన్లు విస్తరించగా వారిలో 94% మందికి తొలి, రెండో దశ యాంటీబయోటిక్స్ కూడా పనిచేయలేదని నివేదిక తెలిపింది.ఇన్ఫెక్షన్ కేసుల్లో 56 శాతం మందికి శస్త్రచికిత్సకు ముందే రక్త నమూనాల్లో ఎండీఆర్ బాక్టీరియా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోగుల్లో సగానికిపైగా ఎండీఆర్ ఇన్ఫెక్షన్తో వస్తే ఆసుపత్రుల్లో అందించే ఇన్ఫెక్షన్ నిరోధక చర్యలు పనిచేయవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ టామ్ చెరియన్ పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు రోగులలోని క్రియాశీల ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.తీవ్ర స్థాయిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్లోని రోగుల్లో 80 శాతం మందిలో ఎండీఆర్ సూక్ష్మజీవులు ఉన్నాయని వెల్లడైంది. ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎల్ఏఎస్ఎస్–2025 నివేదికలో భారత్లో ప్రతి మూడు బాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటి సాధారణ యాంటీబయోటిక్స్ను ప్రతిఘటిస్తున్నట్లు తేలింది. బ్యాక్టీరియా కల్చర్లను ముందుగానే నిర్వహించడం వల్ల శస్త్రచికిత్సల సమయంలో 30 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చినా సరైన యాంటీబయోటిక్స్తో సమస్యను నియంత్రించగలిగామని సౌత్ ఏసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు చెబుతున్నారు. భారత్లో జరుగుతున్న తాజా అధ్యయనాల ప్రకారం చివరి దశలో వాడే ‘కార్బాపెనమ్’ యాంటీబయోటిక్స్కే రెసిస్టెన్స్ పెరుగుతోందని తేలింది. ఇందులో ఇ.కోలికి 22 శాతం, కె.నిమోనియాకు 31 శాతం రెసిస్టెన్స్ ఎదురైనట్లు తేలింది. ద్వితీయశ్రేణి నగరాల్లో స్క్రీనింగ్ తప్పనిసరినిపుణుల సూచన ప్రకారం సెమీ–రూరల్, ద్వితీయశ్రేణి నగర ప్రాంతాల్లో ప్రీ–ఆపరేటివ్ స్క్రీనింగ్ విధానాలు తప్పనిసరి చేయడం ద్వారా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీబయోటిక్స్ వినియోగం, పర్యవేక్షణ వ్యవస్థల బలోపేతం అత్యవసరమని సూచించారు. -
మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండీఆర్ రద్దు
న్యూఢిల్లీ: మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)ను డిసెంబర్ 31 వరకూ రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రూపే డెబిట్ కార్డులపై ఎండీఆర్ను గతవారమే ఎత్తివేశారు. పెన్షనర్లకు ఇబ్బంది కలిగించొద్దు పెన్షనర్లు, భద్రతా దళాల సిబ్బందికి చెల్లింపుల కోసం తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. భద్రతా దళాల సిబ్బంది కోసం మిలట్రీ అవుట్పోస్టుల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరింది. ఎయిర్పోర్ట్ల వద్ద భద్రత కట్టుదిట్టం రద్దైన పెద్ద నోట్లు అక్రమంగా తరలకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఎరుుర్పోర్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రైవేట్ చార్టెడ్ విమానంలో హరియాణా నుంచి నాగాలాండ్ లోని దిమాపూర్ ఎరుుర్పోర్టుకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యారుు. నగదు అక్రమ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని అన్ని ఎయిర్ పోర్టుల్ని హోం శాఖ కోరింది. దేశంలో దాదాపు 98 ఎరుుర్ పోర్టుల రక్షణ బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఎస్ఐఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎప్)లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. -
మాటేసిన మృత్యువు
32 లక్షల మందిలో క్షయ బ్యాక్టీరియా 28 శాతం మంది పిల్లల్లోనూ.. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే ఉగ్రరూపం జిల్లాలో పెరుగుతున్నక్షయ కేసులు తీవ్రత గుర్తించని ప్రభుత్వం కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో క్షయ నివారణ కేంద్రం(ఓపీ-36)తో పాటు నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో టీబీ ఆసుపత్రులుఉన్నాయి. వీటితో పాటు నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్, కోయిలకుంట్ల, గోనెగండ్ల, పత్తికొండ, ఆలూరు, వెలుగోడు, నంద్యాల(రూరల్), బనగానపల్లి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, ఆదోని(రూరల్), ఆళ్లగడ్డలో టీబీ యూనిట్లు, మైక్రోస్కోప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మరో 51 మైక్రోస్కోప్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 51 మైక్రోస్కోపిక్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణ చేస్తారు. గత 10 సంవత్సరాల్లో 73,923 మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 62,835 మంది ఈ వ్యాధి నుంచి విముక్తి పొందారు. డాట్ విధానంలో జిల్లా క్షయ నివారణ సంఘం ద్వారా ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది. ఆందోళన కలిగిస్తున్న ఎండీఆర్ టీబీ కేసులు క్షయ వ్యాధిగ్రస్తులు ఒకసారి 6 నెలలు, రెండవ సారి 8 నెలల పాటు మందులు వాడినా వ్యాధి నయం కాకపోతే దాన్ని మల్టీడ్రగ్ రెసిస్టెన్స్(ఎండీఆర్) టీబీగా గుర్తిస్తారు. వీరి గళ్ల నమూనాలను సేకరించి కర్నూలులోని పరీక్ష కేంద్రంలో సమగ్రమైన వ్యాధి నిర్దారణకు పంపుతారు. ఈ వ్యాధిగ్రస్తులకు రూ.2లక్షల ఖరీదైన మందులు రెండేళ్ల వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ పద్ధతిలో ఉచితంగా అందజేస్తారు. జిల్లాలో గత సంవత్సరం 1,305 మందికి ఎండీఆర్ నిర్ధారణ పరీక్ష చేయగా.. 140 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇందులో ప్రస్తుతం 122 మంది చికిత్స పొందుతున్నారు. అధికారుల లెక్కకు చిక్కని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఎక్స్రే యూనిట్లు లేక నిర్ధారణ కాని కేసులు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు, బనగానపల్లి ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల అందుబాటులో లేవు. ఈ ప్రాంతాల్లో కేవలం గళ్ల పరీక్షపైనే వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఈ కారణంగా వ్యాధి ఉండి నిర్ధారణ కాని రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండీఆర్ టీబీ కేసుల ద్వారా అధిక మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త వైరస్ల పేరు చెప్పి వచ్చే వ్యాధులకు ఇచ్చే ప్రాధాన్యత చాపకింద నీరులా విస్తరిస్తున్న క్షయను పట్టించుకోకపోవడం దారుణమని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


