breaking news
Maximum speed limit
-
ఓలా స్కూటర్... వామ్మో ఇంత స్పీడా !
హైదరాబాద్: ప్రీ బుకింగ్లో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఓలా మరో సారి మార్కెట్ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యధిక స్పీడ్తో రాబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ఓలా సీఈవో హింట్స్ ఓలా స్కూటర్ సీఈవో భవీశ్ అగర్వాల్ గత కొద్ది కాలంగా ఓలా స్కూటర్కి సంబధించిన కీలక సమాచారాన్ని ఒక్కొక్కటిగా సోలష్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా ఓలా స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న సంధించారు. కింద ఆప్ఫన్లుగా గంటకి 80 కి,మీ, 90 కి,మీ, 100కు పైగా కి,.మీలతో పాటు స్పీడ్తో పని లేదన్నట్టుగా నాలుగు ఆప్ఫన్లు ఇచ్చారు. ఈ పోల్లో సగం మంది వందకు పైగా స్పీడ్ కావాలంటూ సమాధానం ఇచ్చారు. అంచనాలకు మించి గతంలో ఓలా స్కూటర్ ఎన్ని రంగుల్లో వస్తే బాగుంటుందో చెప్పాలంటూ ప్రశ్నించారు భవీష్. దానికి సమాధానంగా 9 రంగుల్లో వస్తే బాగుంటుందని నెటిజన్లు సమాధానం ఇచ్చారు. అయితే వారి అంచనాలను మించి ఏకంగా 10 రంగుల్లో ఓలా స్కూటర్ని మార్కెట్లోకి తేబోతున్నట్టు ఆయన ప్రకటించారు. కచ్చితంగా వందకు పైనే ఓలాకు సంబంధించి కీలక అప్డేట్స్ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోన్న భవీష్ ఈసారి స్పీడ్కు సంబంధించిన విషయం బయట పెట్టారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా స్కూటర్ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం వందకు పైగా ఉండటం అనేది రికార్డేనని చెప్పుకుంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రపంచ రికార్డు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ బూమ్ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోలు ధరలతో క్రమంగా ఈవీలపైపు ప్రజలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్లోకి వస్తోన్న ఓలా ఆది నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. సరికొత్త పంథాలో మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మొదలైన ప్రీ బుకింగ్స్లో ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. What top speed would you want for the Ola Scooter? — Bhavish Aggarwal (@bhash) July 24, 2021 -
ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్
డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి : గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో కూడిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీచేసింది. డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరిగా ఉండాలని గరిష్ట వేగపరిమితి గంటకు 25 కిలోమీటర్లకు మించకూడదని అందులో పేర్కొంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం (16వ సవరణ) నిబంధనలు-14... ఈ బ్యాటరీ ఆధారిత ప్రత్యేక వాహనాలను నగరంలో నడుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ వాహనాల్లో కేవలం నగురు ప్రయాణికులనే ఎక్కించుకోవాల్సి ఉంటుంది.ఇక లగేజీ 40 కిలోల కు మించరాదు. ఈ వాహనం మోటారు సామర్థ్యం రెండు వేల వాట్లకు మించకూడదు. ప్రయాణికులకు దాదాపు ఇంటి దగ్గరదాకా చేరవేసేందుకు ఉద్దేశించిన ఈ వాహనాలు నగర రహదారులపై సంచరించేందుకు సవరించిన నిబంధనలను అనుమతిస్తున్నాయి. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషే ధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధిం చాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. సామగ్రి చేరవేతకే అనుమతి ఇక ఈ-కార్ట్లను సామగ్రి చేరవేతకే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ-కార్ట్లలో లోడు చేసిన సామగ్రి బరువు డ్రైవర్తో కలుపుకుని 310 కిలోలకు మించకూడదు. ఈ-రిక్షాలతోపాటు ఈ కార్ట్ల యజమానులు కూడా ఎట్టిపరిస్థితుల్లో నూ డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరి.