-
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
నిధులివ్వకపోవడంపై పీడీ అసంతప్తి
మర్రిపాడు : మండలంలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నప్పటికీ లబ్ధిదారులకు నిధులివ్వకపోవడంపై డ్వామా పీడీ హరిత అసంతప్తి వ్యక్తంచేశారు. మండల కేంద్రమైన మర్రిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీల రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఫారంపాండ్స్, ఇంకుడుగుంతలు, వర్మికంపోస్ట్లను రికార్డులన్నింటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే ఇవ్వాలని, ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. అధికమంది కూలీలకు పని కల్పించాలని సూచించారు. అనంతరం అనంతసాగరం మండలానికి చెందిన రికార్డులను కూడా పరిశీలించారు. ఆమె వెంట ఏపీడీ మదుల, ఎంపీడీఓ నాసర్రెడ్డి, ఏపీఓ లక్ష్మీనరసయ్య, పలువురు అధికారులు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మా భూములు అప్పగించండి
మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన దళితులు తమ భూములు తమకు అప్పగించాలని శుక్రవారం తహసీల్దారు సులోచనకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో భూపంపిణీ 6, 7 విడతల్లో ప్రభుత్వం తమకు భూములు మంజూరుచేసిందన్నారు. ఆ సమయంలో కొంతమందికి మాత్రమే పాసుపుస్తకాలు ఇచ్చారని చెప్పారు. పాసుపుస్తకాలు ఇచ్చినప్పటికీ పేదవారం కావడంతో భూములు సాగుచేసుకోలేకపోయామన్నారు. దీంతో బీడుగా వాటిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, రికార్డులను చూపించారు. ప్రస్తుతం సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనుల్లో భాగంగా భూములన్నీ మునకకు గురవుతున్నాయన్నారు. దీంతో వాటికి గిరాకీ ఏర్పడిందన్నారు. మరికొంతమంది భూములను రికార్డుల్లో అక్రమంగా మారుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి న్యాయం చేయకపోతే నిరాహారదీక్ష చేపడుతామన్నారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ భూముల విషయమై ఇప్పటికే ఆర్ఐ, వీఆర్వో ద్వారా విచారణ జరిపిస్తున్నామన్నారు. మిగిలిన భూములపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి భూములను అందచేస్తామని చెప్పారు. -
ఆస్పత్రికి పశువైద్యుడి డుమ్మా
చికిత్స అందక గొర్రె మతి వైద్యసేవలు అందండంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం శుక్రవారం ఉదయం మండలంలోని నందవరంలో ఉన్న పశువైద్యశాలకు గ్రామానికి చెందిన యర్రమళ్ల లక్ష్మీరెడ్డి తన గొర్రెపిల్లకు ఆరోగ్యం బాగోలేదని తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యుడులేడు. కేవలం కాంపౌండర్ మాత్రమే ఉన్నాడు. లక్ష్మీరెడ్డి గొర్రెపిల్లకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నయం చేయాలని కాంపౌడర్ను అడిగాడు. అతను డాక్టర్ను తాను కాదని నిర్లక్ష్యంగా సమాధామమిచ్చాడు. కొంత సమయం గడిచిన తర్వాత వైద్యం అందక గొర్రెపిల్ల మతిచెందింది. మర్రిపాడు : నందవరం పశువైద్యశాలలో వైద్యం సక్రమంగా అందడంలేదని చెప్పేందుకు పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.. గతంలోనూ మూగజీవాలకు సరిగ్గా వైద్యం అందక మతిచెందిన సంఘటనలున్నాయి. ఈ ఆస్పత్రి నుంచే అన్ని ప్రాంతాలకు వైద్యసేవలు అందాల్సి ఉంది. అయితే ఏనాడు కూడా పశువులకు సక్రమంగా వైద్యం అందకపోవడంతో పలుమార్లు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మండలం మారుమూల ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం చనిపోయిన గొర్రెపిల్లను పశువైద్యశాలలోనే ఉంచి కొంతమంది నిరసన తెలిపారు. జీవాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అలాంటి జీవాలు మతిచెందింతే ఏం తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మూగజీవాలకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement