breaking news
market panchangam
-
సెన్సెక్స్ నిరోధ శ్రేణి 27,345-27,570 పాయింట్లు
మార్కెట్ పంచాంగం భారత్ మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గిందన్న సంకేతాల్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) డెరివేటివ్స్ డేటా వెల్లడిస్తున్నది. చాలా నెలల తర్వాత మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్కు రోలోవర్స్ పరిమితంగా జరిగాయి. ఈ విభాగంలో చురుగ్గా వ్యవహరించే విదేశీ ఇన్వెస్టర్లు వారి పొజిషన్లను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. అయితే వారు లాంగ్ పొజిషన్లతో (పెరుగుతాయనే అంచనాలతో తీసుకునేవి) పాటు షార్ట్ పొజిషన్లను (తగ్గుతాయన్న అంచనాలతో తీసుకునేవి) కూడా తగ్గించుకున్నట్లు ఆ డేటా ద్వారా వెల్లడవుతోంది. కానీ ఇప్పటికే వారు భారత్ మార్కెట్లో భారీగా నగదు పెట్టుబడులు చేసివున్నందున, త్వరలో డెరివేటివ్స్ విభాగంలో కూడా వారు పొజిషన్లను పెంచుకోకతప్పదు. విదేశీ ఇన్వెస్టర్లు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకోబోయే పొజిషన్లకు అనుగుణంగా మార్కెట్ భారీగా పెరగవచ్చు. లేదా తీవ్రంగా పతనం కావొచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 26,897 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 427పాయింట్ల నష్టంతో 27,011 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ పెరిగిన కారణంగా ఈ వారం గ్యాప్అప్తో ఇక్కడి మార్కెట్ మొదలైతే 27,345 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 27,570 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ వారం సెన్సెక్స్కు 27,345-27,570 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తే వేగంగా 27,830 స్థాయికి పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే మరోదఫా 26,880 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున క్రమంగా 26,470 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధ శ్రేణి 8,270-8,335 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత శుక్రవారం 8,145 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, చివరకు 123 పాయింట్ల నష్టంతో 8,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్అప్తో ప్రారంభమైతే తొలుత 8,270 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,335 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ రెండు స్థాయిలూ...అంటే...8,270-8,335 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి ముఖ్యమైన అవరోధం. ఈ వారం ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే మరోదఫా 8,145 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,080 స్థాయికి క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 7,960 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. -
కీలక మద్దతు శ్రేణి 20,375-20,493
బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్టైమ్ గరిష్టస్థాయిని చేరగలిగినా, ఎన్ఎస్ఈ నిఫ్టీ తృటిలో ఆ ఛాన్స్ మిస్కావడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చే అంశం. సెన్సెక్స్కంటే అధికంగా ట్రేడయ్యే నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటితేనే బుల్ ట్రెండ్ బలపడే అవకాశం వుంటుంది. డెరివేటివ్ ట్రేడింగ్ పొజిషన్లు ఎక్కువగా వుండే ఈ సూచీ కొత్త రికార్డును సృష్టించివుంటే, మరిన్ని పెట్టుబడులురావడం, మరింత షార్ట్ కవరింగ్ జరగడం ద్వారా మొత్తంగా మార్కెట్ తీరే మారిపోయేది. అలాగే ఈ సూచీ ఆల్టైమ్ గరిష్టస్థాయికి చేరలేకపోతున్నదని పసిగట్టిన మరుక్షణమే అటు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఇటు బేర్స్ షార్టింగ్ కార్యకలాపాలు మొదలైపోతాయి. ఇప్పుడు జరుగుతున్నదదే. నిఫ్టీ 6,343 పాయింట్ల స్థాయి (2008 జనవరి 8నాటి రికార్డుస్థాయి 6,357 పాయింట్లు) నుంచి వెనుతిరిగినంతనే విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల స్పీడు తగ్గింది. ఆక్టోబర్ నెలలో రోజుకు సగటున రూ. 1,000-1,500 కోట్ల నికర పెట్టుబడులు జరిపిన ఎఫ్ఐఐలు గతవారం సగటు కొనుగోళ్లు రూ. 500 కోట్లకే పరిమితమయ్యాయి. దేశీయ సంస్థల అమ్మకాల వేగం పెరిగింది. గత నెలలో సగటున రూ. 500 కోట్ల నికర విక్రయాలు జరిపిన ఈ సంస్థలు క్రితంవారంలో అమ్మకాల్ని రూ. 800-900 కోట్లకు పెంచాయి. అమెరికా జీడీపీ అంచనాల్ని మించి పెరగడంతో అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపనపై మళ్లీ సందేహాలు తలెత్తడం మన మార్కెట్ తిరోగమనానికి కారణమని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నా, నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటి ఆపైన స్థిరపడలేకపోతే అప్ట్రెండ్ సాధ్యం కాదని మార్కెట్ టెక్నికల్ సెటప్ మొత్తం చెదిరిపోతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం. ఎందుకంటే 1995 నుంచి 2010 వరకూ ఇలా అంతక్రితపు గరిష్టస్థాయిని ఛేదించి, లేదా సమీపస్థాయికి వచ్చి సూచీలు 25-50 శాతం పతనమైన సందర్భాలు ఐదారు వున్నాయి. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే. సమీప భవిష్యత్తులో కీలకమైన మద్దతుస్థాయిల్ని స్టాక్ సూచీలు పరిరక్షించుకుంటూ గతవారపు నష్టాల నుంచి వేగంగా కోలుకోవాల్సివుంటుంది. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఇన్వెస్టర్ల అంచనాల్ని మించినందున, గత జూలై, ఆగస్టు నెలల తరహాలో ఫెడ్ ఉద్దీపన సాకుతో మార్కెట్లో అమ్మకాలు వేగవంతమైతే స్టాక్ సూచీలు పతనమయ్యే ప్రమాదం ఈ వారం పొంచివుంది. సెన్సెక్స్పై సాంకేతిక అంచనాలు నవంబర్ 8తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 573 పారుుంట్ల భారీ నష్టంతో 20,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా 14వ తేదీన సెలవు కారణంగా ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 20,375-20,493 పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే మద్దతు అత్యంత కీలకం. అక్టోబర్ 15-18 తేదీల మధ్య ఇదే శ్రేణి నుంచి అధిక ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ చేయడం ద్వారా సెన్సెక్స్ 21,321 పాయింట్ల వద్దకు చేరగలిగింది. ఇలాగే సూచీ రెండు వారాల కనిష్టస్థాయి కూడా ఈ శ్రేణిలోనే వున్నది. అక్టోబర్ నెలలో జరిగిన 2,057 పాయింట్ల ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి కూడా 20,500 సమీపంలోనే వున్నది. ఇటువంటి కీలక మద్దతును ఈ వారం కోల్పోతే వేగంగా 20,050 స్థాయి వద్దకు పతనం జరగవచ్చు. ఈ స్థాయిని కూడా నష్టపోతే 19,841 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన మద్దతు శ్రేణిని సెన్సెక్స్ పరిరక్షించుకంటే వేగంగా 21,140 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే మరోదఫా 21,320 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్ వుంటుంది. రానున్న వారాల్లో 22,498 స్థాయిని కూడా అందుకునే వీలుంటుంది. నిఫ్టీ మద్దతు శ్రేణి 6,032-6,080 గతవారపు అంచనాలకు భిన్నంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,357 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించలేకపోవడంతో నవంబర్8తో ముగిసిన వారంలో అంతక్రితంవారంతో పోలిస్తే 176 పారుుంట్ల భారీ నష్టంతో 6,140 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ జరిపినా, ఆ రోజు రాత్రి విదేశాల్లో ట్రేడయ్యే ఎస్జీఎక్స్ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది. ఈ ప్రభావంతో నిఫ్టీ గ్యాప్డౌన్తో మొదలైతే ప్రధాన మద్దతు 6,032-6,080 శ్రేణి మధ్య లభిస్తున్నది. ఈ మద్దతుశ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే వేగంగా 5,950 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 5,875 స్థాయికి పతనం కావొచ్చు. ఈ వారం ప్రధాన మద్దతుశ్రేణిని పరిరక్షించుకోగలిగితే వెనువెంటనే 6,280 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. ఆపైన స్థిరపడితే 6,357 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 6,550-6,600 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. - పి. సత్యప్రసాద్