-
తల్లిదండ్రుల సజీవదహనం.. కుమారుడూ మృతి
కృష్ణా: నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తల్లిదండ్రులను సజీవ దహనం చేసిన ఘటనలో గాయపడిన ఏడుకొండలు(35) అనే వ్యక్తి ఆదివారం మరణించాడు. ఈ నెల 11 తెల్లవారు జాము 2 గంటల సమయంలో ఆస్తి విషయమై తల్లిదండ్రులతో గొడవపడి పెట్రోలు పోసి చంపే ప్రయత్నంతో తాను కూడా గాయపడ్డాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు శోభనాచలం, మాణిక్యమ్మ మరణించగా.. గాయపడిన కుమారుడ్ని స్థానికులు నూజివీడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. (నూజివీడు) -
కన్నవారిపై కిరాతకం
నూజివీడు : ఆస్తి కోసం కొడుకే కిరాతకుడయ్యాడు. కన్నవారిని బతి కుండగానే నిప్పంటించి కడతేర్చాడు. సభ్యసమాజం నివ్వెరపోయేలా జరిగిన ఈ ఘాతుకానికి మండలంలోని పోతురెడ్డిపల్లి వేదికైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిల్లిముంతల శోభనాచలం (65), మాణిక్యమ్మ (55) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నలుగురికీ వివాహాలయ్యాయి. కొడుకు ఏడుకొండలు(35)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడుకొండలు వివాహ సమయంలో వారికి 10 ఎకరాల పొలం ఉండేది. పొగాకు వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రస్తుతం మూడెకరాలే మిగిలాయి. తండ్రీ కొడుకులిద్దరూ కొంతకాలం వరంగల్లో ఉండి వ్యాపారం చేశారు. ఆస్తి విషయంలో తరచూ వివాదాలు... తన ముగ్గురు కుమార్తెల వివాహ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం కట్నం కింద ఇస్తానని శోభనాచలం పేర్కొన్నారు. ప్రస్తుతం పొలం అంతా పోయి మూడెకరాలు మిగలడం, అదంతా తన అక్కలకు ఇచ్చేస్తాడనే అనుమానంతో తరచూ ఆస్తి విషయమై ఏడుకొండలు తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం వరకు నూజివీడు మండలం అన్నవరంలో ఉంటున్న ఏడుకొండలు ఆ తర్వాత తన తండ్రికి గుండె ఆపరేషన్ జరగడంతో భార్యాపిల్లలు సహా పోతురెడ్డిపల్లి వచ్చి నివసిస్తున్నాడు. తండ్రి ఒక పోర్షన్లో, కొడుకు మరో పోర్షన్లో ఉంటున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఇటీవల గొడవలు మరింత పెరిగాయి. దీంతో అద్దె ఇంటికి మారేందుకు శోభనాచలం దంపతులిద్దరూ మూడు రోజుల క్రితం ఇల్లు కోసం తిరిగారు. ఈ నేపథ్యంలో ఏడుకొండలు బుధవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో తన తల్లిదండ్రులు పడుకుని ఉన్న గదిలోకి కిటికీ గుండా పెట్రోలు పోసి అగ్గిపుల్ల వెలిగించి లోపలికి విసిరాడు. ఈ ఘటనలో శోభనాచాలం, మాణిక్యమ్మ కేకలు వేస్తూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఏడుకొండలు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వీరి కేకలు విన్న స్థానికులు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఏడుకొండలును ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ వీ సుబ్బరాజు, నూజివీడు రూరల్, పట్టణ, ముసునూరు ఎస్ఐలు సీహెచ్ నాగప్రసాద్, బోనం ఆదిప్రసాద్, విజయ్కుమార్లు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న ఏడుకొండలును, అతని భార్య రాజ్యలక్ష్మిని విచారించారు. మృతుల పెద్దకుమార్తె అయిన బెజవాడ వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఏడుకొండలు, రాజ్యలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. సీఐ వీ సుబ్బరాజు దర్యాప్తు చేస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలుగు ఓటర్లు కీలకం
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
డల్లాస్లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR
వాట్సప్లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement