-
టీడీపీకి షాక్ మీద షాక్లు!
కడప వైఎస్సార్ సర్కిల్/ఎమ్మిగనూరు టౌన్/రేణిగుంట(చిత్తూరు): ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజు రోజుకు ఆ పార్టీ నుంచి ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూ ఉంది. తాజాగా శనివారం కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సాయి ప్రతాప్ టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా కార్యదర్శి మురళీధర్నాయుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి దేవ స్థానం మాజీ చైర్మన్, టీడీపీ కీలక నేత కొం డుగారి శ్రీరామ్మూర్తి టీడీపీని వీడి వైఎస్సా ర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతోపాటు టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా చేరారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షం లో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. అవమానించారు: సాయిప్రతాప్ టీడీపీలో ఉన్న మూడు సంవత్సరాల కాలం అజ్ఞాతంగా, అరణ్యవాసంగా గడిపానని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజంపేటకు ఇన్చార్జ్గా ఉండమని చెప్పి, ఘోరంగా అవమానించారని చెప్పారు. అమరావతికి రమ్మని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావు మొహం తిప్పుకుని చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. టీడీపీలో డబ్బులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. సొంత ఇంటికి వచ్చా: మణిగాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీకి వెళ్లి పెద్ద తప్పు చేశానని కర్నూలు జిల్లా, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు. -
టీడీపీకి మరో షాక్.. వైఎస్సార్సీపీలోకి మణిగాంధీ
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మణిగాంధీకి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. కాగా ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్యనాయకులు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసెందే. టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు పట్ల పలువురు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫారుఖ్ వర్గాన్ని భూమా బ్రహ్మానంద రెడ్డి పట్టించుకోవడంలేదని ఆ వర్గ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం దశాబ్దాలుగా సేవచేస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి కనీస పిలుపు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మండల పరిధిలోని 15 గ్రామాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 15గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సమావేశమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు నచ్చకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు వాళ్ల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో పశ్చాత్తాపం
-
మణిగాంధీ రాజీనామాకు డిమాండ్
కోడుమూరు : సొంత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో చేరి కార్యకర్తల మధ్య విభేదాలు పెంచుతున్న ఎమ్మెల్యే మణిగాంధీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ కోడుమూరు మండల కన్వీనర్ కేఈ మల్లిఖార్జునగౌడ్ డిమాండ్ చేశాడు. కోడుమూరులో ఆదివారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో కార్యకర్తలను ఉద్దేశించి మల్లికార్జున గౌడ్ మాట్లాడారు. మణిగాంధీ రాజీనామా చేసి ఏ పార్టీ నుంచి పోటీచేసినా డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ కల్గిన తెలుగుదేశం పార్టీ నియమనిబంధనలు పాటించకుండా ఎమ్మెల్యే మణిగాంధీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను వదిలేసి ఇతర పార్టీ నేతలకు కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకుంటున్నాడన్నారు. -
ఎమ్మెల్యేకు రూ.8 కోట్ల ఆఫర్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ఏకంగా రూ. 8 కోట్ల ఆఫర్ మధ్యవర్తులుగా అధికార పార్టీ నేతలు టీడీపీ రాజకీయాలను ఈసడించుకుంటున్న ప్రజలు సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిదన్నుగా ఉన్న కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల కొనుగోలుకు అధికార పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కూడా కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారీగా ప్యాకేజీని ఆఫర్ చేసి మరీ టీడీపీలోకి చేర్చుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోడుమూరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అలాంటి చోట గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన మణిగాంధీకి ప్రజలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం.. అధినేత వైఎస్ జగన్పై ఉన్న అభిమానంతో గెలిచిన కోడుమూర ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక.. కేవలం నన్ను చూసే జనం ఓట్లేశారని చెప్పుకోవడంపై కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. మధ్యవర్తులుగా టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొద్దిమంది ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి మధ్యవర్తులు (దళారులు)గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా ఎమ్మెల్యేకు రూ. 9 కోట్లు ఇస్తే వస్తారంటూ... ఎమ్మెల్యేకు రూ 5-6 కోట్లు చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కోట్లు ఇచ్చేందుకు ఒప్పించిన ఓ నేత డీల్ కుదిర్చినందుకు తాను రూ. 3 కోట్లు దక్కించుకోవాలని ఎత్తుగడ వేశాడు. అయితే, ఈ కథ తెలిసి సదరు ఎమ్మెల్యే కాస్తా.. నేను పార్టీ మారను అంటూ మొండికేయడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు నేతను ఆయన సోదరుడు, మాజీ మంత్రి మందలించినట్లు తెలిసింది. ఇలాంటి చోటా కక్కుర్తి పడటం సరికాదని హెచ్చరించి.. సదరు ఎమ్మెల్యేతో మాట్లాడి రూ. 6 కోట్లకు ఒప్పందం కుదుర్చినట్లు సమాచారం. ఈ ముడుపుల వ్యవహారం అంతా గుంటూరుకు చెందిన నేతలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ నేతలు.. నిన్నమొన్నటి వరకు పార్టీ మారేది లేదు.. ప్రాణం పోయే వరకు పార్టీలోనే ఉంటామని.. ఇప్పుడు కేవలం డీల్ కోసమే పార్టీ మారడం పట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. అండగా ఉన్న వ్యక్తిని మోసగించి.. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని తన కుటుంబ సభ్యునిగా భావించి సహాయం అందించిన వ్యక్తిని, పార్టీని కాదని వెళ్లిపోవడం పట్ల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా విమర్శల పరంపర కొనసాగుతోంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మణిగాంధీ కుటుంబానికి వైఎస్ జగన్ ఎంతో సహాయం చేశారని, అలాంటి వ్యక్తిని మోసగించడం సబబు కాదని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఇక మణిగాంధీకి పుట్టగతులుండవని ప్రజలు మండిపడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement