breaking news
Malaysian man
-
భార్యతో బిజినెస్ ట్రిప్ అని చెప్పి..
ఇంట్లో భార్య ఉండగానే గాల్ఫ్రెండ్తో కలిసి థాయిలాండ్ టూరుకు వెళ్లిన ప్రబుద్ధుడొకరు ఊహించని రీతిలో దొరికిపోయాడు. భార్యతో బిజినెస్ టూర్ అని చెప్పి రహస్య స్నేహితురాలితో షికారుకెళ్లిన అతగాడిని అనూహ్యంగా ప్రకృతి పట్టించింది. ఏంటి నమ్మడం లేదా? అయితే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి.మలేసియాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన సహోద్యోగులతో కలిసి బిజినెస్ ట్రిప్ (business trip) వెళుతున్నట్టు భార్యతో చెప్పి థాయిలాండ్ వెళ్లాడు. దక్షిణ థాయిలాండ్లోని అతిపెద్ద నగరమైన హాట్ యాయ్కు వెళ్లినట్టు భార్యకు తెలిపాడు. కడుపుతో ఉన్న భార్యకు ఎప్పటికప్పుడు తన ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుండేవాడు. దీంతో ఆమెకు ఎటువంటి అనుమానం కలగలేదు. ఇక్కడి వరకు అంతా బాగానే మేనేజ్ చేశాడు. కానీ తర్వాత కథ అడ్డం తిరిగింది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.ఊహించని విధంగా భారీ వర్షాలు థాయిలాండ్ను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలతో దక్షిణ హాట్ యాయ్ నగరంతో పాటు 12 ప్రావిన్సులలో భారీ వరదలు సంభవించాయి. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న మలేసియా మహిళ ఒకరిని సదరు భర్తగారి భార్య సాయం కోసం అభ్యర్థించింది. వరదల్లో చిక్కుకున్న తన భర్తను కాపాడాలని కోరింది. అతడికి సంబంధించిన వివరాలు కూడా తెలిపింది. ఆమె అభ్యర్థనతో భర్తను కాపాడేందుకు అతడు బస చేసిన హోటల్కు వెళ్లిన మలేసియా మహిళకు వింత అనుభవం ఎదురైంది. మనోడు ఉన్నది సహోద్యోగులతో కాదని, గాల్ఫ్రెండ్తో అన్న విషయం బయటపడింది. నాలుగు రోజులుగా వారిద్దరూ ఒకే గదిలో ఉన్నట్టు గుర్తించారు. భార్యలూ జాగ్రత్త.. సదరు మహిళ ఈ విషయాన్ని అతడి భార్యకు చెప్పలేదు. ఎందుకంటే ఆమె గర్భిణి, పైగా తండ్రి రాకకోసం ఆమె ముగ్గురు పిల్లలు ఎదురు చూస్తున్నారు. తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా (Social Media) ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసింది. భర్తలను గుడ్డిగా నమ్మే భార్యలను అప్రమత్తం చేయడానికే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వివరించారామె. "జాగ్రత్తగా ఉండండి. మన భర్తలను గుడ్డిగా నమ్మవద్దు" అని ఆమె పేర్కొంది.చదవండి: 'ప్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'భార్యకు చెప్పాల్సిందే..ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో చర్చకు దారితీసింది. భర్త బాగోతం గురించి భార్యకు చెప్పాల్సిందేనని పలువురు నెటిజనులు కామెంట్ చేశారు. కొంతమంది మాత్రం.. భార్య కుటుంబ సభ్యుడికో, స్నేహితులకో తెలియజేయాలని సూచించారు. ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి చేయాలని మరికొందరు ఫైర్ అయ్యారు. చూడాలి మనోడి పరిస్థితి ఏంటో! -
626 లైంగిక నేరాలు.. 12,000 సంవత్సరాల జైలు!
కౌలాలంపూర్ : మలేషియాలో ఓ వ్యక్తిపై 600కు పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. అతడు చేసిన నేరానికి దాదాపు 12 వేల సంవత్సరాల జైలు పడనున్నట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇన్ని నేరాలు చేసింది కూడా అతడు ఒకరిపైనే. అది కూడా సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురుపైన. దర్యాప్తు అధికారులు నమోదు చేసిన 626 ఆరోపణలతో కూడిన ఈ మొత్తం చార్జీ షీట్లను కోర్టులో చదివేందుకు రెండు రోజుల సమయం పట్టింది. వివరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతడి వద్ద 15 ఏళ్ల కూతురు ఉంది. ఆమెపై అతడు లైంగిక వికృతక్రీడలు సాగించాడు. చెప్పవీలుకాని విధంగా ప్రవర్తించాడు. చాలా కాలంగా సాగిన అతడి రాక్షస క్రీడ చివరకు వెలుగులోకి చూడటంతో అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. దీంతో అతడిపై మొత్తం 626 చార్జీ షీట్లు పైల్ చేశారు. ఒక్కో నేరం కింద 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల జైలు శిక్షపడనుండగా మొత్తం 600కుపైగా కూతురుపై లైంగిక నేరాలకు పాల్పడిన అతడికి 12,000 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తిని అసలు బయట తిరగనివ్వకూడదని, ఏ మాత్రం క్షమించవద్దని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి యాంగ్ జరిదాను కోరారు. అతడికి ఎలాంటి బెయిల్, ఉపశమనం కలిగించొద్దని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. నేరం చేసిన ఆ వ్యక్తి పేరును మాత్రం బయటకు చెప్పలేదు. యువతి భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ వివరాలు గోప్యంగా ఉంచారు.


