Malabar Hill
-
మలబార్హిల్ ‘నైసర్గిక ఎలివేటెడ్’.. సూపర్! టూరిస్టుల రద్దీ
మలబార్ హిల్ ప్రాంతంలో నెల రోజుల కిందట ప్రారంభించిన ‘నైసర్గిక ఎలివేటెడ్ మార్గం’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం అనందాన్ని ఆస్వాదించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా లక్షకుపైనే చేరింది. పర్యాటకుల ఎంట్రీ టికెట్ల ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రూ.27 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. కొందరికి టెకెట్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లేదంటే ఈ ఆదాయం మరింత పెరిగేదనే బీఎంసీ వర్గాలు తెలిపాయి. రూ.30 కోట్ల వ్యయం శివసేన యువనేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే 2022లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ తరహాలో ‘ట్రీ టాప్ వాక్’ నిర్మించాలని సంకల్పించారు. ఆ మేరకు కమలా నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న మలబార్ హిల్లో నైసర్గిక ఎలివేటెడ్ మార్గం పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యాయి. అందు కు రూ.30 కోట్లు ఖర్చుచేసిన ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం గత నెల నుంచి వినియోగంలోకి వచి్చంది. ప్రారంభం నుంచి ఈ ఎలివేటెడ్ మార్గానికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించసాగింది. ట్రీ టాప్ వాక్ తరహాలో.. మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యానవనం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచ్చితంగా ఈ రెండు ఉద్యాన వనాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను మరింత ఉత్సాహపరిచాలనే ఉద్దేశంతో సింగపూర్లో ఉన్న ‘ట్రీ టాప్ వాక్’ తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. ఇలాంటి ఎలివేటెడ్ మార్గాన్ని ముంబైలో నిర్మించడం ఇదే ప్రథమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మార్గానికి వందలాది చెట్లు అడ్డువచ్చినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనంలోని వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అలాగే కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చర్నిరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్క్లెస్ (మెరైన్ డ్రైవ్) తదితర విహంగం ద్వారా దృశ్యాలను తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.25 వసూలు చేస్తున్న నైసర్గిక ఎలివేటెడ్ మార్గానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శని, ఆదివారాలైతే కిక్కిర్సిన జనాలు, పర్యాటకులు ఉంటున్నారు. టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్ముడు పోవడంతో ఆఫ్లైన్లో లభించడం లేదు. దీంతో అనేక మంది పర్యాటకులు నైసర్గిక ఎలివేటెడ్ మార్గం ద్వారా ప్రకృతి అందాలను తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు. -
సింగపూర్ ‘ట్రీ టాప్వాక్’ తరహాలో వాక్వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్లైన్లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్లైన్లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
కళ్లుచెదిరే ఖరీదు! 3 అపార్ట్మెంట్లు.. రూ.180 కోట్లు!
దేశంలో ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్కు పేరుగాంచిన ముంబైలో హై వ్యాల్యూ డీల్స్ బయటికొస్తూనే ఉన్నాయి. గోద్రేజ్ అగ్రోవెట్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్ తాజాగా ఇక్కడ మూడు ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. నగరంలోని మలబార్ హిల్లో ఆయన మూడు అపార్ట్మెంట్లను రూ.180 కోట్లకు కొనుగోలు చేసినట్లు లభించిన పత్రాలను బట్టి జాప్కీ పేర్కొంది.13,831 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ను చదరపు అడుగుకు రూ.1.3 లక్షల చొప్పున జేఎస్డబ్ల్యూ రియల్టీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. వివరాల ప్రకారం ఒక్కో అపార్ట్ మెంట్ 4,610 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో ఆరు, ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో ఉన్నాయి. జూన్ 12న విక్రయ ఒప్పందం కుదిరింది. గోద్రెజ్ ఒక్కో అపార్ట్ మెంట్ కు రూ.3.5 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తలు నివసించే మలబార్ హిల్ ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటి. దివంగత బిలియనీర్ స్టాక్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా నివాసం ఇక్కడే ఉంది. అరేబియా సముద్రం వ్యూ కోసం ఆమె గత మార్చిలో ఒక భవనంలోని దాదాపు అన్ని యూనిట్లను కొనుగోలు చేశారు. గత ఏడాది పరమ్ క్యాపిటల్ డైరెక్టర్ ఆశా ముకుల్ అగర్వాల్ ముంబైలోని లోధా మలబార్లో మూడు అపార్ట్మెంట్లను రూ.263 కోట్లకు కొనుగోలు చేశారు. -
ముంబైలో తొక్కిసలాట.. 18 మంది మృతి
66 మందికి గాయాలు.. సాక్షి, ముంబై: దావూదీ బోహ్రా ముస్లిం తెగ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ సయ్యద్నా మహ్మద్ బర్హనుద్దీన్ భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, 102 ఏళ్ల సయ్యద్నా శుక్రవారం గుండెపోటుతో ఇక్కడి మలబార్ హిల్ ప్రాంతంలో ఆయన ఇంటి (సైఫీ మహల్)లో కన్నుమూశారు. మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు కడసారి చూపుకోసం రాత్రి నుంచే ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలిరావడం మొదలుపెట్టారు. శనివారం తెల్లవారు జామున అంతిమ దర్శనం కొద్దిసేపు నిలిపేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్క సారిగా ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఇక్కడి వీధులన్నీ ఇరుకుగా ఉండడం, భారీగా జనం హాజరుకావడంతో ఊపిరాడక ఎక్కువమంది మరణించారని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. ఊపిరి అందకపోవడంతో కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. సమీపంలోని గేట్లు కూడా మూసివేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. సయ్యద్నా నివాసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి చేరువలోనే ఉంది. కాగా, గాయపడిన వారికి సైఫీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన అనంతరం ఉదయం 10 గంటల తర్వాత సయ్యద్నా అంతిమయాత్ర ప్రారంభమైంది. రెండు లక్షల మందికి పైగా ఆ యాత్రలో పాల్గొన్నారు. బెండీ బజార్లోని రౌదాత్ తహేరాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సయ్యద్నా మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. మతగురువే కాదు గొప్ప మానవతావాది! సాక్షి, ముంబై: మలబార్ హిల్లోని సైఫీ మహల్లో శుక్రవారం మృతిచెందిన బుర్హానుద్దీన్ కేవలం భోరా సామాజిక వర్గానికి చెందిన 52వ మతగురువు మాత్రమేకాదు అంతకు మించిన మానవతావాది కూడా. మూఢ నమ్మకాలను పారద్రోలి, విద్య ప్రాముఖ్యతను తెలియజేసి వెనుకబడిన భోరాల ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. 1912, మార్చి 6న సూరత్లో జన్మించిన ఆయన 15వ యేటనే హజ్ యాత్రకు వెళ్లారు. 1965లో భోరా సమాజానికి 52వ మతగురువుగా నియమితులయ్యారు. ఆయన వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2011 మార్చి 25న దేశవ్యాప్తంగా భారీ ఉత్సవాలు నిర్వహించారు. ఆయన నివాసముంటున్న ముంబైలో భారీగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆ సమాజం ప్రజలు, మతగురువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో భోరా సమాజం ప్రజలు పార్థనలు చేసుకునేందుకు అవసరమైన ప్రార్థనాస్థలాల ఏర్పాటుకు, సాంస్కృతిక కేంద్రాలు నెలకోల్పడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. ఆయన స్థాపించిన ప్రార్థనాస్థలాలు ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, అస్ట్రేలియా తదితర దేశాలలో ఇప్పటికీ ఉన్నాయి. మనదేశంలో కూడా ఎన్నో సదస్సులు నిర్వహించారు. అంతేకాక ముంబై, సూరత్, దుబాయ్, కరాచీ, కొలంబో తదితర దేశాల్లో సమావేశాలు, చర్చాగోష్టులు, అవగాహన శిబిరాలు నిర్వహించారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఆయనను ఆర్డర్ ఆఫ్ దస్టార్ ఆఫ్ జర్డన్, అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీ డాక్టరేట్ తో, డాక్టర్ ఆఫ్ ఇస్లామిక్ సైన్స్, టెక్సాస్ యూనివర్సిటీ, కరాచీ యూనివర్సిటీ చాన్స్లర్ పదవులతో సన్మానించాయి. లండన్లోని రాయల్ అల్బర్ట్ హాల్లో ప్రసంగించిన ఘనత కూడా ఆయనకు దక్కింది.