breaking news
Majority of the votes
-
భాగ్యనగరంలో భార్యా బాధితుల సంఘం
మెన్టోన్ పురుషులలో అత్యంత అరుదైన పుణ్యపురుషులని మినహాయించేస్తే, మిగిలిన మగాళ్లందరూ బేసిగ్గా కష్టజీవులు. కష్టజీవుల్లో అత్యధికులు నష్టజాతకులు. వివక్షాపూరిత సమాజం విసిరే నింద నిష్ఠురాలను భరించే పాపాల భైరవులు! సంసార భవసాగరంలో నిండా మునిగిపోయి, నానిపోయి, చివికిపోయి, చివరకు ఛిద్రమయ్యేవి మగబతుకులే! మగపుట్టుక పగవాళ్లకు కూడా వద్దురా అని దేవుడిని బహిరంగ రహస్యంగా ప్రార్థించే స్థాయిలో ఉంటాయి ‘మగా’నుభావుల కష్టాలు. ఇవేవీ లోకం కళ్లకు కనిపించవు. కనిపించినా, లోకం కాసేపు లౌక్యంగా కళ్లుమూసుకుంటుంది. మగాడెవడైనా కష్టాలు చెప్పుకుందామనుకున్నా, సాటి మగాడి కష్టాలను సానుభూతితో వింటే, సమాజంలో ఉన్న ‘మహిళా పక్షపాతి’ బిరుదుకు భంగం కలుగుతుందనే బెంగ కొందరిదైతే, ఇంట్లో ఇల్లాళ్లతో ప్రైవేటు చెప్పించుకునే పరిస్థితి తలెత్తే ప్రమాదాలుంటాయనే భయం మరికొందరిది. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, మన సమాజంలో మగాడి కష్టాలను వినడానికి సాటి మగాళ్లకు ఓపిక, సానుభూతి మాత్రమే కాదు, ధైర్యసాహసాలూ కావాలి. మహిళా పక్షపాత సమాజంలో అలాంటి సాహసవంతులైన మగాళ్లు చాలా అరుదు. ఇంతటి అరుదైన పరిస్థితుల్లో అత్యంత అరుదైన దుస్సాహసానికి ఒడిగట్టారు కొందరు ‘మగా’నుభావులు. సగటు మగాళ్లు కలలోనైనా ఊహించలేని రీతిలో భాగ్యనగరంలో భార్యా బాధితుల సంఘాన్ని ప్రారంభించారు. న్యూ ఇయర్ కేలండర్ కూడా విడుదల చేశారు. ఈ సంఘం ఫేస్బుక్లో పేజీ తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే భార్యా బాధితుల నుంచి ఏకంగా 175 ఫోన్కాల్స్ వచ్చాయి. తమ భార్యలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారనేదే మెజారిటీ బాధితుల ఫిర్యాదు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. పేరు మార్చుకోవాలంటూ ఈ సంఘానికి మహిళా సంఘాల నుంచి బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఇదేం విడ్డూరం చెప్మా! -
పసుపు పొత్తు..కమలం చిత్తు
జిల్లాలో బీజేపీకి దారుణ ఫలితాలు డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు.. రెండు స్థానాల్లో లాభపడ్డ టీడీపీ అయోమయంలో కమలనాథులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీని నిండా ముంచింది. తెలంగాణ వ్యతిరేకత వైఖరితో ఉన్న టీడీపీతో పొత్తు వల్ల ఉద్యమ ఫలితాలు కమలదళానికి ఏ మాత్రం దక్కలేదు. బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినా... ఉన్నత స్థాయిలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తీసుకున్న నిర్ణయం కాషాయ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నరేంద్రమోడీ హవాతో దేశవ్యాప్తంగా ఏకపక్షంగా వచ్చిన ఫలితాలకు జిల్లాలోని ఫలితాలకు ఎక్కడా పొంతన లేకుండాపోయింది. బీజేపీ అనుకూల పవనాల్లో కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసిన అ భ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా పోయూరుు. టీడీపీ తో పొత్తు వల్లే బీజేపీకి జిల్లాలో ఇలాంటి దుస్థితి వచ్చిందని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలను చిత్తుచేసిన పరిస్థితుల్లోనే జిల్లాలో దారుణ పరాజయం వస్తే... కోలుకునేది ఎలా అని ఆందోళన పడుతున్నారు. టీడీపీతో పొత్తుతో తాము నష్టపోగా.. ఇదే సమయంలో తమతో కలవడం తో టీడీపీ లాభపడిందని బీజేపీ నేతలు అంటున్నారు. పరకాలలో టీడీపీ విజయం దక్కడం బీజేపీ సహకారంతోనే జరిగిందంటున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలను పరిశీలించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ మాత్రం లాభపడింది... బీజేపీతో పొత్తుతో టీడీపీ మాత్రం జిల్లాలో లాభపడిం ది. పరకాల నియోజకవర్గంలో బీజేపీకి మొదటి నుంచి గణనీయ సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది. ఈ పార్టీ ఇక్కడ గతంలో పలుసార్లు గెలిచిన సందర్భాలు ఉన్నా యి. తాజా ఎన్నికల్లో ఈ సీటు టీడీపీకి ఇవ్వడంతో బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించింది. పరకాల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ విజయచందర్రెడ్డి, టీడీపీ అభ్యర్థి ధర్మారెడ్డితో కలిసి ప్రచారం చేశారు. అన్ని స్థాయిల్లో బీజేపీ శ్రేణుల సహకారంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధిం చారని కమలం పార్టీ నేతలు అంటున్నారు. పాలకుర్తిలో బీజేపీకి ఉన్న స్వల్ప ఓటు బ్యాంకుతోనే అక్కడ టీడీపీ అభ్యర్థి దయాకర్రావు గెలిచారని, ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లు తమ పార్టీవేనని చెబుతున్నా రు. తమకు ఓటు బ్యాంకు లేని నియోజకవర్గాల్లో టీడీ పీ ఓడిపోయిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలుండగా... బీజేపీ జనగామ, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి అసెంబ్లీ, వరంగల్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. జనగామ అసెంబీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్సభ స్థానంలోనూ బరిలో దిగింది. వర్ధన్నపేట మినహా అన్ని మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అనుకూల పరిస్థితు లు వచ్చాయి. టీడీపీతో పొత్తు వల్ల ఇది మారిపోయిం ది. టీడీపీ సహకారం లేకపోవడంతో ఈ రెండు స్థానా ల్లో బీజేపీ అభ్యర్థులు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలోనూ బీజేపీ సంప్రదాయ ఓట్లే ఈ పార్టీ అభ్యర్థులకు రాగా, టీడీపీ నుంచి ఏ మా త్రం ఓట్లు రాలేదు. గతంలో బీజేపీ ప్రాతినిథ్యం వహించిన వరంగల్ పశ్చిమలో ఈ పార్టీ అభ్యర్థి ఎం.ధర్మారావుకు కేవలం 18,584 ఓట్లు మాత్రమే వచ్చాయి. వరంగల్ తూర్పులో 11,639 ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థికి పోలయ్యాయి. జనగామలో బీజేపీ కంటే టీడీపీకి సంప్రదాయంగా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపిన బీ జేపీ, టీడీపీ పొత్తుతో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిం ది. గత ఎన్నికల గణాంకాలతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నే పోటీ ఉంటుందని కమలనాథులు అంచనా వేశారు. టీఆర్ఎస్ అనుకూల పవనాలకు తోడు టీడీపీ సహకారం లేకపోవడంతో ఇక్కడి బీజేపీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి 21,113 ఓట్లే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినట్లుగా చేసి టీడీపీ నేతను బరిలో దించిన భూపాలపల్లిలో మాత్రం టీడీపీ శ్రేణులు బాగానే సహకరించి నట్లు స్పష్టమవుతోంది. నామినేషన్ల తుదిగడువు వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, 57,530ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ కంటే 360 ఓట్లు తక్కువ వచ్చాయి. లోక్సభ స్థానాల్లో.. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కని పిం చింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీకీ గణనీయ సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఇక్కడ పార్టీ ఎంపీ ప్రాతినిథ్యం వహించారు. నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా ఉన్న అనుకూల పరిస్థితి ఉన్న నే పథ్యంలో ఈ స్థానంలో బీజేపీ ప్రధాన పోటీలో ఉండా లి. కానీ... ఇది జరగలేదు. బీజేపీ అభ్యర్థి రామగల్ల పరమేశ్వర్కు ఇక్కడ 1,87,139 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ బీజేపీ ఓట్లు మాత్రమేనని, టీడీపీ వారు సహకరించలేదని కమలనాథులు చెబుతున్నారు. -
క్రాస్ ఓటింగ్తో కుదేలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ ఓట్లను కైవసం చేసుకుని అన్ని పార్టీల కంటే ముందువరుసలో నిలిచింది. అటు జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించగా, ఇటు మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లోనూ హవా చూపింది. అయితే అన్ని పార్టీలకు క్రాస్ ఓటింగ్ నమోదు కావడంతో సీట్ల సంఖ్యలో భారీ తేడాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా జిల్లా పరిషత్తోపాటు 14 మండల పరిషత్లలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రధానంగా ఎంపీటీసీ కోటాలోనే ఓట్లు క్రాస్ కావడంతో మండల పరిషత్ కుర్చీలు కైవసం చేసుకోవడంలో ఆయా పార్టీలు విఫల మయ్యాయి. రెండు కేటగిరీల ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీ కోటా లో 16,266 ఓట్లు క్రాస్ అయ్యాయి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఎంపీటీసీ కోటాలో 36,329 ఓట్లు, టీడీపీకి 43,057 ఓట్లు క్రాసయ్యాయి. బీజేపీకి ఎంపీటీసీ కోటాలో 7523 ఓట్లు క్రాసయ్యాయి. ఓటరు వేసే రెండు ఓట్లు ఒకే పార్టీకి పోల్ అయితే హంగ్ సమస్య తలెత్తేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంగళవారం నాటి ఫలితాలను ఒకసారి గమనిస్తే...33 మండలాల్లోని ప్రాదేశిక స్థానాలకు సంబంధించి అధికంగా కాంగ్రెస్ పార్టీ 219 సీట్లు గెలుచుకుంది. అదే తరహాలో 14 జెడ్పీటీసీలను గెలుచుకుంది. అయితే రెండోస్థానంలో ఉన్న టీఆర్ఎస్ 145 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా, 12 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మూడో స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. టీడీపీ 129 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాల్లో విజేతగా నిలిచింది. బీజేపీకి జిల్లా పరిషత్ స్థానాన్ని గెలుచుకోనప్పటికీ ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చింది. 52 ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి పలు మండల పరిషత్లో కీలకంగా మారింది.