breaking news
maisamma
-
అమ్మోరికి కృతజ్ఞత చెప్పడమే!
మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మతో సహా అనేక ప్రాంతీయ పేర్లు కలిగిన దేవత మహాకాళి. ఈ దేవతకు తెలంగాణలో ఆషాఢ మాసమంతా ప్రజలు పండుగ చేసి బోనాలు ఎత్తుతారు. బోనం ఎత్తడమంటే అమ్మోరికి కృతజ్ఞతను తెలుపు కోవడమే! బోనాల మూలాలు 19వ శతాబ్దం నాటివి. ఆ సమయంలో వినాశ కరమైన ప్లేగు వ్యాధి జంట నగరాలను తాకింది. 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక బెటాలియన్ ఈ అంటువ్యాధి నుండి ఉపశమనం కోసం మహాకాళి ఆల యంలో దేవిని ప్రార్థించింది. ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టగానే, బెటాలియన్ తిరిగి వచ్చి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని నిర్మించి, బోనాలను సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు మూల స్తంభంగా మారింది. 2014లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది. ఈ పండుగకు పౌరాణిక ప్రాముఖ్యం కూడా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మహాకాళి దేవత తన తల్లిదండ్రుల ఇంటికి వార్షిక ఆగమనాన్ని సూచిస్తుంది. భక్తులు ఆమెను నైవేద్యాలతో స్వాగతిస్తారు. ఇది వివాహిత కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు ఆమెను లాలించడం లాంటిది. వేప ఆకులు, పసుపు, కుంకుమ, వెలిగించిన దీపం వంటివాటితో అలంకరించబడిన కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలలో బియ్యం, పాలు బెల్లం కలిపి వండిన పవిత్ర భోజనమే... బోనం! మహిళలు ఈ బోనాలను తలపై పెట్టుకుని దేవాలయాలకు తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్మిస్తారు. ఇలా బోనాలు తీసుకువెళ్లే ఊరేగింపుకు పోతరాజు నాయ కత్వం వహిస్తాడు. బోనాల పండుగను ఒక మతపరమైన పండుగ కన్నా ఎక్కువే అనాలి. కుటుంబాలు బోనం నైవేద్యాన్ని పంచుకుంటాయి. దాని తర్వాత మాంసాహార విందు, ఈత లేదా తాటి కల్లు సేవిస్తారు. వీధులు వేప ఆకులతో అలంకరించబడి జానపద పాటల గాలిని నింపుతాయి. కొన్ని ప్రాంతాలు ఆషాఢంలో కాకుండా శ్రావణంలో బోనాల పండుగ జరుపుకొంటాయి. ఆంధ్రప్రాంతంలో గ్రామ దేవతలకు ఆషాఢ, శ్రావణాల్లో కొలుపులు చేయడం బోనాల పండుగను పోలి ఉంటుంది.– డా.జి. వెన్నెల గద్దర్ చైర్పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి -
వైభవంగా ఘటాల ఊరేగింపు
చార్మినార్/ చాంద్రాయణగుట్ట: డప్పుల వాయిద్యాలు.. యువకుల నృత్యాలు.. కళాకారుల ప్రదర్శన.. విచిత్ర వేషధారణలతో పాతబస్తీలో శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు వైభవంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన అక్కన్నమాదన్న దేవాలయ ఘటం సాయంత్రం 5.10 గంటలకు హిమ్మత్పురా చౌరస్తాకు చేరుకోగా.. దానిని అనుసరిస్తూ మిగతా ఊరేగింపు కదిలింది. సకాలంలో ఘటాల ఊరేగింపు ముగియడంతో పోలీసులు, ఉత్సవాల నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. ఊరేగింపు సాగిందిలా.. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్దర్వాజా సింహ వాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహాల్, గౌలిపురా, సుల్తాన్షాహి, హరిబౌలిల ఘటాలు లాల్దర్వాజా మోడ్కు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు శాలిబండ, హిమ్మత్పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్హౌజ్ల మీదుగా నయాపూల్ మూసి నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీ మహాంకాళి అమ్మవారి ఘటం కోట్ల అలీజా, సర్దార్మహాల్ ద్వారా చార్మినార్ చేరుకొని ఊరేగింపులో కలిసింది. వెల్లివిరిసిన మతసామరస్యం పాతబస్తీలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఘటాల ఊరేగింపు సందర్భంగా రంజాన్ మార్కెట్ మూసేసి ముస్లిం సోదరులు హిందువులకు సహకరించగా.. ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం రాత్రి కొద్ది సేపు ఘటాల ఊరేగింపును హిమ్మత్పురా చౌరస్తా వద్ద నిలిపివేసి హిందువులు స్నేహా భావాన్ని చాటుకున్నారు. మక్కా మసీదులో రాత్రి ఇఫ్తార్ అనంతరం నిర్వహించిన మగ్రీబ్ నమాజ్ ప్రార్థనలు ముగిసిన వెంటనే తిరిగి ఊరేగింపు ప్రారంభించి... ముస్లింలు తిరిగి రాత్రి 8.30 గంటలకు మక్కా మసీదులో నిర్వహించే ఇషాకి నమాజ్ ప్రారంభం లోపే (8 గంటలకు) చార్మినార్ కట్టడాన్ని దాటేసారు. ఇలా ఉత్సవాల సందర్భంగా ఇరువర్గాల ప్రజలు సహకరించుకున్నారు. -
సందడే..సందడి!
కడ్తాల: ఆమనగల్లు మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం వర కు అక్కడే కాలక్షేపం చేసి..ఆనందోత్సహాలతో గడిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలునాయక్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడే ఏర్పాటుచేసిన విందులో టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. వారికి ఆలయ ఈఓ రంగారెడ్డి, ఫౌండర్ట్రస్టీ శిరోలీ, గ్రామ సర్పంచ్ శేఖర్గౌడ్, యాదగిరిగౌడ్ స్వాగతం పలికారు. -
మైసమ్మ అర్చకుల జీవితాలపై బతుకుచిత్రం