breaking news
Mahindra University
-
మహీంద్ర వర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ జట్టు
అలైడ్ హెల్త్ సైన్సెస్లో బ్యాచిలర్స్ కోర్సు ప్రారంభించే దిశగా హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ మొదలైన స్పెషలైజేషన్స్పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి పెడుతుంది.బోధనకు సంబంధించి మహీంద్రా వర్సిటీకి చెందిన ఆధునిక మౌలిక సదుపాయాలు, క్లినికల్ నైపుణ్యాల్లో అపోలో హెల్త్కేర్ అకాడెమీ అనుభవంతో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని ఇరు సంస్థలు తెలిపాయి. ఆఖరు సంవత్సరంలో ఇంటర్న్షిప్తో పాటు అపోలో హాస్పిటల్స్, భాగస్వామ్య నెట్వర్క్లలో ప్లేస్మెంట్పరంగా కూడా మద్దతు లభిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
మహీంద్ర యూనివర్శిటీ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
మట్టిగాజులు.. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు.. డ్రగ్స్ కేసులో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మధ్యలో హెరాయిన్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మట్టి గాజుల మాటున కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 10 కొరియర్ సంస్థల నుండి రెండేళ్లలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించినట్టు పోలీసులు గుర్తించారు.కొరియర్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు గం జాయి రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీం రట్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ గంజాయి చేరవేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.జీడిమెట్లలోని సూరారంలో శివాలయం కాలనీలో నిర్వహించిన ఆపరేషన్లో ఈ డ్రగ్ రాకెట్లో కీలకంగా పనిచే స్తున్న నలుగురిని అరెస్టు చేసి.. 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. ఓ నైజీరియన్ తన నెట్వర్క్ ద్వారా ఢిల్లీ, బీదర్ నుంచి పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్ను హైదరాబాద్ కు చేరవేడయంతో పాటు స్థానికంగా ఉన్న పెడ్లర్ల ద్వారా మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.ఈ ఆపరేషన్లో మణిపూర్కు చెందిన నెవెల్ టాంగ్ బ్రామ్తో పాటు అంబటి గణేశ్, బూసా శివకుమార్, మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ను అరెస్టు చేశారు. యూనివర్సిటీకి చెందిన 14 మం ది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మల్నాడు రెస్టారెంట్ కేసులో లింకులతో.. మల్నాడు రెస్టారెంట్ కేసు విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన శ్రీమారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేష్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ పేరిట రెండు పార్సిళ్లు డీటీడీసీ కొరియర్ సంస్థ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. ఆ పార్సిళ్లపై ఉన్న మొబైల్ నంబర్లు భారతీయ మొబైల్ నంబర్లుగానే ఉన్నా.. నైజీరియా నుంచి నిక్ అనే వ్యక్తి వాడుతున్నట్లు తేలింది. -
డ్రగ్స్ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి మహీంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి తాజాగా స్పందించారు.మహేంద్రా యూనివర్సిటీలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాలను గౌరవించే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని తెలిపారాయన. ఇటీవల నగరవ్యాప్తంగా జరుగుతున్న మత్తు పదార్థాలకు సంబంధించిన దర్యాప్తులో కొంతమంది విద్యార్థుల పేర్లు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ‘‘మత్తు పదార్థాల వినియోగం, పంపిణీ చేయడాన్ని ఖండిస్తున్నాం. మహీంద్రా యూనివర్సిటీలో చట్టాన్ని ఉల్లంఘించే లేదంటే విద్యార్థుల శ్రేయస్సును హానిచేసే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదు. .. నియమాలను ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే, విశ్వవిద్యాలయ నిబంధనలు, చట్టప్రకారం కఠినమైన శిక్షలు తప్పవు’’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో 50 మందిని పోలీసులు విచారించారన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. డ్రగ్స్ ఆరోపణలతో 50 మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించిన మాట వాస్తవమేనని, అందులో ఏడుగురు మాత్రమే మహీంద్రా వర్సిటీకి చెందిన వాళ్లు ఉన్నారని స్పష్టత ఇచ్చారాయన. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందేలా సురక్షితమైన, నిబద్ధతతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించేందుకు మహీంద్రా యూనివర్సిటీ తరఫున మేము కృషి చేస్తున్నాం. ఒక ఉన్నత విద్యాసంస్థగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకుని, మహేంద్రా యూనివర్సిటీ విలువలను కాపాడాలి అని విజ్ఞప్తి చేశారాయన.