madhurapudi airport
-
రాజమండ్రిలో మధురపూడి ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్
-
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
నేటి నుంచి బెంగళూరుకు విమానం
మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులు నిర్వహించనుంది. 6ఈ7231 నెంబర్ గల ఈ సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.35 గంటలకు బెంగళూరులో బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. 6ఈ7232 నెంబర్ గల సర్వీసు సాయంత్రం 6.00 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు పయనమవుతుంది. ఉదయం 9.25 గంటలకు, రాత్రి 9.15 గంటలకు ఉన్న హైదరాబాద్ సర్వీసులు యథాతథంగానే కొనసాగుతాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్ ఆగస్టు 20వ తేదీ వరకూ ఇదేవిధంగా కొనసాగుతాయి. -
జననేతకు ఘన స్వాగతం
‘పశ్చిమ’ వెళ్లేందుకు విమానంలో వచ్చిన జగన్ మధురపూడికి పోటెత్తిన జనసందోహం మధురపూడి (రాజానగరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధురపూడి విమానాశ్రయంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం ఆయన ఆదివారం మ«ధ్యాహ్నం 2.30 గంటలకు జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. జననేతకు స్వాగతం పలికేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జగ¯ŒSకు స్వాగతం పలికినవారిలో ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి నిర్మలకుమారి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్, కో ఆర్డినేటర్లు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రఘురామ్, కర్రి పాపారాయుడు, గుత్తుల సాయి, మిండగుదిటి మోహన్, గుర్రం గౌతమ్, చెల్లుబోయిన శ్రీను, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్మోహ¯ŒSరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజుబాబు, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ నాయకులు అడపా శ్రీహరి, సుంకర చిన్ని, వాసిరెడ్డి జమీలు, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు సాయిబాల పద్మ, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, పొట్టు సత్యనారాయణ, బండి అబ్బులు, కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. అడ్డుకున్న పోలీసులు జగ¯ŒSను చూసేందుకు వచ్చిన జనసందోహానికి పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. టెర్మినల్ భవనం లోపలికి వెళ్లేందుకు తమకు అనుమతివ్వకపోవడంపై, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్జో¯ŒS డీఎస్పీ ప్రసన్నకుమార్ను కురసాల కన్నబాబు నిలదీశారు. దీంతో ప్రధాన నాయకులకు అనుమతులు ఇచ్చారు. తరువాత కొల్లి నిర్మలాకుమారి తదితరులను అనుమతించకపోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ నిర్మలాకుమారిని అనుమతించలేదు. మెయి¯ŒSగేటు వద్దనే వాహనాలను నిలిపేశారు. దీంతో, అక్కడినుంచే అందరూ నడుచుకుంటూ టెర్మినల్కు చేరుకున్నారు. జగ¯ŒSను చూసేందుకు వచ్చిన అభిమానులు మెయి¯ŒS గేటు వద్దనే ఉండిపోయారు. -
నేడు, రేపు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు ఎయిర్పోర్టుకు జగన్మోహన్రెడ్డి రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లాకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్పోర్టుకు సాయంత్రం వస్తున్నారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సోమవారం వెల్లడించారు. -
మధురపూడిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తణుకు వెళతారు. రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు ఇచ్చి చివరకు వారిని ఘోరంగా వంచించిన చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేపడుతున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై బాబు సమాలోచన!
‘పశ్చిమ’కు వెళుతూ మధురపూడిలో ఆగిన సీఎం ఎన్నికల సమన్వయకర్తగా ఉప ముఖ్యమంత్రి రాజప్ప! సాక్షి, రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధురపూడి విమానాశయంలో ఆదివారం ఉదయం కొద్దిసేపు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచన జరిపినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ప్రారంభానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 10.25 గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 10.40 గంటలకు హెలికాప్టర్లో వేలివెన్ను వెళ్లారు. ఆయనకు విమానాశ్రయంలో జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ చైతన్యరాజు, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, ఇతర నేతలు ముఖ్యమంత్రిని విమానాశ్రయం లోపల కలుసుకున్నారు. వారితో చంద్రబాబు 15 నిముషాల పాటు మాట్లాడారు. తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలను ఆరా తీశారు. గతంలో ఉన్న ఓట్లు, ఇప్పుడు పెరిగిన ఓట్లు, గతంలో చైతన్యరాజుకు పోలయిన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సమన్వయకర్తగా వ్యవహరించాలని చినరాజప్పను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై మాట్లాడేందుకు సోమవారం నిడదవోలు రావాల్సిందిగా ముఖ్య నేతలను చంద్రబాబు ఆహ్వానించారు. విమానాశయం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన అధికారుల్లో జేసీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ హరికృష్ణ, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు తదిత రులున్నారు. పల్లెల అభివృద్ధికే ‘స్మార్ట్ విలేజ్’ : చినరాజప్ప రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పల్లెలను స్మార్ట్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ముఖ్యమంత్రి వేలివెన్ను బయల్దేరాక ఆయన విమానాశ్రయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పిలుపు స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి తమ నేత పూనుకున్నారన్నారు. తాను పెద్దాపురం మండలం జె.తిమ్మాపురాన్ని దత్తత తీసుకున్నానని, జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని స్మార్ట్ పల్లెలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ జరుగుతోందని చెప్పారు. అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి పారిశుద్ధ్యం, విద్యాభివృద్ధి, రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. గ్రామాల ప్రజలు, ఎన్ఆర్ఐలు సహకరించాలని పిలుపునిచ్చారు. దివంగత నేత ఎన్టీ రామారావు పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధికి పాటు పడ్డారని, ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకుంటున్నామని చెప్పారు. విమానాశ్రయంలో భారీ పోలీసు బందోబస్తు కోరుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో మధురపూడి విమానాశ్రయం వద్ద, పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. విమానం దిగి, తిరిగి హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే లోగా సీఎం జిల్లానేతలతో భేటీ అయ్యారు. -
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
-
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
హుదూద్ తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం దెబ్బతినడంతో ఒక్కసారిగా రాజమండ్రి సమీపంలో ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరిగిపోయాయి. దాంతో గిరాకీ పెరిగిందని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు టికెట్ ఉన్నట్టుండి 17 వేల రూపాయలు చేసేశారు. మామూలు రోజుల్లో అయితే ఈ ఛార్జి కేవలం 3,500 రూపాయలు మాత్రమే. సాధారణంగా ఏవైనా పండుగ సీజన్లు వచ్చినా, ప్రయాణం తేదీ బాగా దగ్గర పడినా. విమాన ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైనమిక్ ఫేర్ సిస్టం అంటారు. కానీ.. ఒక విమానాశ్రయం పనిచేయకపోవడం వల్ల ఇలా జరగడం మాత్రం ఇదే మొదటిసారి. విశాఖ నుంచి వెళ్లాల్సిన వాళ్లు కూడా అక్కడినుంచి రోడ్డు/రైలు మార్గాల్లో మధురపూడి చేరుకుని, ఇక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. -
జగన్కు ఘనంగా వీడ్కోలు
మధురపూడి, న్యూస్లైన్ :జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం మధురపూడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం 10 గంటలకు జగన్ ప్రత్యే క విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లు విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు చెప్పారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బా యి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిని పే విశ్వరూప్, తాజామాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర మహిళావిభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, ీ సజీసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నర్సాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెం ట్ నియోజకవర్గాల నేతలు రఘురామకృష్ణం రాజు, చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణచౌదరి విమానాశ్రయంలో జగన్ను కలసి వీడ్కోలు పలికారు. వివిధ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, మిండగుదిటి మోహ న్, విపర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, బొమ్మన రాజ్కుమార్, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, మట్టా శైలజ, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, కాకినాడ కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ ట్రేడ్యూనియన్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ములగాడ ఫణి, రావి పాటి రామచంద్రరావు, జక్కంపూడి రాజా, భూపతిరాజు సుదర్శనబాబు, చోడిశెట్టి రాఘవబా బు, నక్కా రాజబాబు, మార్గన గంగాధర్, చింతపల్లి చంద్రం, మేడిశెట్టి శివరాం, గణేశుల పోసియ్య, రాయపురెడ్డి చిన్నా వీడ్కో లు పలికారు. కాగా అంతకుముందు కాకినాడ లో తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి నివాసంలో జగన్ను పలువురు నేతలు కలుసుకున్నారు.