-
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
నేటి నుంచి బెంగళూరుకు విమానం
మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులు నిర్వహించనుంది. 6ఈ7231 నెంబర్ గల ఈ సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.35 గంటలకు బెంగళూరులో బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. 6ఈ7232 నెంబర్ గల సర్వీసు సాయంత్రం 6.00 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు పయనమవుతుంది. ఉదయం 9.25 గంటలకు, రాత్రి 9.15 గంటలకు ఉన్న హైదరాబాద్ సర్వీసులు యథాతథంగానే కొనసాగుతాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్ ఆగస్టు 20వ తేదీ వరకూ ఇదేవిధంగా కొనసాగుతాయి. -
జననేతకు ఘన స్వాగతం
‘పశ్చిమ’ వెళ్లేందుకు విమానంలో వచ్చిన జగన్ మధురపూడికి పోటెత్తిన జనసందోహం మధురపూడి (రాజానగరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధురపూడి విమానాశ్రయంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం ఆయన ఆదివారం మ«ధ్యాహ్నం 2.30 గంటలకు జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. జననేతకు స్వాగతం పలికేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జగ¯ŒSకు స్వాగతం పలికినవారిలో ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి నిర్మలకుమారి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్, కో ఆర్డినేటర్లు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రఘురామ్, కర్రి పాపారాయుడు, గుత్తుల సాయి, మిండగుదిటి మోహన్, గుర్రం గౌతమ్, చెల్లుబోయిన శ్రీను, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్మోహ¯ŒSరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజుబాబు, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ నాయకులు అడపా శ్రీహరి, సుంకర చిన్ని, వాసిరెడ్డి జమీలు, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు సాయిబాల పద్మ, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, పొట్టు సత్యనారాయణ, బండి అబ్బులు, కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. అడ్డుకున్న పోలీసులు జగ¯ŒSను చూసేందుకు వచ్చిన జనసందోహానికి పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. టెర్మినల్ భవనం లోపలికి వెళ్లేందుకు తమకు అనుమతివ్వకపోవడంపై, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్జో¯ŒS డీఎస్పీ ప్రసన్నకుమార్ను కురసాల కన్నబాబు నిలదీశారు. దీంతో ప్రధాన నాయకులకు అనుమతులు ఇచ్చారు. తరువాత కొల్లి నిర్మలాకుమారి తదితరులను అనుమతించకపోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ నిర్మలాకుమారిని అనుమతించలేదు. మెయి¯ŒSగేటు వద్దనే వాహనాలను నిలిపేశారు. దీంతో, అక్కడినుంచే అందరూ నడుచుకుంటూ టెర్మినల్కు చేరుకున్నారు. జగ¯ŒSను చూసేందుకు వచ్చిన అభిమానులు మెయి¯ŒS గేటు వద్దనే ఉండిపోయారు. -
నేడు, రేపు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
Advertisement