breaking news
Low Budget
-
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్ఫామ్లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్ఫామ్లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్ఫామ్లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!
రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్లో సెట్చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్ను తీసుకురావచ్చు!కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.కిచెన్లోనూ, డైనింగ్ టేబుల్పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు. సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.– ఎన్.ఆర్ (చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
సింపుల్ అండ్ గ్రేస్ఫుల్..!
‘డ్రెస్ని ఖరీదుతో చూడకూడదు. ఆ డ్రెస్ కలర్, ఫిటింగ్ మనకు ఎంత బాగా నప్పాయి... అనేవి చెక్ చేసుకొని తీసుకోవాలి’ అంటున్నారు హైదరాబాద్లోని భరత్నగర్ వాసి రాధ పర్వతరెడ్డి. తక్కువ బడ్జెట్లో డ్రెస్ డిజైనింగ్ని స్పెషల్గా, కంఫర్ట్గా, క్రియేటివ్గా ఎలా ప్లాన్న్ చేసుకుంటున్నారో వివరిస్తున్నారు.‘‘ఎంత సింపుల్గా రెడీ అయితే అంత గ్రేస్ఫుల్గా కనిపిస్తాం. అందుకే నా వార్డ్ రోబ్లో ప్లెయిన్ శారీస్కు ఎక్కువ చోటు ఉంటుంది. ప్లెయిన్ సిల్క్ శారీస్ జాబితా ఎక్కువే ఉంటుంది. వాటిలోనూ లైట్ కలర్స్వే తీసుకుంటాను. వీటికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్తో మ్యాచ్ చేస్తాను. పొడవుగా ఉన్నవారికి ఈ కాంబినేషన్ చీరలు బాగుంటాయి. గెట్ టు గెదర్ పార్టీలకు ఈ స్టైల్ బాగా నప్పుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకునే సదుపాయం ఉంది. యూ ట్యూబర్ని కాబట్టి స్పెషల్ లుక్స్ కోసం ట్రై చేస్తుంటాను. ఈ కాంబినేషన్కి హెయిర్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నా జుట్టు పొడవుగా ఉంటుంది. శారీ కట్టుకుంటే మాత్రం జుట్టుకి ఒక చిన్న క్లిప్ పెట్టుకొని, మిగతా హెయిర్ అంతా లీవ్ చేస్తుంటాను. జుట్టు బాగుంటే డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది కాబట్టి, హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. చందేరీ స్పెషల్దుపట్టా పెద్దగా ఉండే చుడీదార్స్ అంటే ఇష్టం. వీటిలోనూ లైట్ కలర్స్కే పప్రాధాన్యత. రెడీ టు వేర్ ఉండే డ్రెస్సులు ఈ జాబితాలో ఉంటాయి. పండగల సమయాల్లో అయితే చందేరీ శారీస్ ఎంచుకుంటాను. చందేరీ చీరల రంగులు బాగుంటాయి. చూడటానికి ప్రత్యేకంగానూ ఉంటాయి. ఏ సంప్రదాయ వేడుకల్లోనైనా ఈ చీరలు బాగుంటాయి. బ్లౌజ్కి కొంచెం డిజైన్ ఉన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేను వీటికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్లనే మ్యాచ్ చేసుకుంటాను. చందేరీ చీరల్లో బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్స్ ఎంచుకుంటాను. పెళ్లి వేడుకల్లో పట్టు చీరలు, లెహంగాలు ఎంచుకుంటాను. లెహంగాకు మ్యాచ్ చేయడానికి కొంచెం స్టైల్స్లో మార్పుకు క్రాప్టాప్స్, మ్యాచింగ్ దుపట్టాలు సెలెక్ట్ చేసుకుంటాను.ప్రింటెడ్ బ్లౌజులుబ్లౌజ్ డిజైన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనే విషయానికి చాలా దూరంగా ఉంటాను. ప్రింటెడ్ కాటన్ మెటీరియల్స్ చాలా రకాల డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో శారీ లుక్ స్పెషల్ అనిపించేలా డిజైన్ చేయిస్తాను. షార్ట్ స్లీవ్స్, స్ట్రాప్స్ .. యంగ్ లుక్ని మరింత ఎలివేట్ చేస్తాయి.సౌకర్యమే ఫస్ట్... టూర్స్కి వెళ్లినప్పుడు సౌకర్యానికే పప్రాధాన్యత. గంటల సమయాన్ని ప్రయాణంలోనే గడపాలి. అందుకని జీన్స్కు బదులు జెగ్గింగ్స్, టీ షర్ట్స్, నైట్ డ్రెస్లకే ఓటు వేస్తాను. ఎక్కువ లైట్ కలర్స్కి పప్రాముఖ్యం ఇచ్చినా నాకు ఇష్టమైన కలర్ మాత్రం బ్లాక్. లైట్–బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు నా వద్ద చాలానే ఉన్నాయి’’ అంటూ తన డ్రెస్ సెలక్షన్, కలెక్షన్ గురించి వివరించారు రాధ. (చదవండి: బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారా..? స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్న నిపుణులు) -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్లాండ్లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్కోర్వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్ల ధర రూ.15,000 లోపే..
భారత్లో రూ. 15,000 లోపు లభించే స్మార్ట్ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు అందుబాటు ధర కావడంతో చాలా మంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రూ. 15,000 లోపు ధరకు ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి కొన్ని ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! రియల్మీ 10 ధర: Rs.13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G99 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యుయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ 11 Prime 5G ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 Lite 5G ధర: రూ. 13,793 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ నార్జో 50 ధర: రూ. 12,580 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో T1 44W ధర:రూ. 14,408 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.44 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో G40 ఫ్యూజన్ ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 732G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 6000 mAh షావోమీ రెడ్మీ 10 Prime ధర: రూ. 11,180 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G88 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh మోటో G51 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 480 ప్లస్ ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 5000 mAh శాంసంగ్ గెలాక్సీ F41 128GB ధర: రూ. 14,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 9 Octa 9611 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 5 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh శాంసంగ్ గెలాక్సీ F23 5G ధర: రూ. 14,640 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 750G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ Note 11 SE ధర: రూ. 11,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G95 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh లిటిల్ M4 ప్రో ధర: రూ. 12,990 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 5G ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు!
రియల్మీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల శ్రేణిని విస్తరించింది. తాజాగా భారత్లో రియల్మీ C33 2023 ఎడిషన్ను పరిచయం చేసింది. ఇంతకు ముందు వచ్చిన రియల్మీ C33కి ఇది మెరుగైన వెర్షన్. HD+ డిస్ప్లే, Unisoc చిప్సెట్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. ఈ స్మార్ట్ఫోన్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మరొకటి 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. వీటిలో మొదటి వర్షన్ ధర రూ. 9,999 కాగా మరొకటి రూ.10,499. ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్లలో లభిస్తాయి. రియల్మీ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్ నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు . రియల్మీ C35 ఫోన్ విడుదలను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది దేశంలో మార్చి 21 న విడుదల కానుంది. రియల్మీ C33 2023 స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్టాకోర్ (octa-core) Unisoc T612 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ప్రాథమిక సెన్సార్ 50 ఎంపీ లెన్స్, సెకండరీ AI సెన్సార్, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మీరు కంటెంట్ క్రియేటర్లా..? ఐతే ఇది మీకోసమే..!
ప్రముఖ అకౌస్టిక్ కంపెనీ జేబీఎల్ నుంచి మరో ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. నాణ్య తతో కూడిన రికార్డింగ్ చేసేలా ఇందులో టెక్నాలజీ మిక్స్ చేసింది. గతంలోనూ జేబీఎల్ నుంచి ఈ తరహా ఉత్పత్తులు వచ్చినా... ఈసారి బడ్జెట్లో ఈ మైక్రోఫోన్ని మార్కెట్లోకి తెచ్చింది. చేతిలో ఎక్కడికైనా పట్టుకుపోయేలా డిజైన్ చేసింది. సోషల్ మీడియా వేదికగా పని చేసే కంటెంట్ క్రియేటర్లకు అనువుగా రూపుదిద్దింది. ఆ గాడ్జెట్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. అద్భుతమైన ఫీచర్లు జేబీఎల్ CSUM10 మీ దగ్గరుంటే రికార్డింగ్ స్టూడియో ఉన్నట్టే. ప్లగ్ అండ్ ప్లేగా డిజైన్ చేయడంతో దీన్ని ఉపయోగించడం తేలిక. ఇక డిజైన్ కూడా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా అవుట్డోర్ రికార్డింగులు తేలిగ్గా చేయోచ్చు. మైక్రోఫోన్ను సులువుగా వాడుకోవడానికి వీలుగా రౌండ్ మెటల్ డెస్క్ టాప్ స్టాండ్తో వస్తోంది. బాడీ మొత్తం ఫుల్ మెటల్ ఫినీషింగ్తో వస్తోంది. కంట్రోల్స్ విషయానికొస్తే.. బిగినింగ్ స్టేజ్లో ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సులువుగా దీన్ని వాడవచ్చు. మైక్రోఫోన్ ముందు భాగంలో రెండు బటన్స్ను ఉన్నాయి. వీటిలో ఒకటి వాల్యూమ్ కంట్రోల్ చేయోచ్చు. మరొకటి వాయిస్ను అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైవ్ ప్రోగ్రామ్స్కి తగ్గట్టుగా మ్యూట్ బటన్ కూడా ఇందులో ఉంది. డెస్క్టాప్/ ల్యాప్టాప్లతో కనెక్ట్ చేయడానికి యుఎస్బి-సి పోర్ట్ సౌకర్యం ఉంది. టైప్ సీ ఇయర్ ఫోన్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా 3.5 ఎంఎం ఇయర్ ఫోన్ జాక్కే చోటు కల్పించారు. తిరుగులేని పర్ఫార్మెన్స్ ఈ మైక్రో ఫోన్లో రెండు రకాల మోడ్లను ఏర్పాటు చేసింది జేబీఎల్. 1. ఒమ్నీ డైరక్షనల్ మోడ్(అన్ని దిశల నుంచి సమానంగా సౌండ్ రికార్డు అవుతుంది. ) 2.కార్డియాడ్ మోడ్ (మీకు 180 డిగ్రీల సమాంతరంగా రికార్డింగ్ చేస్తోంది ) ధర JBL CSUM10 డ్యూయల్ క్యాప్సూల్ కండెన్సర్ యూఎస్బీ రకం మైక్రోఫోన్ ధర రూ 5,799 గా ఉంది. JBL CSUM 10 బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోఫోన్. అతి తక్కువ ధరలో మల్టీ రికార్డింగ్ మైక్రోఫోన్ రావడం చాలా అరుదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ స్వరాన్ని రికార్డు చేయవచ్చును. మీకు ఈ మైక్రోఫోన్ ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఇంకేందుకు ఆలస్యం వెంటనే కొనేయ్యండి. చదవండి: అదిరిపోయిన వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్ -
దుమ్మురేపిన లోబడ్జెట్ సినిమాలు
భారీ బడ్జెట్తో కలెక్షన్లు కొల్లగొట్టవచ్చు అన్న బాలీవుడ్ మంత్రం ఇప్పుడు పనిచేయడం లేదు. సినిమాకు హీరో కంటే కథా బలమే ముఖ్యం. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్లో విడుదలైన చిత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలలలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలేవి పెద్దగా సందడి చేయలేదు. లో బడ్జెట్ సినిమాలు దుమ్ము దులిపాయి. జరా హట్కే ఫార్మెట్ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ బద్ధలు కొట్టాయి. గొప్ప స్క్రిప్ట్ ప్లస్ గ్రేట్ యాక్టర్స్ ప్లస్ లో బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టూ న్యూ ఫార్మూలా ఆఫ్ సక్సెస్ అంటోంది బాలీవుడ్. బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన ఎన్హెచ్-10 సినిమా బడ్జెట్ జస్ట్ 14 కోట్ల రూపాయలే. నాటక రంగానికి చెందిన నీల్ భూపాలమ్, అనుష్కా శర్మ ఈ సినిమాలో ఇరగదీశారు. దానికి ప్రేక్షకులు జై కొట్టారు. పగ, ప్రతీకారం చుట్టు తిరిగిన బద్లాపూర్ ప్రేక్షకుల మది దోచుకుంది. వరుణ్ అమాయక కళ్లు, రాధికా ఆప్టే బోల్డ్ యాక్టింగ్ సినిమాను విజయపథాన నిలిపాయి. ఈ సినిమా సక్సెస్ అంతా స్క్రిప్ట్ లోనే ఉందని సినీ విమర్శకులు అంటున్నారు. ఇంతకీ బద్లాపూర్ బడ్జెట్ ఎంతనుకుంటున్నారు? జస్ట్ 25 కోట్లు. దానికి రెండు రెట్లు సంపాదించారు నిర్మాతలు. బహుశా కలెక్షన్స్ వర్షం ఇంతగా కురుస్తుందని నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. అందమైన హీరో, అందాల ఆరబోత లేకున్నా సక్సెస్ సాధించొచ్చని నిరూపించింది దమ్ లాగా కే హైస్సా. హరిద్వార్, రిషికేశ్లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ మన గీతా సింగ్ను పోలి ఉంటుంది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందని బిగ్ బీ ట్వీట్ కూడా చేశాడంటే, ఆ సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైన్టీస్ ఫ్లేవర్ను తిరిగి గుర్తుకు తెచ్చారని ఆయన కామెంట్ కూడా చేశారు. ఏది ఏమైనా సినిమా సక్సెస్కు కావాల్సింది బిగ్ బడ్జెట్లు - పెద్ద స్టార్లు కాదు. స్టోరీ మే దమ్ రహ్నా అని నిరూపించాయి ఈ సినిమాలు. -
లోబడ్జెట్లో రిచ్ సినిమా