breaking news
lover murders girl friend
-
ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రియుడే ప్రేయసిని ముక్కముక్కలుగా చేసిన ఢిల్లీ మెహ్రౌలీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగిన దాదాపు ఆరు నెలల అనంతరం నిందితుడు అఫ్తాబ్ ఆమిన్ పూనావాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణ ఎలా జరిగింది? ఒక్క అబద్ద అఫ్తాబ్ను ఎలా పట్టించిందనే విషయాలను పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ► ప్రేయసి శ్రద్ధా వాకర్ను దారుణంగా హత్య చేసిన అనంతరం తనపై అనుమానం రాకుండా.. ఆమె ఇన్స్టాగ్రాం అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్తో ఇఫ్తాబ్ చాట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తే శ్రద్ధ చనిపోయిందని ఆమె స్నేహితులకు అనుమానం రాదని అతను భావించాడని చెప్పారు. అంతేకాదు మొబైల్ యాప్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు కూడా చేశాడని వివరించారు. ► శ్రద్ధ కన్పించడం లేదని ఆమె తండ్రి ముంబై వాసాయ్ పోలీస్ స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న పోలీసులు అఫ్తాబ్ను విచారణకు పిలిచారు. అయితే శ్రద్ధ మే 22నే ఢిల్లీ మెహ్రౌలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్లిపోయిందని అఫ్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులు ఫ్లాట్లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే(మే 18) ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరూ ఢిల్లీ మెహ్రౌలీ ఫ్లాట్కు మారి రెండు వారాలే అయింది. ► అయితే అఫ్తాబ్ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రౌలీలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు శ్రద్ధ ఖాతా నుంచి అఫ్తాబ్కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ► దీంతో పోలీసులకు అఫ్తాబ్పై మరోసారి అనుమానం వచ్చింది. వెంటనే అతడ్ని మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా తానే కడతానని, ఆమె పాస్వర్డ్లు, ఖాతా వివరాలు తనకు తెలుసునని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. తానే యాప్ ద్వారా శ్రద్ధ ఖాతా నుంచి తన ఖాతాలోకి డబ్బు పంపించుకున్నట్లు వివరించాడు. ► అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రాం చాట్ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మొహ్రౌలీలోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మే 22నే వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రౌలీలోనే ఎలా ఉందని ప్రశ్నించారు. ► అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అఫ్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టినట్లు భయానక నిజాన్ని చెప్పాడు. ఒక్కో పార్ట్ను ఒక్కోరోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. ► శ్రద్ధ తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి ఆగ్రహంతో ఆమెకు దూరంగా ఉన్నారు. ఎక్కడుంది? ఎలా ఉంది? అనే బాగోగులు పట్టించుకోలేదు. అయితే గత నెలలో ఆమె స్నేహితులకు కూడా శ్రద్ధ టచ్లో లేదని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అసలు విషయం వెలుగుచూసింది. ► శ్రద్ధ, అఫ్తాబ్ ఇద్దరూ ముంబై వాసాయ్ ప్రాంతానికి చెందినవారే. 2019లో డేటింగ్ యాప్లో పరిచయమైన వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏదాది మే లోనే ఢిల్లీకి మకాం మార్చారు. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచాడు. ఈ సమయంలో వేరే అమ్మాయిలను కూడా ఫ్లాట్కు పిలిచి డేటింగ్ చేశాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి.. మరో యువతితో.. -
పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమిస్తున్నానని అంటే నమ్మింది. సన్నిహితంగా మెలగడంతో గర్భందాల్చింది. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ప్రియుని చేతిలో సజీవదహనమై పోయింది. పుదుచ్చేరిలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి ఆరోరాలోని జీడిమామిడి తోటలో కాలిపోయిన స్థితిలో సుమారు 20 ఏళ్ల వయసున్న యువతి శవాన్ని గతనెల 30న పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. యువతి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఆమె ఎవరో గుర్తించేందుకు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈనెల 2న ఆరోరా పోలీసుస్టేషన్కు అప్పాదురై అనే యువకుడు వచ్చి తన అక్క మూడురోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అప్పాదురై, అతని తల్లి మనోరంజితం, ఇద్దరు సోదరిలను పుదుచ్చేరి బీమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి యువతి శవాన్ని చూపగా ఆమె లక్ష్మీనేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. హతురాలు లక్ష్మి పుదుచ్చేరి నెహ్రూ వీధిలోని దుకాణంలో పనిచేస్తుండగా అదే దుకాణానికి చెందిన వాహన డ్రైవర్ అరుణకుమార్తో స్నేహం ఏర్పడిందని, గత నెల 29న దుకాణానికి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన లక్ష్మి తిరిగి రాలేదని తల్లి మనోరంజింతం పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితునితో కలిసి లక్ష్మీని హత్యచేసినట్లు అంగీకరించాడు. -
ప్రేయసిని చంపి.. లోయలోకి విసిరేశాడు..
వాళ్లిద్దరూ విద్యావంతులే. ఉద్యోగం కూడా చేస్తున్నారు. మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఏమైందో ఏమోగానీ ఆ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా బెడ్షీట్లో శవాన్ని చుట్టచుట్టి లోయలోకి విసిరేశాడు. చెన్నై నగరంలో కలకలం రేపిన ఈ హత్యోదంతం సోమవారం రాత్రి జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దినేశ్ కన్నప్పన్ (25)కు ఎఫ్సీఐ ఉద్యోగిని అరుణ శ్రీనివాసన్ (22) తో చాలా కాలంగా పరిచయం ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించిన దినేశ్.. సోమవారం రాత్రి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో ఉన్మాదిగా మారిన దినేశ్ ఫ్లవర్ వాజ్ తో అరుణ తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ప్రియురాలి శవాన్ని బెడ్షీట్లో చుట్టి కారు డక్కీలో పెడుతుండగా స్థానిక యువకుడొకడు దినేశ్ చర్యను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. తాను అనుకున్న ప్రాంతానికి చేరుకున్న దినేశ్.. అరుణ మృతదేహాన్ని లోయలోకి నెట్టేశాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. హత్యకు దారితీసిన కారణమేమిటో ఇప్పటివరకు తెలియరాలేదని, దినేశ్ను దొరకబుచ్చుకొని ఇంటరాగేషన్ చేస్తేగానీ పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.