breaking news
lorry collide
-
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద లారీ బీభత్సం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న గూడ్స్ లారీ వేగంగా వచ్చి క్యూలైన్లలో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు ఇందల్వాయి ఏఎస్ఐ బాల్సింగ్ తెలిపారు. వేగంగా వస్తున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పినట్టు తెలుస్తోంది. గాయాలపాలైన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య) -
లారీలు ఢీకొట్టుకొని..
సాక్షి, వినుకొండ(గుంటూరు) : వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, రెండో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగం డెయిరీ నుంచి మార్కాపురం వెళ్తున్న పాల లారీ, కర్నూలు వైపు నుంచి కట్టెల లోడుతో వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు సంతగుడిపాడుకు చెందిన గూడా కొండారెడ్డి (38) ప్రాణాలు కోల్పోగా, తమిళనాడుకు చెందిన డ్రైవరు పాండీ తీవ్ర గాయాలవడంతో ప్రకాశం జిల్లా వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది బాధితుల్ని రక్షించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు.. నాదెండ్ల: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు–కర్నూలు రాష్ట్రీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ డి. చెన్నకేశవులు తెలిపిన వివరాల మేరకు.. సాతులూరు గ్రామానికి చెందిన వీరవల్లి గోపి (24) చందవరం రోడ్డులోని బీసీ కాలనీలో నివాసం ఉంటాడు. దగ్గర్లోని రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తుంటాడు. గురువారం రాత్రి విధుల్లోకి వెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వచ్చే క్రమంలో రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిఉన్న గోపీని ఎవరూ గమనించలేదు. ఆరు గంటల సమయంలో స్థానికులు గమనించి 108 సాయంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, తల్లి ఉన్నారు. ఎస్ఐ చెన్నకేశవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు చిన్నారులను చిదిమేసిన లారీ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్లో లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు మదర్సాలో చదువుకునేందుకు సైకిల్పై సయ్యద్ గౌస్(13), ముజాయిద్(14)లు బయలు దేరగా, నిజామాబాద్ నుంచి బోధన వెళ్తున్న లారీ(ఏపీ 20 డీబీ 5688) ఢీ కొంది. దీంతో లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృత దేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.